Sunday, 27 November 2011
రైతు సమస్యలపై డిసెంబర్ 8న అనంతపురం జిల్లా బంద్
రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటించిన కరువు మండలాల జాబితాలో జిల్లాను పరిగణించకుండా, వరుస కరువులతో అల్లాడుతున్న "అనంత''కు వేయికోట్లిచ్చి ప్రత్యేక ప్యాకేజీతో జిల్లాను ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర రైతు సంఘ అధ్యక్షులు కే.రామక్రిష్ణ డిమాండ్ చేశారు. వరుస కరువులతో అల్లాడుతున్న అనంత ప్రజలను ఆదుకోడానికి శాశ్వత కరువు సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు అన్ని రంగాల ఫీజుల మాఫీ చేసి, ఉపకారవేతనాలివ్వాలన్నారు. బ్యాంకుల్లోని వ్యవసాయ రుణాలన్నింటినీ మాఫీ చేయాలన్నారు. సాగు, తాగునీరు అందించడానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని కోరారు. వర్షపాతానికి అనుగుణంగా పంటలు సాగు చేసేందుకు నిపుణులు, శాస్త్రవేత్తలు రైతులతో అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. రైతులు కరువుబారిన పడకుండా సూక్ష్మ సేద్య పరికరాలన్నింటినీ ఉచితంగా అందివ్వాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 8న జిల్లా బంద్కు పిలుపునిస్తున్నామన్నారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ చేపడుతున్న జిల్లా బంద్లో రైతులు, విద్యార్థులు, మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
Saturday, 26 November 2011
‘రాజన్న’ సినిమా పాటలు ఆడియో వేడుక లేకుండానే విడుదల
సచిన్ వందో సెంచరీ ఎందుకలా చేతులెత్తేస్తున్నాడు?
సచిన్ వ్యక్తిగతంగా ఒత్తిడికి గురవుతున్న సమయంలోనే, అభిమానుల నుంచి కూడా తీవ్రమైన ఒత్తిడి ఉందనే విషయాన్ని కూడా ఆయన మరిచిపోయినట్లు లేరు. అందుకే అతను వందో సెంచరీకి కొత్తగా ఆడుతున్న ఆటగాడిలా వ్యవహరిస్తున్నాడు.
కర్నూలు జిల్లాకు మూడు మునిసిపాలిటీలు ఏర్పాటు
జిల్లాలో కొత్తగా మరో మూడు మునిసిపాలిటీలు ఏర్పాటు కానున్నాయి. ఆత్మకూరు, నందికొట్కూరు, ఆళ్లగడ్డ పంచాయతీలను మునిసిపాలిటీలుగా మార్చేందుకు ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి ఆమోదముద్ర వేశారు. ప్రసుత్తం కర్నూలు నగరపాలక సంస్థతో పాటు ఆదోని, నంద్యాల, ఎమ్మిగనూరు, డోన్ మునిసిపాలిటీలు ఉన్నాయి.
మునిసిపాలిటీలుగా మారిస్తే ప్రభుత్వం విధించే పన్నులు భరించలేమని.. పంచాయతీలుగానే కొనసాగించాలని ఆత్మకూరు, నందికొట్కూరు, ఆళ్లగడ్డ పంచాయతీల నుంచి తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపారు. ఇటీవల పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేపట్టారు. అయినప్పటికీ ప్రభుత్వం మునిసిపాలిటీలుగా మారుస్తూ నిర్ణయించడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే సామాన్య ప్రజలు పట్టణాల్లో నివసించే పరిస్థితి లేదు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ప్రభుత్వం నగరపాలక, మునిసిపాలిటీల్లో 300 నుంచి 500 శాతం ఇంటి, ఆస్తి పన్ను పెంచిన విషయం తెలిసిందే
మునిసిపాలిటీలుగా మారిస్తే ప్రభుత్వం విధించే పన్నులు భరించలేమని.. పంచాయతీలుగానే కొనసాగించాలని ఆత్మకూరు, నందికొట్కూరు, ఆళ్లగడ్డ పంచాయతీల నుంచి తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపారు. ఇటీవల పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేపట్టారు. అయినప్పటికీ ప్రభుత్వం మునిసిపాలిటీలుగా మారుస్తూ నిర్ణయించడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే సామాన్య ప్రజలు పట్టణాల్లో నివసించే పరిస్థితి లేదు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ప్రభుత్వం నగరపాలక, మునిసిపాలిటీల్లో 300 నుంచి 500 శాతం ఇంటి, ఆస్తి పన్ను పెంచిన విషయం తెలిసిందే
మున్సిపాలిటీగా మైదుకూరు
మైదుకూరు మేజర్ పంచాయతీ మున్సిపాలిటీగా ఆవిర్భవించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జీఓ జారీ చేసింది. జిల్లాలో ఒక్క మేజర్ పంచాయతీకే ఈ అవకాశం దక్కింది. లింగాలదిన్నె, శెట్టివారిపల్లె పంచాయతీలతో పాటు యల్లంపల్లె పంచాయతీలోని నానుబాలపల్లె, రాయప్పగారిపల్లె, షాపూరు గ్రామాలను కలుపుతూ అధికారులు పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది
ఆంధ్రా బ్యాంక్ సామాన్యు డి సేవకే
Subscribe to:
Posts (Atom)