ఆంధ్రా బ్యాంక్ సామాన్యు డి సేవకే
సామాన్యు డి సేవకే ఆంధ్రా బ్యాంక్ పునరంకితమైందని బ్యాంక్ డెప్యూటీ జనరల్ మేనేజర్ డీవీఎన్.రావు అన్నారు. ఆంధ్రాబ్యాంక్ జోనల్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తిరుపతి జోన్ పరిధిలో ఇప్పటి వరకు రూ. 4255.66 కోట్ల వ్యాపారం చేశామన్నారు. 3307.66 కోట్ల డిపాజిట్లు సేకరించామన్నారు. 54 బ్రాంచ్ల ద్వారా సేవలందిస్తున్న ట్టు చెప్పారు. వ్యవసాయం, గృహనిర్మాణం, విద్య, చిన్నతరహా పరిశ్రమలకు రుణాల మంజూరులో ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పా రు. రూ.107.2 కోట్ల గృహ రుణాలు, రూ. 62.16 కోట్ల విద్యా రుణాలు, రూ. 144.50 కోట్లు బంగారు నగలపై రుణాలు ఇచ్చామన్నా రు. పుంగనూరు, ప్రొద్దుటూరులో కొత్త బ్రాంచ్ లు ఏర్పాటు చేశామన్నారు. ఎస్ఎంఎస్ల ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తున్నామని తెలిపా రు. ఆంధ్రాబ్యాంక్ సేవల పట్ల అసంతృప్తికి గురయ్యే వినియోగదారులు 9666606060కు మెసేజ్ పంపవచ్చన్నారు. 24 గంటల్లో సమస్య ను పరిష్కరిస్తామని ఆయన చెప్పారు. ఆంధ్రాబ్యాంక్ ద్వారా ప్రీపెయిడ్ గిఫ్ట్ కార్డ్స్ పథకాన్ని ప్రవేశ పెట్టినట్టు ఆయన తెలిపారు. ఏజీఎం సాయిప్రసాద్, చీఫ్ మేనేజర్లు నరసింహారావు, శ్రీధర్శాస్త్రి పాల్గొన్నారు
No comments:
Post a Comment