Thursday, 24 November 2011

బాలయ్య అభిమానులకు శుభవార్త....‘శ్రీరామ రాజ్యం’ సినిమా అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్

బాలయ్య అభిమానులకు శుభవార్త. బాలకృష్ణ నటించిన ‘శ్రీరామ రాజ్యం’ సినిమా అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఎంపిక చేయబడింది. ఈ విషయాన్ని ఆ చిత్ర నిర్మాత యలమంచిలి సాయిబాబు స్వయంగా మీడియాకు వెల్లడించారు. నవంబర్ 28న 500 మంది అంతర్జాతీయ మీడియా జర్నలిస్టుల కోసం ప్రత్యేక షో ఏర్పాటు చేశామని సాయిబాబు వెల్లడించారు. చాలా సుదీర్ఘం కాలం తర్వాత ఒక భారతీయ పౌరాణిక సినిమా అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించప బడుతుంది. ఇందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. శ్రీరామ రాజ్యం సక్సెస్ కు కారణమైన మొత్తం టీంకు నేను థ్యాంక్స్ చెబుతున్నాను అని చెప్పారు. బాలకృష్ణ లార్డ్ రామా పాత్రలో, నయనత తార సీత పాత్రలో నటంచిన శ్రీరామ రాజ్యం సినిమా నవంబర్ 17న విడుదలై మంచి హిట్ టాక్ తో దూసుకెలుతోంది

No comments:

Post a Comment