Sunday, 16 October 2011

వాటర్ షెడ్లలో అనంతపురం 1st

వాటర్‌షెడ్ల పథకం నిర్వహణలో అనంతపురం జిల్లా మొదటిస్థానం సాధించింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం అమల్లో నాల్గవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. విజయవాడలో శుక్ర, శనివారాల్లో ఉపాధిహామీ పథకం సమీక్ష సమావేశం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జరిగిన ఉపాధిహామీ, వాటర్‌షెడ్ల పనులను మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, కమిషనర్ జయలక్ష్మి, స్పెషల్ ఆఫీసర్‌లు విద్యాసాగర్, సువర్ణతో పాటు డెరైక్టర్ ఏ.మురళి సమీక్షించారు. జిల్లాలో 1999 నుంచి 2007 వరకు రూ.227.38 కోట్ల వ్యయంతో 3,78,969.67 హెక్టార్ల విస్తీర్ణంలో వాటర్‌షెడ్ల పథకం అమలు చేశారు. మెగా వాటర్‌షెడ్ల పథకం 2009లో జిల్లాలో ప్రారంభం కాగా, 70 మెగా వాటర్‌షెడ్లు, 202 మైక్రో వాటర్‌షెడ్లు మంజూరయ్యాయి. ఇందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి.

వీటిని ప్రాతిపదికగా తీసుకున్న ప్రభుత్వం వాటర్‌షెడ్ల నిర్వహణలో జిల్లాకు మొదటిస్థానం ఇచ్చింది. ఉపాధిహామీ పథకం ప్రారంభం నుంచి జిల్లాలో 9,28,73,112 పనిదినాలు కల్పించారు. ఇందుకోసం రూ.1,158.91 కోట్లు ఖర్చు చేశారు. 2010-11లో 2,03,03,163 పనిదినాలు కల్పించి, రూ.332కోట్లు వ్యయం చేశారు. 2011-12లో 91,62,477 పని దినాలను ఇప్పటి వరకు కల్పించారు. ఇందుకోసం రూ.134.70 కోట్లు వెచ్చించారు. అలాగే ఉపాధి కూలీలకు రోజువారీ వేతనం సగటున రూ.106.35 పైసలు చెల్లించారు. నిధుల వినియోగం, కూలీల సగటు వేతనం పరిగణనలోకి తీసుకోవడంతో ఉపాధిహామీలో మాత్రం జిల్లాకు రాష్ర్టంలో నాల్గవ స్థానం దక్కింది.

టిటిడి పశుగ్రాస బరువునిర్దారణ పరికరాన్ని విరాళంగా అందజేశారు

 టిటిడి ఎస్వీ గోసంరక్షణశాలకు బెంగుళూరుకు చెందిన ఎస్‌ఏ ఎలక్ట్రానిక్ పరికరాల కంపెనీ 13 లక్షల రూపాయలు విలువ చేసే పశుగ్రాస బరువునిర్దారణ పరికరాన్ని శనివారం విరాళంగా అందజేశారు. టిటిడి ఇఓ ఎల్వీ సుబ్రహ్మణ్యంకు దాత ఎస్‌ఏ వెంకటేశన్ కుటుంబ సమేతంగా ఈ పరికరాన్ని అందజేశారు. దాదాపు 40 టన్నుల వరకూ ఈ పరికరం ద్వారా పశుగ్రాసాన్ని, ఇతర దాణాల బరువును గుర్తించవచ్చు. ఈ సందర్భంగా ఇఓ ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ధార్మిక సంస్ధాపనలో భాగంగా దేశం నలుమూలల నుండి విచ్చేసే దాతలు తమకు నచ్చిన రీతిలో టిటిడికి సహాయం అందించడం ముదావహామన్నారు. దాతలకు సంబంధించి టిటిడి ఎప్పుడు తనవంతు ప్రోత్సాహాన్ని అభినందనలను అందిస్తూనే వుంటుందన్నారు. స్వామివారి వైభవ ప్రచారంలో కూడా దాతలు బాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం దాత ఎస్‌ఏ వెంకటేశన్ మాట్లాడుతూ తాము కంపెనీ ప్రారంభించిన తొలిరోజుల్లోనే స్వామివారికి నాణేలు తూకం వేసే పరికరాన్ని అందించామన్నారు. ప్రస్తుతం తమ కంపెనీ స్వామి కృపతో 250 కోట్ల టర్నోవర్‌తో లాభసాటిగా నడుస్తొందన్నారు. భవిష్యత్తులో కూడా స్వామివారి సేవలో తరించడానికే తాము కట్టుబడి వుంటామన్నారు. ఈ కార్యక్రమంలో గోశాల సంచాలకులు హరినాథ్ రెడ్డి, ఇఎస్ వన్ సుధాకర్ తదితరులున్నారు

తిరుపతిలో 18.61 ఎకరాల విస్తీర్ణంలో వసతి సముదాయాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు

                       
శ్రీవారి దర్శనార్ధం తిరుమలకు వచ్చే భక్తుల అవసరాలను దృష్టిలో వుంచుకుని తిరుపతిలో వసతి సముదాయాల నిర్మాణాలను టిటిడి చేపడుతోందని టిటిడి చైర్మన్ కనుమూరి బాపిరాజు అన్నారు. ఆయన శనివారం తిరుపతిలోని రెండవ సత్రం ఉచిత యాత్రికుల వసతి సముదాయాన్ని తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం నలుమూలల నుండి శ్రీవారి దర్శనార్ధం తిరుపతికి వచ్చే భక్తులకు తిరుమలలోనే కాకుండా తిరుపతిలో కూడా వసతి సముదాయాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ మూడు సత్రాలు 18.61 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన అతిపురాతనమైనవన్నారు. ఇప్పుడు వసతి సౌకర్యాలు ఎంతో బాగున్నాయని, వీటిని మరింత ఆధునీకరిస్తామన్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో వుంచుకుని తిరుపతిలో శ్రీనివాసం, మాధవం, విష్ణునివాసం వంటి వసతి సముదాయాలను తిరుపతిలో నిర్మించిందన్నారు. తిరుపతిలోనే భక్తులు ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం రెండవ సత్రాన్ని ఆయన పరిశీలించారు. నూతనంగా నిర్మిస్తున్న డార్మిటరీలను, మరుగుదొడ్లను పరిశీలించారు. భక్తులతో టిటిడి కల్పిస్తున్న సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు.
అండగావుంటా
ఆధైర్యపడవద్దు
తిరుపతిలోని టిటిడి ధర్మసత్రాలను పరిశీలించిన టిటిడి చైర్మన్ కనుమూరి బాపిరాజు శనివారం అక్కడకు చేరుకోగానే అక్కడ ఎంతోకాలంగా అసౌకర్యాల నడుమ జీవనం సాగిస్తున్న నిర్వాసితులు ఆయన పాదాలపై మొకరిల్లి తమకు న్యాయం చెయ్యాలని వేడుకున్నారు. దీంతో వారికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు

దేశంలో వివిధ ప్రైవేటు పథకాలకు దీటుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ ఇన్సూరెన్స్ పథకాలను ప్రవేశపెట్టారు

                                
దేశంలో వివిధ ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థలు ప్రవేశపెట్టిన ఇన్సూరెన్స్ పథకాలకు దీటుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ ఇన్సూరెన్స్ పథకాలను ప్రవేశపెట్టారు. ఈ మేరకు శనివారం స్థానిక స్టేట్ బ్యాంకులో చీఫ్ మేనేజర్ ఎన్.వెంకటయ్య వివిధ స్కీములను లాంచింగ్ చేస్తూ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ ఇన్సూరెన్స్ పథకం ద్వారా కార్లు, ఇళ్లు, అన్ని వాహనాలకు, స్టాక్స్, షాపులు, బిల్డింగ్‌లకు తక్కువ ప్రీమియంతో ప్రతి ఒక్కరూ లబ్ధిపొందవచ్చని వెంకటయ్య తెలిపారు. వివిధ వాహనాల మరమ్మతుల నిమిత్తం 56 రకాలకు ఈ పథకం వర్తించనున్నది. ఏదైనా వాహనం ప్రమాదానికి గురైతే సంబంధిత వాహనదారుడు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా 7 రోజులలోపు ఆ వాహనాన్ని గ్యారేజీకి తీసుకెళ్లడానికి ఇన్సూరెన్స్ ఉన్నవారికి బ్యాంకు రోజుకు వెయ్యి రూపాయల చొప్పున చెల్లిస్తుందని ఆయన తెలిపారు. ఇంత వరకు ఈ పథకాన్ని ఏ సంస్థ కూడా ప్రవేశపెట్టలేదని ఆయన చెప్పారు. అలాగే ఈ ఏడాది 4000 మంది రైతులకు రూ.12 కోట్లు రాయచోటి ఎస్‌బిఐ పరిధిలో రుణాలు ఇచ్చామని సంబంధిత రైతులు బీమా చేసుకోవాలని ఆయన కోరారు. ముఖ్యంగా పేదరిక నిర్మూలన పథకం కింద ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వయం సహాయక గ్రూపులకు తమ బ్యాంకు నుంచి 1000 మహిళా గ్రూపులకు ఎనిమిది కోట్ల రూపాయలను ఇప్పటి వరకు పంపిణీ చేశామని, సక్రమంగా పని చేసే గ్రూపులకు మరింత ప్రోత్సాహాలు అందిస్తామని తెలిపారు. అలాగే రూరల్ బ్యాంకింగ్ డెవలప్‌మెంట్ ( ఆర్‌బిడి) మేనేజర్ అమిత్ కుమార్ మాట్లాడుతూ ఛీఫ్ మేనేజర్ ఆదేశాల మేరకు ఇన్సూరెన్స్‌లకు సంబంధించిన సందేహాలు తనను కలిసి నివృత్తి చేసుకోవాలని ఆయన కోరారు

మల్లికార్జునస్వామి దేవస్ధానంలో ఆర్జిత సేవ టికెట్ల ధరలను భారీగా పెం పు

 అష్ఠదశ శక్తి పీఠాల్లో ఒకటైన శ్రీశైల భ్రమరాంబికా, మల్లికార్జునస్వామి దేవస్ధానంలో ఆర్జిత సేవ టికెట్ల ధరలను భారీగా పెంచి భక్తులను దోచుకుంటున్నారని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నాగరాజు, కాళింగ నరసింహవర్మలు అన్నారు. భక్తులకు ఎలాంటి కష్టం వాటిల్లిన, కోరిన కోరికలు తీర్చు కొంగుబంగారం అయిన స్వామి, అమ్మవార్లను దర్శించుకోవడానికి, మొక్కులు తీర్చుకునే అవకాశం లేకుండా దేవస్ధానం వారు ఆర్జిత సేవ టికెట్ల ధరలను పెంచి భక్తులను నిలువు దోపిడీ చేయడం దారుణమని అన్నారు. మొన్నటికి మొన్న భక్తులు ఎంతో పవిత్రంగా చూసే లడ్డు, పులిహోర ప్రసాదాల ధరలను పెంచి భక్తులను ఇబ్బంది కల్గించాలని వారు విమర్శించారు. దేవస్ధానం అధికారులు భక్తుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసారు.

గ్రామాలలో పాల ప్రగతి కేంద్రాల

                                          
పాల ఉత్పత్తిని పెంచేందుకు గ్రామాలలో పాల ప్రగతి కేంద్రాల (మినీ డెయిరీ యూనిట్)ను ఏర్పాటు చేస్తున్నట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈఓ రాజశేఖర్ తెలిపారు. శనివారం స్థానిక ప్రశాంతి జిల్లా సమాఖ్య కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర మిల్క్ మిషన్ వర్క్‌షాపులో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రోజూ 3కోట్ల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతోందని, దీనిని 5 కోట్లకు పెంచేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు.

రాబోయే ఐదేళ్లలో పాడి పశువులు, దూడల పెంపకం, వట్టిపోయిన పశువుల పోషణ, పాలశీతల కేంద్రాల నిర్వహణ తదితర కార్యక్రమాలు చేపట్టి గణనీయమైన ఉత్పత్తి సాధించాలని అధికారులకు సూచించారు. ‘రాష్ట్ర మిల్క్‌మిషన్’ కార్యక్రమం ద్వారా జిల్లాలోని సభ్యులందరికీ అన్ని విషయాలు తెలియజేయాలనే ఉద్దేశంతోనే వర్క్‌షాపు కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రతి జిల్లాలోనూ సంచార పశు వైద్యశాలలను (మొబైల్ వెటర్నరీ క్లినిక్) ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పాలు పితకడంతో పరిశుభ్రత ముఖ్యమన్నారు

అనంతపురం జిల్లా మొదటిస్థానం సాధించింది వాటర్‌షెడ్ల పథకంలో

 వాటర్‌షెడ్ల పథకం నిర్వహణలో అనంతపురం జిల్లా మొదటిస్థానం సాధించింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం అమల్లో నాల్గవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. విజయవాడలో శుక్ర, శనివారాల్లో ఉపాధిహామీ పథకం సమీక్ష సమావేశం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జరిగిన ఉపాధిహామీ, వాటర్‌షెడ్ల పనులను మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, కమిషనర్ జయలక్ష్మి, స్పెషల్ ఆఫీసర్‌లు విద్యాసాగర్, సువర్ణతో పాటు డెరైక్టర్ ఏ.మురళి సమీక్షించారు. జిల్లాలో 1999 నుంచి 2007 వరకు రూ.227.38 కోట్ల వ్యయంతో 3,78,969.67 హెక్టార్ల విస్తీర్ణంలో వాటర్‌షెడ్ల పథకం అమలు చేశారు. మెగా వాటర్‌షెడ్ల పథకం 2009లో జిల్లాలో ప్రారంభం కాగా, 70 మెగా వాటర్‌షెడ్లు, 202 మైక్రో వాటర్‌షెడ్లు మంజూరయ్యాయి. ఇందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి.

వీటిని ప్రాతిపదికగా తీసుకున్న ప్రభుత్వం వాటర్‌షెడ్ల నిర్వహణలో జిల్లాకు మొదటిస్థానం ఇచ్చింది. ఉపాధిహామీ పథకం ప్రారంభం నుంచి జిల్లాలో 9,28,73,112 పనిదినాలు కల్పించారు. ఇందుకోసం రూ.1,158.91 కోట్లు ఖర్చు చేశారు. 2010-11లో 2,03,03,163 పనిదినాలు కల్పించి, రూ.332కోట్లు వ్యయం చేశారు. 2011-12లో 91,62,477 పని దినాలను ఇప్పటి వరకు కల్పించారు. ఇందుకోసం రూ.134.70 కోట్లు వెచ్చించారు. అలాగే ఉపాధి కూలీలకు రోజువారీ వేతనం సగటున రూ.106.35 పైసలు చెల్లించారు. నిధుల వినియోగం, కూలీల సగటు వేతనం పరిగణనలోకి తీసుకోవడంతో ఉపాధిహామీలో మాత్రం జిల్లాకు రాష్ర్టంలో నాల్గవ స్థానం దక్కింది.
ఎస్సీ, ఎస్టీల భూములను సాగులోకి తీసుకువచ్చే ప్రక్రియ జిల్లావ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ రైతుల భూములను ఉపాధిహామీ ద్వారా సాగులోకి తీసుకురావాల్సిందిగా ఆ పథకం కమిషనర్ జయలక్ష్మి ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో సుమారు 47 వేల ఎకరాల విస్తీర్ణంలో ఎస్సీ, ఎస్టీల బీడు భూములు ఉన్నాయని డ్వామా పీడీ ప్రభుత్వానికి నివేదించారు. ఇందులో 20 వేల ఎకరాలను ఈ ఏడాది సాగులోకి తీసుకురావాలని కమిషనర్ సూచించారు. బలహీన వర్గాలకు చెందిన 1,48,044.45 యూనిట్‌లలో రూ.532.96 కోట్లు వ్యయం చేసి ఉపాధి పనులు నిర్వహించారు