Sunday, 16 October 2011

టిటిడి పశుగ్రాస బరువునిర్దారణ పరికరాన్ని విరాళంగా అందజేశారు

 టిటిడి ఎస్వీ గోసంరక్షణశాలకు బెంగుళూరుకు చెందిన ఎస్‌ఏ ఎలక్ట్రానిక్ పరికరాల కంపెనీ 13 లక్షల రూపాయలు విలువ చేసే పశుగ్రాస బరువునిర్దారణ పరికరాన్ని శనివారం విరాళంగా అందజేశారు. టిటిడి ఇఓ ఎల్వీ సుబ్రహ్మణ్యంకు దాత ఎస్‌ఏ వెంకటేశన్ కుటుంబ సమేతంగా ఈ పరికరాన్ని అందజేశారు. దాదాపు 40 టన్నుల వరకూ ఈ పరికరం ద్వారా పశుగ్రాసాన్ని, ఇతర దాణాల బరువును గుర్తించవచ్చు. ఈ సందర్భంగా ఇఓ ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ధార్మిక సంస్ధాపనలో భాగంగా దేశం నలుమూలల నుండి విచ్చేసే దాతలు తమకు నచ్చిన రీతిలో టిటిడికి సహాయం అందించడం ముదావహామన్నారు. దాతలకు సంబంధించి టిటిడి ఎప్పుడు తనవంతు ప్రోత్సాహాన్ని అభినందనలను అందిస్తూనే వుంటుందన్నారు. స్వామివారి వైభవ ప్రచారంలో కూడా దాతలు బాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం దాత ఎస్‌ఏ వెంకటేశన్ మాట్లాడుతూ తాము కంపెనీ ప్రారంభించిన తొలిరోజుల్లోనే స్వామివారికి నాణేలు తూకం వేసే పరికరాన్ని అందించామన్నారు. ప్రస్తుతం తమ కంపెనీ స్వామి కృపతో 250 కోట్ల టర్నోవర్‌తో లాభసాటిగా నడుస్తొందన్నారు. భవిష్యత్తులో కూడా స్వామివారి సేవలో తరించడానికే తాము కట్టుబడి వుంటామన్నారు. ఈ కార్యక్రమంలో గోశాల సంచాలకులు హరినాథ్ రెడ్డి, ఇఎస్ వన్ సుధాకర్ తదితరులున్నారు

No comments:

Post a Comment