Showing posts with label శ్రీశైలం. Show all posts
Showing posts with label శ్రీశైలం. Show all posts

Friday, 30 December 2011

శ్రీశైలంలో డిజిటల్ విద్యాభ్యాసం

శ్రీశైల ప్రాజెక్ట్ కాలనీలో విద్యార్థుల కోసం అధునాతన బోధనా పద్దతిలో భాగంగా డిజిటల్ బోర్డు ద్వారా విద్యాబోధనను పాఠ్యాంశాలగా బోధించేందుకు  మధ్యాహ్నం జెన్‌కో ఛీప్ ఇంజనీరు లక్ష్మినారాయణ రావు చేతుల మీదుగా ప్రారంభించారు. స్థానిక డిఎవి ఉన్నత పాఠశాలలో అన్ని తరగతులకు డిజిటల్ తరగతులను నిర్వహించేందుకు ప్రధానోపాధ్యాయులు సతీష్ చంద్ర కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగా పోటీ ప్రపంచంలో అంచెలంచెలుగా పెరుగుతున్న బోధనాపద్దతులకు ధీటుగా మా విద్యార్థులకు కూడా మెరుగైన విద్యను అందించేందుకు ఈ డిజిటల్ బోర్డుల ద్వారా విద్యను బోధించేందుకు రంగం సిద్ధం చేశామని ఆయన అన్నారు. ఈసందర్భంగా జెన్‌కో సిఇ మాట్లాడుతూ ఈ పద్దతుల ద్వారా విద్యార్థులు పాఠ్యాంశాలను సులువుగా అర్థం చేసుకుని తెలివితేటలను మెరుగుపరుచుకుని తద్వారా ఉత్తీర్ణతాశాతాన్ని పెంచుకోవచ్చని దాని ద్వారా పాఠ్యాంశాలపై మంచి పట్టును కూడా సాధించవచ్చునని ఈ కార్యక్రమంలో జెన్‌కో రైట్ బ్యాంక్ సూపరింటెండింగ్ ఇంజనీరు రాంబాబు, ఇఇలు రవీంద్ర, డిఇలు సత్యసాయిబాబా, శ్రీనివాసులు, ఎడిఇ రామకృష్ణారెడ్డి, అకౌంట్ అధికారులు ఎమ్‌ఎస్‌ఆర్‌కె శర్మ, శ్రీ్ధర్, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Friday, 25 November 2011

శ్రీశైలం ఇక తిరుమల తరహాలో హోదా దక్కబోతోంది!

శ్రీశైలం ఇక తిరుమల తరహాలో రూపుదిద్దుకోనుంది. నల్లమలలోని శివాలయాల సమూహంతో ఆ దేవస్థానానికి స్వయంప్రతిపత్తి కల్పించేందుకు ప్రభుత్వం అనుమతులివ్వబోతోంది. ఓంకారేశ్వరం, నవనందులు, నాలుగు ముఖద్వార క్షేత్రాలు, సంగమేశ్వరం తదితర ఆలయాలను కలుపుతూ శ్రీశైలానికి ప్రత్యేక హోదా చేకూరనుంది.
ఇకపై మల్లన్న క్షేత్రంతో పాటు సమీప ఆలయాలకు కొత్త శోభ సంతరించుకోనుంది. దీంతో సమీప పుణ్యక్షేత్రాల దర్శనభాగ్యం కూడా భక్తులకు సులువు కానుంది. దేశంలోనే తిరుపతికి ఉన్నంత ప్రాచుర్యం ఇకపై కర్నూలుకూ దక్కబోతోంది. దీంతో తమ జిల్లాకు మహర్దశ పట్టబోతోందంటూ అక్కడి వాసులు కోటి ఆశలతో ఉన్నారు క్షేత్రపరిధిలో సాలిడ్ వేస్టేజ్ మెనేజ్‌మెంట్, నీటిసరఫరా, అంతర్గత డ్రైనేజీ, అంతర్గత రహదారులు ఏర్పాటవుతాయి. వ్యాపార సముదాయ భవనాలు వెలుస్తాయి. సాంస్కృతి కార్యక్రమాలకు పెద్దపీటవేసి ఆలయ ఆధ్వర్యంలో పెద్ద ఆడిటోరియం ఏర్పాటవుతుంది. ఉద్యానవనాల రూపకల్పన, సిబ్బంది నివాసగృహాలు, భక్తుల వసతి సముదాయలను పటిష్ఠం చేస్తారు. దీని ద్వారా ఏటా శ్రీశైల ఆర్థిక లావాదేవీలు రూ. 100 కోట్లనుంచి రెట్టింపయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఆలయాధ్వర్యంలోని 250 కాటేజీలు రెండుమూడింతలయ్యే అవకాశాలున్నాయి. ఇప్పుడున్న 334 వ్యాపార దుకాణాలు మూడింతలయ్యే అవకాశాలున్నాయి. తలనీలాల ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశముంది.శ్రీశైలం దేవస్థానానికి స్వయం ప్రతిపత్తి వస్తే కర్నూలుకు మహర్దశ వస్తుంది. మహానంది, ఓంకారేశ్వరం, నవనందులు, నాలుగు ముఖద్వార క్షేత్రాలు, సంగమేశ్వరం తదితర ఆలయాలను కలుపుతూ శ్రీశైలానికి ప్రత్యేక హోదా చేకూరుతుంది. ప్రత్యేక ప్యాకేజీతో యాత్ర వసతి అందుబాటులోకి వస్తుంది. ఆలయ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. హోదా తీరే మారిపోతుంది. ఇప్పటిదాకా పాలకవర్గం కనుసన్నల్లో నిర్వహించే ఆలయం ఐఏఎస్ అధికారి ఆధ్వర్యంలో నడుస్తుంది

Monday, 14 November 2011

శ్రీశైల మహాక్షేత్రంలో భక్తుల కోలాహలం

 శ్రీశైల మహాక్షేత్రంలో కార్తీక మాసంలో 3వ సోమవారం ముందుగానే భక్తుల సందడి కనపడింది. శెలవు దినాలు రావడంతో శ్రీశైలం భక్తులతో కిక్కిరిసింది. ముందుగా భక్తుల రద్దీని గమనించిన అధికారులు ఆలయ వేళలు మార్పు చేశారు. ఉదయం 2.30 గంటలకే మంగళవాయిద్యాలు, 3 గంటలకు సుప్రభాతసేవ, 4 గంటలకు మహామంగళహారతి, 4.30 దర్శన ఆర్జిత సేవలను ప్రారంభించారు. సాయంత్రం ఆలయాన్ని మూసివేసి 6 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పించారు. వచ్చిన భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు క్యూలైన్లలో నీటి వసతి, భద్రత ఏర్పాటు చేశారు. 1.50 లక్షల మంది భక్తులు స్వామి వార్లను దర్శించకున్నట్లు తెలిపారు. భక్తులు ఉదయం నుంచి 436 సామూహిక అభిషేకాలు నిర్వహించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. అలాగే కార్తీక దీపారాధన చేసుకునే భక్తులు నాగులకట్టవద్ద పోటీపడ్డారు. కట్ట సముదాయంలో, చుట్టు ప్రదేశాల్లో కల్లాపుచల్లి ముగ్గులు వేసి దీపారాధనలు చేశారు. పూజారులను ఏర్పాటుచేసుకొని 10 లక్షల ఒత్తుల ద్వీపాలను వెలిగించారు. వసతి గృహాలన్ని కిక్కిరిసి పోయాయి. ముందుగా గదులను రిజర్వు చేసుకొని వచ్చే భక్తులకు వసతి గృహం లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. కార్తీక మాసంలో స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ ఆదివారం సాయంత్రం స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, రెవెన్యూ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. వీరికి ఆలయ తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందించారు.