Sunday, 16 October 2011

తిరుపతిలో 18.61 ఎకరాల విస్తీర్ణంలో వసతి సముదాయాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు

                       
శ్రీవారి దర్శనార్ధం తిరుమలకు వచ్చే భక్తుల అవసరాలను దృష్టిలో వుంచుకుని తిరుపతిలో వసతి సముదాయాల నిర్మాణాలను టిటిడి చేపడుతోందని టిటిడి చైర్మన్ కనుమూరి బాపిరాజు అన్నారు. ఆయన శనివారం తిరుపతిలోని రెండవ సత్రం ఉచిత యాత్రికుల వసతి సముదాయాన్ని తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం నలుమూలల నుండి శ్రీవారి దర్శనార్ధం తిరుపతికి వచ్చే భక్తులకు తిరుమలలోనే కాకుండా తిరుపతిలో కూడా వసతి సముదాయాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ మూడు సత్రాలు 18.61 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన అతిపురాతనమైనవన్నారు. ఇప్పుడు వసతి సౌకర్యాలు ఎంతో బాగున్నాయని, వీటిని మరింత ఆధునీకరిస్తామన్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో వుంచుకుని తిరుపతిలో శ్రీనివాసం, మాధవం, విష్ణునివాసం వంటి వసతి సముదాయాలను తిరుపతిలో నిర్మించిందన్నారు. తిరుపతిలోనే భక్తులు ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం రెండవ సత్రాన్ని ఆయన పరిశీలించారు. నూతనంగా నిర్మిస్తున్న డార్మిటరీలను, మరుగుదొడ్లను పరిశీలించారు. భక్తులతో టిటిడి కల్పిస్తున్న సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు.
అండగావుంటా
ఆధైర్యపడవద్దు
తిరుపతిలోని టిటిడి ధర్మసత్రాలను పరిశీలించిన టిటిడి చైర్మన్ కనుమూరి బాపిరాజు శనివారం అక్కడకు చేరుకోగానే అక్కడ ఎంతోకాలంగా అసౌకర్యాల నడుమ జీవనం సాగిస్తున్న నిర్వాసితులు ఆయన పాదాలపై మొకరిల్లి తమకు న్యాయం చెయ్యాలని వేడుకున్నారు. దీంతో వారికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు

No comments:

Post a Comment