Showing posts with label సచిన్ టెండూల్కర్. Show all posts
Showing posts with label సచిన్ టెండూల్కర్. Show all posts

Wednesday, 4 January 2012

సచిన్ టెండూల్కర్ చౌక్‌గా మార్చవద్దు:మార్కండేయ కట్జూ

చాందినీ చౌక్ పేరును సచిన్ టెండూల్కర్ చౌక్‌గా మార్చాలనే ప్రతిపాదనపై ప్రెస్ కౌన్సిల్ చైర్‌పర్సన్ జస్టిస్ మార్కండేయ కట్జూ తీవ్ర అభ్యంతరం లేవనెత్తారు. చాందినీ చౌక్ పేరును మార్చడం దేశ సాంస్కృతిక వారసత్వాన్ని అవమానించడమేనని కట్జూ అన్నారు. చాందినీ చౌక్ పేరు మార్పుపై అభ్యంతరం తెలుపుతూ ఢిల్లీ మేయర్ రజనీ అబ్బీకు డాక్టర్ కేఎన్ కట్జూ మెమోరియల్ ట్రస్ట్ తరుపున లేఖను రాశారు. సచిన్ టెండూల్కర్ చౌక్‌గా పేరును మార్చే ప్రతిపాదన వార్తను జాతీయ దినపత్రికల్లో చూశానని.. చాందినీ చౌక్ పేరు మార్చడం అభ్యంతరకరమైందని.. దారుణమైన విషయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. షాజహాన్ చక్రవర్తి కాలంలో నిర్మించిన చాందినీ చౌక్ పేరు మార్చడం ప్రాచీన ఢిల్లీ నగర చరిత్రను అవమానించడమేనని ఆయన అన్నారు.

Tuesday, 3 January 2012

2012లో సచిన్ వందో సెంచరీ చేస్తాడా...?

2012వ సంవత్సరం క్రీడాభిమానులకు కొత్త అనుభూతిస్తుందా? లేదా అనేది ఇప్పడు ఓ పెద్ద మిస్టరీగా మారింది. ఇందుకు కారణాలు రెండు. ఒకటి క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ తన వందో సెంచురీని ఈ సంవత్సరంలో పూర్తి చేస్తాడని అభిమానులు నమ్ముతుండగా, 2012వ సంవత్సరం ఒలంపిక్స్‌కు ఆతిధ్య సంవత్సరం. 2012లో జరగనున్న ఒలంపిక్ గేమ్స్‌కి లండన్ ఆతిధ్యమివ్వనున్న సంగతి తెలిసిందే. ఐతే ఈ సంవత్సరం ఈ రెండు విషయాలు ఖచ్చితంగా జరుగుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. మొదటి టెస్టుని కొల్పోయిన టీమిండియాకు రెండవ టెస్టు జరగనున్న సిడ్నీ స్టేడియం ఒకింత కలసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. సిడ్నీ గ్రౌండ్‌లో సచిన్‌ రికార్డు చాలా మెరుగ్గానే ఉంది. 1992 నుంచి ఇప్పటి వరకు సిడ్నీలో జరిగిన నాలుగు టెస్ట్‌ల్లో సచిన్‌ టెండూల్కర్‌ పాల్గొని, తన సత్తా చాటాడు. 148 నాటౌట్‌(1992), 241 నాటౌట్‌(2004), 154 నాటౌట్‌ (2008). దీంతో పాటు 221 పరుగుల సరాసరితో సచిన్‌ పేరిట సిడ్నీ రికార్డు ఉంది. ఇదే స్ఫూర్తితో సిడ్నీ పిచ్‌పై సచిన్‌ టెండూల్కర్‌ సెంచరీ చేయడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. ఇంకా ఈ గ్రౌండ్ విశేషం ఏమిటంటే వందో టెస్ట్‌ మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తోంది. ఇది మాత్రమే కాకుండా సచిన్ వందో సెంచురీ సాధించాలే వారిలో ఆస్టేలియా ప్రధాని జూలియా గిలార్డ్ కూడా చేరారు. ఈ సందర్బంలో ఆమె ఆదివారం సిడ్నీలో ఏర్పాటు చేసిన తేనీటి విందులో మాట్లాడుతూ ప్రస్తుత టెస్ట్‌ సీరీస్‌లో సచిన్‌ టెండూల్కర్‌ తన నూరవ అంత ర్జాతీయ శతకం సాధించాలనే ఆకాంక్షను గిలార్డ్‌ వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు 99 అంతర్జాతీయ సెంచరీలు స్కోర్‌ చేసిన సచిన్‌ టెండూల్కర్‌ను గిలార్డ్‌ చూస్తూ, ‘మా క్రికెట్‌ జట్టును ఆస్ట్రేలియన్లు గట్టిగా సమర్థిస్తున్నా ఈ సీరీస్‌లో ఏదో ఒక సమయంలో (టెండూల్కర్‌ నుంచి) ఎంతో ప్రత్యే కమైన 100 స్కోర్‌ కోసం వారు ఎదురుచూస్తున్నారని నా భావన’ అని చెప్పారు.

Monday, 26 December 2011

సచిన్ టెండూల్కర్ బౌలింగ్‌కు కుమారుడి బ్యాటింగ్

సచిన్ టెండూల్కర్ బౌలింగు చేస్తే కుమారుడు అర్జన్ బ్యాటింగ్ చేశాడు. మెల్బోర్న్ క్రికెట్ మైదానంలో దాదాపు అర గంట పాటు ఇండోర్ నెట్స్‌లో సచిన్ టెండూల్కర్ తన కుమారుడికి  బౌలింగ్ చేశాడు. ఈ వ్యవహారాన్ని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ చూస్తూ ఉండిపోయారు. ఆ తర్వాత వీరేందర్ సెహ్వాగ్‌కు అర్జున్ బౌలింగ్ చేశాడు. నీ ఫేవరైట్ షాట్ ఏమిటిని డీన్ జోన్స్ యంగ్ అర్జున్‌ను ప్రశ్నించాడు. అతనికి ఎవరు కోచింగ్ ఇస్తున్నారు, ట్వంటీ20 మ్యాచులను ఇష్టపడతాడా వంటి ప్రశ్నలను కూడా అతను వేశారు. జెఫ్ మార్ష్ తన కుమారుడు షాన్‌ను నెట్స్‌కు తెచ్చేవాడట. క్రికెటర్లు తమ పిల్లలను నెట్స్‌కు తెస్తే అద్భుతంగా ఉంటుందని డీన్ జోన్స్ అంటున్నారు. నెట్స్‌లో పిల్లలు క్రికెటర్ల గడిపితే చాలా ఉపయోగం అవుతుందని ఆయన అన్నారు. తండ్రి నైపుణ్యాన్ని అర్జున్ పుణికి పుచ్చుకుంటే ఫరవాలేదని ఆయన అన్నారు. ఇటీవలి స్కూల్ మ్యాచులో తాను సెంచరీ చేసినట్లు అర్జున్ చెప్పాడని ఆయన అన్నారు. ఓ ఆటలో ఎనిమిది వికెట్లు తీసుకున్న విషయాన్ని కూడా అర్జన్ చెప్పాడట.

Tuesday, 6 December 2011

సచిన్ టెండూల్కర్ ఒపస్ అభిమానుల నుండి భారీ స్పందన

సచిన్ టెండూల్కర్ క్రికెట్ ప్రపంచానికి దేవుడు. క్రికెట్ రంగంలో భారతీయులు గర్వంగా చెప్పుకునే పేరు సచిన్. అలాంటి సచిన్ టెండూల్కర్ క్రికెట్ చరిత్రలో సృష్టించని రికార్డు లేదు. దీంతో సచిన్ టెండూల్కర్ జీవిత విశేషాలను సంబంధించిన అరుదైన ఫోటోలతో రూపొందిస్తున్న 'సచిన్ టెండూల్కర్ ఒపస్' తొలి పుస్తకాన్ని సొంతం చేసుకునేందుకు గాను ఫేస్‌బుక్లో సచిన్ వీరభిమాని 3 లక్షల 50 వేల డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ. కోటి 80 లక్షలు)కు బిడ్ వేశాడు. సచిన్ ఒపస్ పేరుతో రూపొందించిన ఈ ఫేస్ బుక్ ఎకౌంట్‌ని సుమారు 50 లక్షల మంది ఫాలో అవుతున్నారు.ఫేస్‌బుక్లో ఇండియాలో ఏఆర్ రెహామాన్ పేజి తర్వాత ఎక్కువ మంది ఫాలో అవుతున్న ఫేస్‌బుక్ పేజి ఇదే కావడం విశేషం. 2010వ సంవత్సరంలో ఈ పుస్తకం కోసం ఒక వ్యక్తి రూ 35. 2 లక్షలకు బిడ్ వేయడం జరిగింది. సచిన్ వందో సెంచురీ పూర్తి అయిన వెంటనే ఈ పుస్తకాన్ని మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ పుస్తకం 95 శాతం పూర్తి అయిందని ఒపస్ మీడియా గ్రూప్ సీఈవో కార్ల్ ఫోలర్ పేర్కొన్నారు.ఇక ఈ పుస్తకం విశేషాలను గనుక గమనించినట్లైతే 37 కేజీల బరువుతో పాటు 700 పేజీలు ఇందులో ఉంటాయి. ప్రపంచంలో మొట్టమొదటి సారి ఓ క్రికెటర్‌పై పుస్తకం రావడం ఇదే మొట్టమొదటి సారి. ఈ పుస్తకంలో ఉన్న ప్రతి పేజీ కూడా 18*18 సైజులో ఉంటుంది. మంచి నాణ్యతతో రావాలనే ఉద్దేశంతో దీన్ని యంత్రాలతో కాకుండా చేతితోనే బైండింగ్ చేస్తున్నారు. సచిన్ గురించి ఆయా రంగాల్లో ప్రముఖుల వ్యాఖ్యానాలు ఉంటున్నప్పటికీ ఈ పుస్తకానికి ఫొటోలే ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. ఇప్పటికే మాస్టర్‌ను ఏడడుగుల ఎత్తుండే పొలరాయిడ్ కెమెరాతో షూట్ చేశారు. ప్రపంచ ప్రసిద్ధ ఫొటోగ్రాఫర్ గ్జెనాన్ టెక్సేరియా ఈ ప్రాజెక్టులో పనిచేశాడు.

Saturday, 26 November 2011

సచిన్ వందో సెంచరీ ఎందుకలా చేతులెత్తేస్తున్నాడు?

సచిన్ వ్యక్తిగతంగా ఒత్తిడికి గురవుతున్న సమయంలోనే, అభిమానుల నుంచి కూడా తీవ్రమైన ఒత్తిడి ఉందనే విషయాన్ని కూడా ఆయన మరిచిపోయినట్లు లేరు. అందుకే అతను వందో సెంచరీకి కొత్తగా ఆడుతున్న ఆటగాడిలా వ్యవహరిస్తున్నాడు.
సొంత గడ్డపై సచిన్ టెండూల్కర్ తన వందో సెంచరీ సాధించి వంద బంగారు నాణేలను అందుకోవడమే కాకుండా కోట్లాది భారత అభిమానుల గుండెల్లో హర్షాతిరేకాలు నింపుతాడని విశ్వాసం గట్టిగానే ఉండింది. కానీ వెస్టిండీస్ బౌలర్ రాంపాల్ కోట్లాది మంది భారతీయులకు గుండె కొతనే మిగిల్చాడు. సెంచరీకి ఆరు పరుగుల దూరంలో ఉండగా సచిన్ టెండూల్కర్‌ను రాంపాల్ అవుట్ చేశాడు. టెండూల్కర్ రాంపాల్ వేసిన బంతికి సెకండ్ స్లిప్‌లో సామీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరుకున్నాడు. క్రికెట్ ప్రపంచ కప్ పోటీల నుంచి సచిన్ టెండూల్కర్ వందో సెంచరీ కోసం నిరీక్షిస్తున్నాడు. వెస్టిండీస్‌పై 90ల్లో అవుట్ కావడం ఆయనకు ఇదే మొదటిసారి. ఇప్పటి వరకు అతను టెస్టుల్లో 90 పరుగులు దాటిన తర్వాత పదో సారి అవుటయ్యాడు. వన్డేల్లో అలా అవుట్ కావడం 18వ సారి. ప్రపంచ నెంబర్ వన్ బ్యాట్స్‌మన్‌గా పేరు పొందిన సచిన్ టెండూల్కర్ కూడా మానవ మాత్రుడే. అతనిపై విపరీతమైన ఒత్తిడి పనిచేస్తున్నట్లు ఇటీవలి కాలంలో అవుటవుతున్న తీరు తెలియజేస్తోంది. తన సహజమైన ఆటను కూడా అతను ఒత్తిడిలో మరిచిపోతున్నట్లున్నాడు. తాను ఓ ఫీట్‌ను సాధించాల్సిన అవసరం ఉందనే భావన అతని గుండెను, మెదడును నిత్యం తొలిచి వేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఎప్పటిలాగే తాను మరో మ్యాచ్ ఆడబోతున్నాననే అభిప్రాయంతోనే సచిన్ టెండూల్కర్ మైదానంలోకి దిగి, వందో సెంచరీ చేయాలన్న విషయాన్ని మనసులోంచి తుడిచి వేసి ఆడితే సచిన్‌కు సెంచరీ సాధించడం బహుశా, కష్టమైన పని కాకపోవచ్చు.