Thursday, 24 November 2011

రజనీ రాణా సినిమా కు బ్రేక్ ....కూతురు సౌందర్య తో మరో సినిమాకు కమిట్ అయ్యారు.

భారీ అంచనాలతో మొదలైన రజనీ ‘రాణా’ సినిమా ప్రారంభం రోజే రజనీకాంత్ అనారోగ్యం పాలవడంతో....షూటింగ్ కు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. రజనీ అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత ఆ సినిమాను తీద్దామని అనుకున్నప్పటికీ....భారీ యాక్షన్ సన్నివేశాలతో కూడిన ఈ సినిమాలో నటించేందుకు అతని అరోగ్యం సహకరించదని డాక్టర్లు తేల్చి చెప్పడంతో ఈ ప్రాజెక్టు తాజాగా ఆగి పోయింది. మళ్లీ మొదలవుతుందో ? లేదో కూడా తెలియని పరిస్థితి.ఆ సినిమా సంగతి పక్కన పెడితే...రజనీ తాజగా మరో సినిమాకు కమిట్ అయ్యారు. తన చిన్న కూతురు సౌందర్య దర్శకత్వంలో ‘కోచ్ అదయన్’ సినిమా చేయబోతున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుంది. ఈ విషయాన్ని సౌందర్య తన ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఈ సినిమా మొట్ట మొదటి ఇండియన్ 3డి చిత్రంగా రికార్డులకెక్కబోతోంది

కిషన్‌జీ ఎన్‌కౌంటర్: చంద్రబాబుకు భద్రత పెంపు

మావోయిస్టు అగ్రనేత కిషన్‌జీ అలియాస్ మల్లోజుల కోటేశ్వర రావు ఎన్‌కౌంటర్ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి భద్రత పెంచారు. రైతు పోరు బాటలో భాగంగా చంద్రబాబు ప్రస్తుతం విశాఖపట్నం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని బుచ్చయ్యపేటలో పర్యటిస్తున్నారు. ఆ ప్రాంతంలో మావోయిస్టుల ప్రాబల్యం ఉండడంతో చంద్రబాబుకు భద్రత పెంచారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలను అప్రమత్తం చేశారు. మావోయిస్టుల హిట్ లిస్టులో ఉన్న రాజకీయ నేతలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. కిషన్‌జీ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా రాష్ట్రంలో మావోయిస్టులు రెచ్చి పోయే ప్రమాదం ఉందని అనుమానిస్తున్నారు. దీంతో పలు చోట్ల భద్రతను కట్టుదిట్టం చేశారు. తనిఖీలు ముమ్మరం చేశారు

బాలయ్య అభిమానులకు శుభవార్త....‘శ్రీరామ రాజ్యం’ సినిమా అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్

బాలయ్య అభిమానులకు శుభవార్త. బాలకృష్ణ నటించిన ‘శ్రీరామ రాజ్యం’ సినిమా అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఎంపిక చేయబడింది. ఈ విషయాన్ని ఆ చిత్ర నిర్మాత యలమంచిలి సాయిబాబు స్వయంగా మీడియాకు వెల్లడించారు. నవంబర్ 28న 500 మంది అంతర్జాతీయ మీడియా జర్నలిస్టుల కోసం ప్రత్యేక షో ఏర్పాటు చేశామని సాయిబాబు వెల్లడించారు. చాలా సుదీర్ఘం కాలం తర్వాత ఒక భారతీయ పౌరాణిక సినిమా అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించప బడుతుంది. ఇందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. శ్రీరామ రాజ్యం సక్సెస్ కు కారణమైన మొత్తం టీంకు నేను థ్యాంక్స్ చెబుతున్నాను అని చెప్పారు. బాలకృష్ణ లార్డ్ రామా పాత్రలో, నయనత తార సీత పాత్రలో నటంచిన శ్రీరామ రాజ్యం సినిమా నవంబర్ 17న విడుదలై మంచి హిట్ టాక్ తో దూసుకెలుతోంది

వైయస్ విజయమ్మ బాధపడుతుంటారు: పయ్యావుల

తెలుగుదేశం పార్టీ వాదన ఇప్పుడు విని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ బాధపడుతుంటారని తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ గురువారం ఎన్టీఆర్ ట్రస్టు భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అన్నారు. హైకోర్టును తప్పుదోవ పట్టించే విధంగా విజయమ్మతో పిటిషన్ వేయించారని విమర్శించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి బినామీ కర్నాటి వెంకటేశ్వర రావు వైయస్ హయాంలోనే వెలుగులోకి వచ్చారన్నారు. కర్నాటి, కెవిపి రామచంద్రా రావు ఒకే భవనంలో ఉంటారన్నారు.

లయన్స్‌క్లబ్‌ ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవలు

హోరాహోరీ కాల్పుల్లో కిషన్‌జీ మృతి

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మావోయిస్టు అగ్రనేత మల్లోజుల కోటేశ్వరరావు ఆలియాస్ కిషన్‌జీ గురువారం మధ్యాహ్నం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. పశ్చిమబెంగాల్‌లోని కుష్బోనీ అడవిప్రాంతం, జంగల్ మహల్‌లో భద్రతాదళాలు-మావోయిస్టుల మధ్య జరిగిన హోరాహోరీ కాల్పుల్లో కిషన్‌జీ మృతి చెందారు. ఈ ఘటనలో మరో మహిళా నక్సలైట్ కూడా మృతి చెందిన నట్లు నిఘా వర్గాలు ధృవీకరించాయి. 30 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న కిషన్‌జీది కరీంనగర్ జిల్లా పెద్దపల్లి.

2250 కోట్లతో రాష్ట్రంలోమెగా వాటర్‌షెడ్లు

భూగర్భ జలాల పెంపు, జీవనోపాదుల మెరుగులో భాగంగా రాష్ట్రంలో రూ.2250 కోట్లతో 450 మెగా వాటర్‌షెడ్లు ప్రారంభించిట్లు రాష్ట్ర సమగ్ర జల వనరుల అభివృద్ధి పథకం ప్రత్యేక కమిషనర్ సువర్ణ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ రైతుల జీవనోపాదుల మెరుగు కోసం ఇందిర జలప్రభ కింద రూ.1800 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. పది వేల హెక్టార్లలో ఆరు వేల కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారని ఆమె  హిందూపురంలో తెలిపారు. ఈ పథ కం కోసం ఉపాధి హామీ ద్వారా రూ. 1000 కోట్లు, నాబార్డ్ ద్వారా రూ.800 కోట్లు విడుదల కానుందని తెలిపారు. ఇప్పటికే నాబార్డ్ ద్వారా రూ. 400 కోట్లు విడుదలైందని ఆమె తెలిపారు. అదనపు నిధుల కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. మెగా వాటర్‌షెడ్లు, ఉపాధి హామీ పథకం ఒకే గొడుగు కిందకు తేవడం జరిగిందని, దీని ద్వారా అన్ని జిల్లాల్లో జీవనోపాదుల కల్పన కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించడం జరుగుతుందన్నారు. ఒక్కొక్క మెగా వాటర్‌షెడ్ ద్వారా 15,500 ఎకరాల భూమి సారవంతమవుతుందని, ప్రతి వాటర్‌షెడ్‌పైన 5 నుండి 7 ఏళ్ళ లోపు రూ.5 కోట్ల పైబడి ఖర్చు చేయడం జరుగుతుందన్నారు. అనంతపురం జిల్లాలో 70 మెగా వాటర్‌షెడ్లు ప్రతిపాదించడం జరిగిందని, ఇప్పటికే 20 పైబడి వాటర్‌షెడ్‌లలో పనులు ప్రారంభమయ్యాయన్నారు. జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛంద సంస్థలకు కొన్ని వాటర్‌షెడ్లు కేటాయించారన్నారు. పథకాల అమలులో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని, లేకపోతే ఆశించిన స్థాయిలు సాధించడం సాధ్యపడదన్నారు. వాటర్‌షెడ్ల ద్వారా గ్రామాల్లో శాశ్వత వనరులు ఏర్పాటుచేసే అవకాశాలు ఉన్నాయని, దీనికి తోడు వ్యవసాయం, పాడి పరిశ్రమ అభివృద్ధి చెందుతాయన్నారు.