Showing posts with label గుంతకల్లు. Show all posts
Showing posts with label గుంతకల్లు. Show all posts

Tuesday, 25 October 2011

రైలు టిక్కెట్ల ధరలను పెంచాలి !!

 కొన్నేళ్లుగా రైలు టిక్కెట్టు ధరలను పెంచని కారణంగా రైల్వే ఉద్యోగులు, కార్మికుల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని ఎస్సీ రైల్వే మజ్దూర్ యూనియన్ జోనల్ ప్రధాన కార్యదర్శి, ఆలిండియా రైల్వేమెన్ ఫెడరేషన్ సహాయ కార్యదర్శి శంకర్ రావు పేర్కొన్నారు. సోమవారం ఉదయం గుంతకల్లుకు వచ్చిన ఆయన కోజీ రైల్వే గెస్ట్ హౌస్‌లో విలేఖరుల సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మట్లాడుతూ భారత రైల్వేల ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందన్నారు.

లాలూ హయాం నుంచి ఇప్పటిదాకా రైలు టిక్కెట్ల ధరలను పెంచకపోగా, తగ్గించారన్నారు. ఈ కారణంగా రైల్వేల ఆదాయం గణనీయంగా తగ్గిందన్నారు. తొమ్మిదేళ్లుగా టిక్కెట్టు ధరలు పెంచకపోగా, రైల్వే నిర్వహణ వ్యయం దాదాపు నాలుగింతలైందన్నారు. ఈ కారణంగా రైల్వేలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. కొత్త రైలు మార్గాలు, స్టేషన్ల ఆధునికీకరణ, విద్యుద్దీకరణ, వ్యాగన్లు, కోచ్ ఫ్యాక్టరీల నిర్మాణ పనులు శంఖుస్థాపనలకే పరిమితమౌతున్నాయిగానీ, పూర్తికావడం లేదన్నారు. భధ్రతకు సంబంధించిన అంశమైన ఉద్యోగ ఖాళీలను సైతం పూర్తిచేయలేని దుస్థితిలో రైల్వే ఉందన్నారు.