Wednesday, 26 October 2011

ఇంజినీరింగ్ విద్యలో ప్రమాణాల పెంపు

 ఇంజినీరింగ్ విద్యలో ప్రమాణాల పెంపునకు కృషి చేస్తున్నట్టు ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) రీజనల్ చైర్మన్, జేఎన్‌టీయూ మాజీ వీసీ ప్రొఫెసర్ డిఎన్.రెడ్డి పేర్కొన్నారు. శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఓ కార్యక్రమానికి హాజరు కావడానికి తిరుపతికి వచ్చిన ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడా రు. దేశంలో ఇంజినీరింగ్ విద్యను అందించడంలో, పెద్ద సంఖ్యలో ఇంజినీర్లను తయారు చేయడంలో మన రాష్ట్రం పొరుగు రాష్ట్రాల కన్నా ముందుందని ఆయన తెలిపారు. దేశంలో 3,500 ఇంజి నీరింగ్ కళాశాలలు ఉంటే మన రాష్ట్రంలో 717 ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా 13 లక్షల ఇంజి నీరింగ్ సీట్లు ఉంటే, మన రాష్ట్రంలో 3 లక్షల సీట్లు ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే 22 వేల ఎంటెక్ సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సామాన్యు లు, పేద విద్యార్థులకు ఇంజినీరింగ్ విద్య ను అందించాలన్న లక్ష్యంతో మన రాష్ట్రం లో ఇన్ని ఇంజినీరింగ్ కళాశాలలు ఏర్పాటయ్యాయని ఆయన పేర్కొన్నారు.

మరి న్ని కొత్త కళాశాలల స్థాపనకు దరఖాస్తులను ఏఐసీటీఈ ఆహ్వానిస్తోందని తెలిపారు. డిసెంబర్ 31వ తేదీ లోపు దరఖా స్తులు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అయి తే మనరాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాల ల్లో నాణ్యత ప్రమాణాలు ఆశించిన స్థాయిలో లేవన్నారు. చట్టాల్లోని లొసుగు ల వల్ల ఈ పరిస్థితి నెలకొందన్నారు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే ఆంధ్రప్రదేశ్ విద్యాచట్టం 1982 మార్పులు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం ఈ దిశగా పని చేస్తుందన్నారు. నవంబర్ మూడో వారంలో జరిగే శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లు పాస్ కావచ్చ ని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల ప్రైవే టు కళాశాలలపై చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. ర్యాగింగ్, సరైన బోధన, వసతులు లేని కళాశాలలపై ఎవరైనా ఏఐసీటీఈ వెబ్‌సైట్‌కు ు పంపవచ్చని ఆయన తెలిపారు

ప్రభుత్వ వైఖరి వల్లే రాయలసీమకు అన్యాయం

 ప్రకృతి చేతిలో కాదు... ప్రభుత్వ వైఖరి వల్లే రాయలసీమ ప్రాంతం ఆది నుంచి అన్యాయానికి గురైందని రాయలసీమ విమోచన సమితి అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎంవి రమణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రా యలసీమ విద్యార్థి వేదిక ఆధ్వర్యంలో పట్ట ణంలోని పద్మశాలీయ కల్యాణ మండపంలో మంగళవారం రాయలసీమ భవిష్యత్తు ఏమి టి? అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి 22 శాతం ఆదాయం లభిస్తున్నా ప్రభుత్వం ఇందులో ఒకటిన్నర, రెండు శాతానికి మించి సీమ అభివృద్ధికి ఖర్చు చేయడం లేదన్నారు. ప్రత్యేక తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం నియమించిన శ్రీకృష్ణ కమిటీ రాయలసీమ వెనుకబాటు తనాన్ని బట్టబయలు చేసిందన్నారు. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం మన రాష్ట్రానికి 811 టీఎంసీల కృష్ణా జలాలను కేటాయించగా, ఈ నీటి పంపకంలో కూడా మనకు తీరని అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణాను ప్రకటిస్తే మిగిలిన రాష్ట్రంలో రాయలసీమకు మళ్లీ అన్యాయం జరుగుతుందన్నారు.

తెలంగాణ వారు ప్రత్యేక రాష్ట్రం కావాలంటుంటే, తాము సమైక్యాంధ్రలో ఉంటామని ప్రాధేయడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదన్నారు. సిగ్గువిడిచిన మన పాలకులు విడిపోతే బతకలేమనే హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా చేయాలని వస్తున్న డిమాండ్‌ను తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానన్నారు.ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పడితే నక్సలిజం పెరుగుతుందనడంలో అర్థం లేదన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి సీమ అభివృద్ధికి అంతో ఇంతో కృషి చేశారంటే అది దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖరరెడ్డి మాత్రమేనని పేర్కొన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ను వైఎస్‌ఆర్ విస్తరింప చేశారన్నారు. రాయలసీమ విద్యార్థి వేదిక సెంట్రల్ కమిటీ సభ్యుడు ఎం.భాస్కర్ మాట్లాడుతూ మన ఎంపీలు, ఎమ్మెల్యేలకు రాయలసీమ అభివృద్ధిపై ఓ ప్రణాళిక అంటూ లేదన్నారు

Tuesday, 25 October 2011

రిజర్వు బ్యాంక్ వడ్డీ రేటుని మళ్లీ పెంచింది

                                    
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్ బిఐ) వడ్డీ రేటుని మళ్లీ పెంచింది. రెపో రేటు పావు శాతం పెంచింది. ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకే ఆర్ బిఐ మళ్లీ వడ్డీరేటుని పెంచింది. పొదుపు ఖాతాల వడ్డీపై నియంత్రణని ఎత్తివేసింది. సేవింగ్స్ ఖాతాదారులకు లబ్దిచేకూరుతుంది. ముందుగా చెల్లించే ఇంటి రుణాలకు అదనపు చార్జీలను రద్దు చేశారు. వడ్డీ రేటుని ఇక పెంచకపోవచ్చని భావిస్తున్నారు

రైలు టిక్కెట్ల ధరలను పెంచాలి !!

 కొన్నేళ్లుగా రైలు టిక్కెట్టు ధరలను పెంచని కారణంగా రైల్వే ఉద్యోగులు, కార్మికుల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని ఎస్సీ రైల్వే మజ్దూర్ యూనియన్ జోనల్ ప్రధాన కార్యదర్శి, ఆలిండియా రైల్వేమెన్ ఫెడరేషన్ సహాయ కార్యదర్శి శంకర్ రావు పేర్కొన్నారు. సోమవారం ఉదయం గుంతకల్లుకు వచ్చిన ఆయన కోజీ రైల్వే గెస్ట్ హౌస్‌లో విలేఖరుల సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మట్లాడుతూ భారత రైల్వేల ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందన్నారు.

లాలూ హయాం నుంచి ఇప్పటిదాకా రైలు టిక్కెట్ల ధరలను పెంచకపోగా, తగ్గించారన్నారు. ఈ కారణంగా రైల్వేల ఆదాయం గణనీయంగా తగ్గిందన్నారు. తొమ్మిదేళ్లుగా టిక్కెట్టు ధరలు పెంచకపోగా, రైల్వే నిర్వహణ వ్యయం దాదాపు నాలుగింతలైందన్నారు. ఈ కారణంగా రైల్వేలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. కొత్త రైలు మార్గాలు, స్టేషన్ల ఆధునికీకరణ, విద్యుద్దీకరణ, వ్యాగన్లు, కోచ్ ఫ్యాక్టరీల నిర్మాణ పనులు శంఖుస్థాపనలకే పరిమితమౌతున్నాయిగానీ, పూర్తికావడం లేదన్నారు. భధ్రతకు సంబంధించిన అంశమైన ఉద్యోగ ఖాళీలను సైతం పూర్తిచేయలేని దుస్థితిలో రైల్వే ఉందన్నారు.

తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలను నవంబర్ 21 నుంచి 29వ తేదీ వరకు ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు

                                       
 తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలో తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలను నవంబర్ 21 నుంచి 29వ తేదీ వరకు ఘనంగా నిర్వహించాలని అధికారులను టీటీడీ ఈవో ఎల్‌వి.సుబ్రమణ్యం ఆదేశిం చా రు. ఆయన సోమవారం దేవస్థానం పరిపాలన భవనంలో టీటీడీ, పంచాయ తీ, పోలీసు, ఆర్టీసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలకు వివిధ విభాగాధిపతులు చేయాల్సిన విధులను, సూచనల ను చేశారు. తిరుమలలో విద్యుద్దీపాలంకరణలు ఏవిధంగానైతే భక్తులను ఆకట్టుకున్నాయో అదే రీతిలో ఏర్పాట్లు ఉండాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని టీటీడీ పారిశుద్ధ్య విభాగం, తిరుచానూరు పంచాయతీ అధికారులకు సూచించారు.

బ్రహ్మోత్సవాల సందర్బంగా అమ్మవారి ఆలయం లో నవంబర్ 15వ తేదీ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించాలని అధికారులను ఆదేశిం చారు. భక్తులను అలరించేలా వివిధ రాష్ట్రాలకు చెందిన సాంప్రదాయ కళాకారులచే వివిధ కళారూపాలను హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య, ఆళ్వారు దివ్యప్రంబంధ ప్రాజెక్టు ఏర్పాట్లు చేస్తాయని ఈవో ఎల్‌వి. సుబ్రమణ్యం తెలిపారు. అమ్మవారి బ్రహ్మోత్సవాలకు తిరుమల నుంచి తిరుచానూరుకు రోజుకు 60 ట్రిప్పులు బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కోరారు. ఇందుకు ఆర్టీసీ అధికారులు అంగీకరించారు. ఈ సమీక్ష సమావేశం లో జేఈవో కెఎస్.శ్రీనివాసరాజు, వెంకటరామిరెడ్డి, ఇతర విభాగాధిపతులు పాల్గొన్నారు

Monday, 24 October 2011

చంద్రబాబు వ్యతిరేక విధానాల పైన ఉద్యమాలు చేశామన్నారు సిపిఐ

                                 
అనంతపురం: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమాలపై ఆధారాలు ఉంటే ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ సోమవారం అనంతపురం జిల్లాలో అన్నారు. ఆయనపై ఆధారాలు ఉంటే కాంగ్రెసు ప్రభుత్వం విచారణ ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. గత సాధారణ ఎన్నికల్లో తాము తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ గతంలో చంద్రబాబు వ్యతిరేక విధానాల పైన ఉద్యమాలు చేశామన్నారు. బాబు అవినీతిపై విచారణ జరిపితే తమకేమీ అభ్యంతరం లేదన్నారు. అక్రమాలు ఎవరు చేశారని తెలిసినా విచారణ జరపాల్సిందేనన్నారు

శ్రీశైలం ఆర్జిత సేవల టికెట్ల ధరలు 20 శాతం మేర తగ్గిస్తున్నట్లు తెలిపారు

శ్రీశైలంలోని భ్రమరాంబ అమ్మవారి ఆలయ గోపురం సువర్ణ కవచం పనులు జనవరి నాటికి పూర్తిచేస్తామని ఆలయ పాలక మండలి చైర్మన్ ఇమిడిశెట్టి కోటేశ్వరరావు తెలిపారు. ఆదివారం జరిగిన దేవస్థానం ధర్మకర్తల మండలి సమీక్షా సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇటీవల పెంచిన ఆర్జిత సేవల టికెట్ల ధరలు 20 శాతం మేర తగ్గిస్తున్నట్లు తెలిపారు. కార్తీక మాసంలో ప్రతిరోజు 50 మందికి, ప్రతి శుక్రవారం పౌర్ణమి రోజున 200 మందికి అన్నదానం చేస్తామన్నారు