Showing posts with label కొత్తచెరువు. Show all posts
Showing posts with label కొత్తచెరువు. Show all posts

Thursday, 23 February 2012

'అనంత' రైతులను అ కారణంగా చితకబాదిన ఎస్ఐ

న్యాయం చేయాల్సిన పోలీసులే అకారణంగా రెచ్చిపోయారు. ఇద్దరు రైతులపై ప్రతాపం చూపించారు. ఏ తప్పూ చేయకున్నా వారిని ఇష్టారాజ్యంగా కొట్టారు. తమనే ప్రశ్నిస్తావా అంటూ ఓ రైతుని... తమ వాహనాన్ని ఢీకొట్టాడంటూ మరో రైతును విచక్షణా రహితంగా చితకబాదారు. పోలీసు స్టేషన్‌లోనే వారిని తీ వ్రస్థాయిలో దుర్భాషలాడారు. అక్కడి తో ఆగకుండా ఇష్టం వచ్చినట్లు చితకబాదారు. దీంతో గ్రా మం మొత్తం ఏకమైంది.అప్పటికే పో లీసుల తీరుపై అసహనంగా ఉన్న గ్రా మస్థులు వారి వ్యవహారాన్ని సహించలేకపోయారు. అకారణంగా రైతుపై పోలీసులు ఝులుం ప్రదర్శించారం టూ స్థానిక పోలీసు స్టేషన్‌ని ముట్టడించారు. ఎనిమిది గంటలపాటు రా స్తారోకో నిర్వహించారు. రైతులను అ కారణంగా చితకబాదిన కొత్తచెరువు ఎస్ఐ ఇస్మాయిల్, కానిస్టేబుళ్లు బా బా, చెన్నకేశవులుపై చర్యలు తీసుకో వాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.ఎనిమిది గంటలపాటు ఆందోళన.. ఉదయం పదకొండు గంటల సమయంలో ఇదంతా జరిగింది. మధ్యా హ్నం 12గంటల నుంచి రాత్రి ఏడువరకు గ్రామస్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఎనిమిది గంటలపాటు పోలీసుస్టేషన్ ఎదుట బైఠాయించా రు. నెహ్రూసర్కిల్లో రాస్తారోకో చేశా రు. రైతు గోపాల్, నాగేంద్ర ఏమి త ప్పుచేశారని పోలీసులు చితకబాదారం టూ ప్రశ్నించారు. ఎటువంటి వివాదాలకు వెళ్లని తనభర్తను రోడ్డువెంబడి కొ ట్టుకుంటూ పోలీసు స్టేషన్‌కి తీసుకువచ్చారంటూ గోపాల్ భార్య గిరిజ ఆవేదన వ్యక్తం చేసింది. పలువురు గ్రామస్థులు ఆమెకు మద్దతుగా తరలివచ్చా రు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పో లీసుస్టేషన్‌పై దాడులకు దిగే స్థాయి లో గ్రామస్థులు ఉద్యమించారు. ఆం దోళనకారుల నిరసనలతో కొత్తచెరువు అట్టుడికిపోయింది. విషయం తెలుసుకున్న డీఎస్పీ నవాబ్‌జాన్, ఎనిమిది మంది సీఐలు కొత్తచెరువుకు చేరుకున్నారు. భారీఎత్తున అదనపు పోలీసు బలగాలు మోహరించాయి. డీఎస్పీ, సీఐలు గ్రామస్థులతో చర్చించి, ఆందోలనకారులకు సర్దిచెప్పే ప్రయత్నం చే సినా ఫలితం లేకపోయింది. ఓ సందర్భంలో నేరుగా ఎస్పీ షహనవాజ్‌ఖా సీం జోక్యం చేసుకుని ఫోన్‌ద్వారా గ్రా మంలోని పెద్దలతో చర్చించారు. ఎస్ ఐ ఇస్మాయిల్ చేష్టలతో విసిగిపోయిన ప్రజలు ఏమాత్రం వెనక్కు తగ్గకుండా ఆందోళనకు సిద్ధపడ్డారు. ఎస్ఐని స స్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. తమ దెబ్బలకు గాయపడిన రైతులు గ్రామస్థుల కంట పడకుండా పోలీసు లు పలు స్టేషన్లకు తరలించారు. గా యపడ్డ రైతులను తీసుకురావాలని గ్రామస్థులు పట్టుపట్టడంతో సాయం త్రం ఆరుగంటలకు వారిని గ్రామస్థులకు చూపించారు. అనంతరం పెనుకొండ ఆస్పత్రికి తరలించారు.ప్రత్యేక విచారణకు ఆదేశం.. కొత్తచెరువులో రైతులను ఎస్ఐ, కానిస్టేబుళ్లు చితకబాదడంపై ఎస్పీ షహనవాజ్‌ఖాసీం ప్రత్యేక విచారణకు ఆదేశించారు. విచారణాధికారిగా పెనుకొండ డీఎస్పీని నియమించినట్లు గ్రా మప్రముఖులతో ఎస్పీ ఫోన్‌ద్వారా వివరించారు.