రిమాండ్
రిపోర్టులో 7వ పేజీ కనిపించడంలేదని, ఆ రిపోర్టును బయట పెట్టాలని, ఓ
మంత్రిని కాపాడటానికి సీఎం ఇలా చేశారని చంద్రబాబు ఆరోపించారు. ఈ విషయంలో
మరో మంత్రి బహిరంగగా చెప్పారన్న విషయాన్ని బాబు గుర్తుచేశారు.దీంతో సభలో
టీడీపీ నేతలు నిరసన తెలిపారు. దీనిపై ముద్దుకృష్ణమ మాట్లాడుతూ
తనపై పోలీసుల కేసు ఉంటే వివరాలు చెప్పాలని, దేనికైనా సిద్దంగా ఉన్నాన ని
సవాల్ చేశారు. ఏసీబీ రిపోర్టుపై చర్చ జరపాల్పిందే అని, ఏసీబీ రిపోర్టు సభలో
పెట్టాలని డిమాండ్ చేశారు. తన సామాజికవర్గానికి చెందిన మంత్రిని
కాపాడుకోడానికి మోపిదేవిని ఇరికించారని స్వయానా మంత్రి డీఎల్ అన్నారని గాలి
తెలిపారు. దేశంలోనే మద్యం కుంభకోణం అతిపెద్దదని ముద్దకృష్ణమ అన్నారు.మద్యం సిండికేట్ల వ్యవహారంపై మంత్రి కన్నా ఇచ్చిన వివరణపై
టీడీపీ అసంతృప్తి
వ్యక్తం చేసింది. ఏసీబీ రిమాండ్ రిపోర్టు బయటపెట్టాలని, ముడుపులు
తీసుకున్న ప్రజాప్రతినిధులు సభలో దర్జాగా కూర్చున్నారని, అధికారులు జైల్లో
ఉన్నారని ఇది ఎంతవరకు సమంజసమని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు
ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.ఈ వ్యవహారంపై శుక్రవారం సభలో చంద్రబాబునాయుడు
మాట్లాడుతూ నున్న వెంకట రమణ
ముమ్మాటికీ కాంగ్రెస్ కార్యకర్తే అంటూ సభలో ఆధారాలను చూపించారు.Friday, 24 February 2012
ఏసీబీ రిమాండ్ రిపోర్టు బయటపెట్టాలి..చంద్రబాబు డిమాండ్
రిమాండ్
రిపోర్టులో 7వ పేజీ కనిపించడంలేదని, ఆ రిపోర్టును బయట పెట్టాలని, ఓ
మంత్రిని కాపాడటానికి సీఎం ఇలా చేశారని చంద్రబాబు ఆరోపించారు. ఈ విషయంలో
మరో మంత్రి బహిరంగగా చెప్పారన్న విషయాన్ని బాబు గుర్తుచేశారు.దీంతో సభలో
టీడీపీ నేతలు నిరసన తెలిపారు. దీనిపై ముద్దుకృష్ణమ మాట్లాడుతూ
తనపై పోలీసుల కేసు ఉంటే వివరాలు చెప్పాలని, దేనికైనా సిద్దంగా ఉన్నాన ని
సవాల్ చేశారు. ఏసీబీ రిపోర్టుపై చర్చ జరపాల్పిందే అని, ఏసీబీ రిపోర్టు సభలో
పెట్టాలని డిమాండ్ చేశారు. తన సామాజికవర్గానికి చెందిన మంత్రిని
కాపాడుకోడానికి మోపిదేవిని ఇరికించారని స్వయానా మంత్రి డీఎల్ అన్నారని గాలి
తెలిపారు. దేశంలోనే మద్యం కుంభకోణం అతిపెద్దదని ముద్దకృష్ణమ అన్నారు.మద్యం సిండికేట్ల వ్యవహారంపై మంత్రి కన్నా ఇచ్చిన వివరణపై
టీడీపీ అసంతృప్తి
వ్యక్తం చేసింది. ఏసీబీ రిమాండ్ రిపోర్టు బయటపెట్టాలని, ముడుపులు
తీసుకున్న ప్రజాప్రతినిధులు సభలో దర్జాగా కూర్చున్నారని, అధికారులు జైల్లో
ఉన్నారని ఇది ఎంతవరకు సమంజసమని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు
ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.ఈ వ్యవహారంపై శుక్రవారం సభలో చంద్రబాబునాయుడు
మాట్లాడుతూ నున్న వెంకట రమణ
ముమ్మాటికీ కాంగ్రెస్ కార్యకర్తే అంటూ సభలో ఆధారాలను చూపించారు.కర్నూలు జిల్లాలో చిరుతను బంధించిన గ్రామస్థులు
కర్నూలు జిల్లాలో ఓ చిరుత హల్చల్ చేసింది. ముప్పుతిప్పలు పెట్టి
ఎట్టకేలకు గ్రామస్తుల చేతిలో బందీగా మారింది. డోన్ మండలం చనుగొడ్ల
గ్రామంలో గొర్రెల కోసం వచ్చిన చిరుతను కుక్కలు వెంబడించటంతో భయపడిన చిరుత
చెట్టు పైకెక్కింది. ఇది చూసిన గ్రామస్తులు చిరుతను పట్టుకునేందుకు
ప్రయత్నించారు.పారిపోతున్న చిరుతను గ్రామస్తులంతా రాళ్లతో దాడిచేసి
ప్రాణాలతో పట్టుకున్నారు. కొనఊపిరితో ఉన్న చిరుతను గ్రామంలో ఊరేగింపు
నిర్వహించిన అటవీశాఖ అధికారులకు అప్పగించారు. నెలరోజులుగా చిరుత
సంచరిస్తోందని అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని గ్రామస్తులు
చెప్తున్నారు.Thursday, 23 February 2012
'అనంత' రైతులను అ కారణంగా చితకబాదిన ఎస్ఐ
న్యాయం చేయాల్సిన పోలీసులే అకారణంగా రెచ్చిపోయారు. ఇద్దరు రైతులపై
ప్రతాపం చూపించారు. ఏ తప్పూ చేయకున్నా వారిని ఇష్టారాజ్యంగా కొట్టారు. తమనే
ప్రశ్నిస్తావా అంటూ ఓ రైతుని... తమ వాహనాన్ని ఢీకొట్టాడంటూ మరో రైతును
విచక్షణా రహితంగా చితకబాదారు. పోలీసు స్టేషన్లోనే వారిని తీ వ్రస్థాయిలో
దుర్భాషలాడారు. అక్కడి తో ఆగకుండా ఇష్టం వచ్చినట్లు చితకబాదారు. దీంతో గ్రా
మం మొత్తం ఏకమైంది.అప్పటికే పో లీసుల తీరుపై అసహనంగా ఉన్న గ్రా
మస్థులు వారి వ్యవహారాన్ని సహించలేకపోయారు. అకారణంగా రైతుపై పోలీసులు
ఝులుం ప్రదర్శించారం టూ స్థానిక పోలీసు స్టేషన్ని ముట్టడించారు. ఎనిమిది
గంటలపాటు రా స్తారోకో నిర్వహించారు. రైతులను అ కారణంగా చితకబాదిన
కొత్తచెరువు ఎస్ఐ ఇస్మాయిల్, కానిస్టేబుళ్లు బా బా, చెన్నకేశవులుపై చర్యలు
తీసుకో వాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.ఎనిమిది గంటలపాటు ఆందోళన..
ఉదయం పదకొండు గంటల సమయంలో ఇదంతా జరిగింది. మధ్యా హ్నం 12గంటల నుంచి రాత్రి
ఏడువరకు గ్రామస్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఎనిమిది గంటలపాటు
పోలీసుస్టేషన్ ఎదుట బైఠాయించా రు. నెహ్రూసర్కిల్లో రాస్తారోకో చేశా రు.
రైతు గోపాల్, నాగేంద్ర ఏమి త ప్పుచేశారని పోలీసులు చితకబాదారం టూ
ప్రశ్నించారు. ఎటువంటి వివాదాలకు వెళ్లని తనభర్తను రోడ్డువెంబడి కొ
ట్టుకుంటూ పోలీసు స్టేషన్కి తీసుకువచ్చారంటూ గోపాల్ భార్య గిరిజ ఆవేదన
వ్యక్తం చేసింది. పలువురు గ్రామస్థులు ఆమెకు మద్దతుగా తరలివచ్చా రు.
పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పో లీసుస్టేషన్పై దాడులకు దిగే స్థాయి లో
గ్రామస్థులు ఉద్యమించారు. ఆం దోళనకారుల నిరసనలతో కొత్తచెరువు
అట్టుడికిపోయింది. విషయం తెలుసుకున్న డీఎస్పీ నవాబ్జాన్, ఎనిమిది మంది
సీఐలు కొత్తచెరువుకు చేరుకున్నారు. భారీఎత్తున అదనపు పోలీసు బలగాలు
మోహరించాయి. డీఎస్పీ, సీఐలు గ్రామస్థులతో చర్చించి, ఆందోలనకారులకు
సర్దిచెప్పే ప్రయత్నం చే సినా ఫలితం లేకపోయింది. ఓ సందర్భంలో నేరుగా ఎస్పీ
షహనవాజ్ఖా సీం జోక్యం చేసుకుని ఫోన్ద్వారా గ్రా మంలోని పెద్దలతో
చర్చించారు. ఎస్ ఐ ఇస్మాయిల్ చేష్టలతో విసిగిపోయిన ప్రజలు ఏమాత్రం వెనక్కు
తగ్గకుండా ఆందోళనకు సిద్ధపడ్డారు. ఎస్ఐని స స్పెండ్ చేయాలని డిమాండ్
చేశారు. తమ దెబ్బలకు గాయపడిన రైతులు గ్రామస్థుల కంట పడకుండా పోలీసు లు పలు
స్టేషన్లకు తరలించారు. గా యపడ్డ రైతులను తీసుకురావాలని గ్రామస్థులు
పట్టుపట్టడంతో సాయం త్రం ఆరుగంటలకు వారిని గ్రామస్థులకు చూపించారు. అనంతరం
పెనుకొండ ఆస్పత్రికి తరలించారు.ప్రత్యేక విచారణకు ఆదేశం..
కొత్తచెరువులో రైతులను ఎస్ఐ, కానిస్టేబుళ్లు చితకబాదడంపై ఎస్పీ
షహనవాజ్ఖాసీం ప్రత్యేక విచారణకు ఆదేశించారు. విచారణాధికారిగా పెనుకొండ
డీఎస్పీని నియమించినట్లు గ్రా మప్రముఖులతో ఎస్పీ ఫోన్ద్వారా వివరించారు.
జైలుకు పంపించాలని కాంగ్రెస్ కుట్ర....చంద్రబాబు
శాసనసభలో ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు
మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. ఎమ్మార్ పాపం చంద్రబాబుదేనని సీఎం కిరణ్
చేసిన వ్యాఖ్యలతో సభలో కలకలం చెలరేగింది. ముఖ్యమంత్రి తనను బ్లాక్ మెయిల్
చేస్తున్నారని చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు టీడీపీ సభ్యులు
సీఎం ప్రసంగానికి పదేపదే అడ్డుతగిలారు. కిరణ్ ప్రసంగాన్ని కొనసాగిస్తూనే
వాస్తవాలు వినేందుకు టీడీపీ సభ్యులు సిద్ధంగా లేరని అన్నారు. గుమ్మడికాయ
దొంగ అంటే చంద్రబాబు భుజాలు తడుముకుంటున్నారని ఎద్దేవా చేశారు. దీంతో
టీడీపీ సభ్యులు సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. స్పీకర్ పోడియం వద్ద
నిల్చుని నినాదాలు చేశారు. స్పీకర్ కోరినప్పటికీ అక్కడి నుంచి కదలలేదు.
దీంతో సభ కొన్ని నిమిషాల పాటు స్తంభించింది. నన్ను జైలుకు పంపించాలని కాంగ్రెస్ నాయకులు ఎప్పటినుంచో విఫల యత్నం
చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు
ఆరోపించారు. నన్ను జైలుకు పంపించడం ఎవరి తరమూ కాదని కూడా ఆయన
హెచ్చరించారు.రాష్ట్ర శాసన సభలో గురువారంనాడు జరిగిన చర్చలో తమపై వచ్చిన ఆరోపణలకు
సమాధానం చెబుతూ తాము చేసిన అభివృద్ధిని చూసి కాంగ్రెస్ కుళ్లుకుంటోందని ఆయన
అన్నారు. రాష్ట్రానికి కన్వెన్షన్ సెంటర్లు తీసుకువచ్చిన ఘనత తమదేనని
వివరిస్తూ, గచ్చిబౌలి స్టేడియంను తాము తీసుకువస్తే, కాంగ్రెస్ నాయకులు ఈ
ప్రతిష్ఠాత్మకమైన స్టేడియంను సమావేశాలకు వాడుకుంటూ ఆ స్టేడియంను నాశనం
చేసేశారని ఆయన వివరించారు. వీటిని హైదరాబాద్కు తీసుకువచ్చిన ఘనత మాకే
చెందుతుందని చంద్రబాబు నాయుడు వివరిస్తున్నప్పుడు అధికార పక్ష సభ్యులు గొడవ
సృష్టించారు.
Wednesday, 22 February 2012
టీమిండియా క్రికెట్ జట్టులో అంతర్గత పోరు!
టీమిండియాలోని అంతర్గత పోరు నిజమేనని తేలిపోయింది. రొటేషన్ కారణంగా విభేదాల
గుట్టు రట్టయింది. ధోనీకి వీరేంద్ర సెహ్వాగ్ చురకలు వేయడం ద్వారా
విభేదాలను బయట పెట్టారు. సీనియర్ల ఫీల్డింగ్పై ధోనీ చేసిన వ్యాఖ్యలపై
ఇప్పటికే సీనియర్లు మండిపడుతున్నారు. తాజాగా, సెహ్వాగ్ గొంతు విప్పాడు.
మంగళవారం లంక తో ఓటమితో అనంతరం మీడియా సమావేశంలో నేరుగా ధోనీపై విమర్శలు
చేశాడు. ఫీల్డింగ్లో మందకొడిగా ఉంటున్నామని తనకు కాని ఇతర సీనియర్లకు కానీ
ఎప్పు డూ చెప్పలేదని ఆయన అన్నాడు. 'అతను ధోనీ ఏమి మాట్లాడాడో, మీడియాలో ఏ
కథనాలు వస్తున్నాయో నాకు తెలీదు. వచ్చే ప్రపంచ కప్ ఇక్కడ జరుగనుండడంతో ఆ
టోర్నీలో ఆడే జూనియర్లకు వన్డేల్లో అవకాశమివ్వాలని మాతో చెప్పాడు' అని
సెహ్వాగ్ చెప్పాడు.సచిన్, వీరూ, గంభీర్ వల్ల ఫీల్డింగ్ సమస్యలు
ఎదురవుతున్నాయని, అందువల్లే వీరిని రొటేషన్ పద్ధతిలో పక్కనపెడుతున్నామని
ధోనీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, వైస్ కెప్టెన్ వీరేంద్ర
సెహ్వాగ్కు మధ్య వివాదానికి సంబంధించి మరో కొత్త విషయం వెలుగులోకి
వచ్చింది. శ్రీలంకపై జరిగిన మ్యాచుకు ముందు తుది జట్టు కూర్పుపై ఇరువురి
మధ్య తీవ్ర విభేదాలు తలెత్తినట్లు వార్తలు వచ్చాయి. తుది జట్టులోకి
తీసుకోవాల్సిన 11 మంది ఆటగాళ్లపై వారిద్దరి మధ్య వివాదం చోటు చేసుకున్నట్లు
తెలుస్తోంది. శ్రీలంకపై ఆడే జట్టులోకి రోహిత్ శర్మను తీసుకోవాలని
ధోనీ సూచించగా, ఆ మ్యాచుకు కెప్టెన్సీ చేసిన సెహ్వాగ్ ముగ్గురు సీనియర్
ఆటగాళ్లతో ఆడడానికి మొగ్గు చూపాడు. ఈ వివాదం తెలిసి బిసిసిఐ దిగ్భ్రాంతికి
గురైనట్లు చెబుతున్నారు. డ్రెసింగ్ రూంలోనే వివాదాన్ని పరిష్కరించుకోవాలని
బిసిసిఐ వారికి సూచించింది. ఈ సంఘటన తమను తీవ్ర కలవరానికి గురి చేసిందని,
సీనియర్ ఆటగాళ్లు ఆ విధంగా ప్రవర్తించడం తాము ఇది వరకు చూడలేదని బిసిసిఐ
వర్గాలు వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. పైగా, శ్రీలంకపై ఘోరంగా ఓటమి
పాలైన తర్వాత కెప్టెన్గా వ్యవహరించిన సెహ్వాగ్ ధోనీపై తీవ్ర వ్యాఖ్యలు
చేశాడు.కిరణ్-చంద్రబాబు శాసనసభలో తీవ్ర వాగ్వివాదం
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, చంద్రబాబునాయుడికి మధ్య బుధవారం
శాసనసభలో తీవ్ర వాగ్వివాదం జరిగింది. బాబు శానససభలో ప్రసంగిస్తుండగా
ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని - చంద్రబాబు వాడిన భాషపై అభ్యంతరం తెలిపారు.
మాటిమాటికీ దోచుకున్నారని, దోపిడీ చేశారని చంద్రబాబు అంటున్నారని, అదేదో
గొప్పని అనుకుంటున్నారని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. చంద్రబాబు ఆవేశంతో
ఉన్నారని, అన్ని విషయాల గురించి మాట్లాడుతున్నారని, అయితే ప్రజా తీర్పును
చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు ఏ విధంగా
మాట్లాడాలో ఆలోచించుకుని మాట్లాడాలని ఆయన అన్నారు.శాంతి భద్రతలు పరిస్థితి
అధ్వాన్నంగా తయారయిందన్నారు. భానుకిరణ్ ఎక్కడున్నాడో తెలియని పరిస్థితి
ఏర్పడిందన్నారు. మైలవరం దుర్ఘటనపై ఎందుకు చర్యలు తీసుకోలేదని
ప్రశ్నించారు. ప్రాణహిత-చేవెల్ల ప్రాజెక్టుకు జాతీయహొదా కల్పించలేకపోవడం
ప్రభుత్వం చేతగానితనంగా పేర్కొన్నారు. రైల్వే బడ్జెట్ లో రాష్ట్రానికి
అన్యాయం జరిగిపోయిందన్నారు. రాష్ట్రంపై కేంద్రం ఎందుకు వివక్ష చూపుతోందని
ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం విచ్చలవిడిగా ప్రవర్తిస్తోందని ఆరోపించారు. అవినీతి మంత్రులు
ఎందుకు రాజీనామా చేయరని ఆయన ప్రశ్నించారు. మద్యం సిండికేట్ లో ప్రమేయం
ఉన్నట్లు ఆరోపణలు వచ్చినా మంత్రి రాజీనామా చేయలేదన్నారు. ముఖ్యమంత్రి కూడా
ఆయనపై చర్యలు ఎందుకు తీసుకోలేదని నిలదీశారు. ఈ ప్రభుత్వం అవినీతిని
నియంత్రించలేకపోతుందన్నారు. 4700 కోట్ల రూపాయల విలువైన పోలవరం ప్రాజెక్టు
కాంట్రాక్ట్ ని అర్హతలేని కంపెనీకి ఇచ్చి, ఆ తరువాత రద్దు చేశారన్నారు.
మంత్రుల మాటలు విన్న అధికారులు జైళ్లలో ఉన్నారని గుర్తు చేశారు. ప్రభుత్వ
అవినీతి వల్ల వోక్సు వ్యాగన్ పూనేకు వెళ్లిందన్నారు. ఒక్క పరిశ్రమ కూడా
ఇక్కడకు రావడంలేదని బాధపడ్డారు. రాజీవ్ గృహ కల్పపేరుతో డబ్బు వసూలు చేసి
ఇళ్లు కట్టించలేదని విమర్శించారు. ఈ ప్రభుత్వం రైతులకు సాయం చేస్తుందంటే నమ్మాలా అని చంద్రబాబు ప్రశ్నించారు.
మిగిలిన రాష్ట్రాల్లో రైతుకు మద్దతు ధర ఉంటే మన రాష్ట్రంలోనే లేదన్నారు.
కాంగ్రెసు మాటలు కోటలు దాటేలా ఉన్నా చేతలు గడప దాటడం లేదన్నారు. ఢిల్లీలో
పదవుల కోసం పైరవీలే తప్ప ప్రజా సమస్యలు వీరికి పట్టడం లేదన్నారు.
గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకుంటున్నారన్నారు. రాష్ట్రం నుండి 32
మంది పార్లమెంటు సభ్యులు ఉన్నప్పటికీ రైల్వే బడ్జెట్ విషయంలో కేంద్రంపై
ఒత్తిడి తేలేక పోతున్నారు. రాష్ట్రంలో కరెంట్ కోతలు భారీగా ఉన్నాయన్నారు.
చివరకి సిఎం పేషీలో కూడా కరెంట్ లేని పరిస్థితి ఉందన్నారు.తొలిసారిగా నేపాల్లో శ్రీవారి కల్యాణాం
తొలిసారిగా పొరు గు దేశమైన నేపాల్లో ఈ నెల 25న శ్రీవారి 108వ కల్యాణా
న్ని టీటీడీ నిర్వహించనున్న ది. ఇందుకోసం పటిష్ఠమైన బందోబస్తు మధ్య
శ్రీదేవి, భూదేవి సహిత శ్రీనివాసుల కల్యాణ మూర్తులు ఉన్న బ స్సు తిరుమల
నుంచి నేపాల్ కు బయలుదేరింది. ఈ సందర్భంగా వాసుదేవాచార్య మా
ట్లాడుతూ ఇప్పటికి టీటీడీ ఆధ్వర్యంలో కల్యాణ మూర్తులకు 107 కల్యాణ ఉత్సవాలు
జరిగాయని, 108వ కల్యాణోత్సవం నేపాల్లో జరపాలని ఆ దేశపు రాజు కోరడంతో
అక్కడకు వెళుతూ మార్గమధ్యంలో విజయవాడలో బస చేశారన్నారు.స్వయంగా
స్వామివారి కల్యాణ ఉత్సవ మూర్తులు ఇక్కడకు రావడంతో తాము తలవని తలంపుగా
ప్రాతఃకాల పూజలను నిర్వహించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. టీటీడీ
విజిలెన్స్, సెక్యూరిటీ అధికారి సుదర్శన్ మాట్లాడుతూ కోదాడ, కరీంనగర్
మీదుగా నాగపూర్ వెళ్ళి, అక్కడ నుంచి నేపాల్ చేరుకుంటామన్నారు. నేపాల్లో ఈ
నెల 25 వ తేదీన శ్రీవారి కల్యాణం జరుగుతుందని చెప్పారు. బస్సులో అర్చకులతో
సహా మొత్తం 15 మంది సిబ్బంది ఉన్నారు.
Subscribe to:
Posts (Atom)
