Monday, 23 January 2012

ఉప ఎన్నికలో తిరుపతి నుంచి చిరంజీవి భార్య సురేఖ పోటీ...!?

తిరుపతి శాసనసభ నియోజకవర్గంలో రాజకీయం ఇప్పటి నుంచే వేడెక్కుతోంది. చిరంజీవి రాజీనామా చేసి కేంద్ర మంత్రిగా వెళ్లిపోతే తిరుపతి శాసనసభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతుంది. ఉప ఎన్నిక జరిగితే కాంగ్రెసు ఓటమి పాలవుతుందనే భయాలను పక్కన పెడుతూ వ్యూహాత్మకంగా చిరంజీవి ముందుకు వస్తున్నట్లు కనిపిస్తోంది. ఉప ఎన్నికలో తిరుపతి అభ్యర్థిగా కాంగ్రెసు నుంచి చిరంజీవి భార్య సురేఖ పోటీ చేసే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. చిరంజీవి వారసురాలిగా తిరుపతి శాసనసభ నియోజకవర్గం నుంచి సురేఖ పోటీ చేసే అవకాశాలను ఆయన వర్గానికి చెందిన నాయకులు తోసిపుచ్చడం లేదు. తిరుపతిలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బలాబలాలపై చిరంజీవి తరుచుగా తన వర్గానికి చెందిన నాయకులను అడిగి తెలుసుకుంటున్నట్లు సమాచారం. అంతేకాకుండా తిరుపతి నియోజకవర్గంలో తరుచుగా పర్యటిస్తూ స్థానికులతో సంబంధాలను కొనసాగిస్తూ వస్తున్నారు. తిరుపతి నియోజకవర్గంలోని వర్గ సమీకరణలపై కూడా ఆయన ఆరా తీస్తున్నట్లు సమాచారం. తిరుపతి శాసనసభ నియోజక వర్గం సీటును చిరంజీవి కుటుంబ సభ్యులకు అప్పగించడానికి కాంగ్రెసు అధిష్టానం సంసిద్ధత వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. తిరుపతి నుంచి తన బావమరిది అల్లు అరవింద్‌ను లేదా సోదరుడు నాగబాబును పోటీకి దించే విషయంపై కూడా చిరంజీవి గతంలో ఆలోచన చేశారని చెబుతున్నారు. అయితే, తన సతీమణి సురేఖను పోటీకి దించితే 30 శాతం బలిజ ఓటర్ల మద్దతు పొందడంతో పాటు ఇతర వర్గాల మద్దతు కూడా లభిస్తుందని ఆయన భావిస్తున్నట్లు ఓ ఆంగ్ల దినపత్రిక రాసింది. సురేఖను కాంగ్రెసు పోటీకి దింపితే టిడిపి మాజీ శాసనసభ్యుడు చదలవాడ కృష్ణమూర్తి భార్య చదలవాడ సుచరితను పోటీకి దించాలని తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి భూమన కరుణాకర్ రెడ్డి పోటీ చేసే అవకాశాలున్నాయి.

చిరంజీవిని అడ్డుకున్న బిఇడి విద్యార్థులు

తిరుపతిలో బీఈడీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. థానిక శాసనసభ్యుడు చిరంజీవిని బిఇడి విద్యార్థులు సోమవారం అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. జివో నెంబర్ 3ను తొలగింప చేయాలని విజ్ఞప్తి చేశారు. చిరంజీవిని అడ్డుకున్న బిఇడి విద్యార్థులకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మద్దతు పలికింది. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత నారాచంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. చిరంజీవి నగరంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఉదయం తిరుపతి వచ్చారు. అంతకుముందు హైదరాబాద్ నుండి తిరుపతి విమానాశ్రయంలో దిగిన ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి పదవులు మూడు ఇవ్వలేమని చెప్పి అధిష్టానం సర్దుకోమని చెప్పిందని, తెలంగాణకు మరో విధంగా న్యాయం చేస్తామని చెప్పిందని అందువల్లే రెండు మంత్రి పదవులు ఒప్పుకున్నట్లు చెప్పారు.. తమ పాలిట శాపంగా పరిణమించిన ఏడో నెంబర్ జీవోను రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. అదే సమయంలో బయటకు వచ్చిన చిరంజీవి ఇరకాటంలో పడ్డారు. అభ్యర్థులకు స్పష్టమైన హామీ ఇవ్వకుండానే ఆయన వెళ్లిపోయారు.

నా రెండో రూపం వారికి తెలియదు...బాలకృష్ణ


చిరంజీవి-బాలకృష్ణ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.విశాఖ జిల్లా పర్యటనలో ఉన్న బాలకృష్ణ చిరంజీవిపై ధ్వజమెత్తారు. తనను ఒకరు బాలుడన్నారని, తమను ఒకవైపే చూశారని, తమ రెండో రూపం వారికి తెలియదని బాలకృష్ణ హెచ్చరించారు. అధికారం కోసం పార్టీని అమ్ముకోలేదని, సీఎం కుర్చీనే వారి జీవిత లక్ష్యమని బాలకృష్ణ అన్నారు. పార్టీని అమ్ముకున్న వారికి నాన్నగారితో పోలికా అంటూ ఆయన ప్రశ్నించారు. జిల్లాలో రెండోరోజైన సోమవారం పర్యటిస్తున్న బాలయ్య పెదవాల్తేరులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ పార్టీని అమ్ముకున్న వాళ్లా మమ్మల్ని విమర్శించేది అంటూ ధ్వజమెత్తారు. నాన్నగారి ఆశయాలే తమను రాజకీయాలకి ఆహ్వానించాయని బాలకృష్ణ పేర్కొన్నారు. ప్రజాధనాన్ని కుటుంబానికి దోచిపెట్టిన వారి విగ్రహాలు చూడాల్సివస్తోందని, స్వప్రయోజనాల కోసం కొందరు విగ్రహాలను రాజకీయం చేస్తున్నారని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ కాలిగోటికి ఎవరూ సరిపోరని అన్నారు. తండ్రి ఆశయాలను కొనసాగిస్తామని, టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.
బాలకృష్ణ వ్యాఖ్యలపై స్సందించను: చిరంజీవి

 బాలకృష్ణ ఎక్కడ నుంచి పోటీ చేసినా గొప్పేమీ లేదని, ఆ విషయాన్ని తాను లైట్ తీసుకుంటానని చిరంజీవి తిరుపతిలో అన్నారు.సినీహీరో బాలకృష్ణ వ్యాఖ్యలపై తాను స్పందించనని స్థానిక ఎమ్మెల్యే చిరంజీవి అన్నారు. చిత్తశుద్ధితో సేవచేసినంతకాలం ఎవరెన్ని వ్యాఖ్యలు చేసినా ప్రజలు పట్టించుకోరన్నారు. తనపై బాలకృష్ణ వ్యాఖ్యలను కూడా ప్రజలు పట్టించుకోరని ఆయన చెప్పారు. సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు నాయుడుకు లేదన్నారు. చంద్రబాబు పాలనలో బిసిలకు అన్యాయం జరిగిందన్నారు. కాంగ్రెస్ లో విభేదాలు ఏమీలేవని చెప్పారు. విభేదాలు అన్ని మీడియా కథనాలేనన్నారు.
నీచ రాజకీయాలకు బలి కావద్దు...లక్ష్మీపార్వతి
 
నీచ రాజకీయాలకు బలిపశువు కావద్దని సినీహీరో బాలకృష్ణకు ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి సలహా ఇచ్చారు. ఈ రోజు ఆమె ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు నీచుడు, నయవంచకుడు అటువంటి వ్యక్తితో బాలకృష్ణ చేతులు కలపడం బాధాకరం అన్నారు. మీ తండ్రికి వెన్నుపోటు పొడిచిన బాబుతో చేయి కలపడం భావ్యంకాదని బాలకృష్ణని ఉద్దేశించి ఆమె అన్నారు. తండ్రిని చంపిన వ్యక్తితో చేతులు కలుపుతావా? అని ప్రశ్నించారు. మీ తండ్రికి చేసిన నష్టాన్ని ఎవరైనా పూడ్చలుగుతారా? అని కూడా ఆమె అడిగారు. వేషాలు మార్చే చంద్రబాబుని ఎవరూ నమ్మరని చెప్పారు. కేసుల నుంచి బయటపడేందుకు చంద్రబాబు తెలుగు జాతి గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టుపెట్టారని విమర్శించారు. నీచుడు, అవినీతిపరుడైన చంద్రబాబుతో చేతులు కలపవద్దని, చక్రవర్తి కుమారుడిలాగా తలెత్తుకు బతకమని ఆమె బాలకృష్ణకు సలహా ఇచ్చారు.

సచిన్ సెంచరీ కంటే.. భారత్ గెలుపే ముఖ్యం..గౌతం గంభీర్

‘మాస్టర్ బ్లాస్టర్’ సచిన్ తెండూల్కర్ 100వ సెంచరీ కంటే భారత్ విజయమే ముఖ్యమని, టీమిండియా ఓపెనర్ గౌతం గంభీర్ అభిప్రాయపడ్డాడు. వ్యక్తిగత ప్రయోజనాల కన్నా జట్టు ప్రయోజనాలే కీలకమని వ్యాఖ్యానించాడు. ఆసీస్ టెస్టు సిరీస్‌ను ఇప్పటికే చేజార్చుకున్న క్రమంలో మంగళవారం అడిలైడ్‌లో చివరి టెస్టు జరగనున్న విషయం తెలిసిందే. దీంతో చివరి టెస్టునైనా గెలిచి ‘వైట్‌వాష్’ నుంచి తప్పించుకుని పరువు దక్కించుకోవాలని చూస్తున్న టీమిండియా ఇక్కడ ముమ్మర ప్రాక్టీస్ చేస్తోంది. ఈ సందర్భంగా ప్రాక్టీస్ సెషన్ అనంతరం విలేఖరులతో మాట్లాడిన గంభీర్..ప్రతి టెస్టు ప్రత్యేకమేనన్నారు. గత టెస్టు జయాపజయాలకు అతీతంగా తనను తాను మార్చుకొని సహజసిద్ధమైన ఆటలోకి ప్రవేశించని ఆటగాడు క్రికెట్‌కు పనికి రాడని పేర్కొన్నాడు. కాగా, ఒకటి, రెండు టెస్టు సిరీస్‌లలో విఫలం చెందినంత మాత్రానా చెడుగా భావించడం సరికాదని, ఇంగ్లాండ్, ఆసీస్ సిరీస్‌ల ముందు భారత్ ప్రపంచ ర్యాంకింగ్‌లో మొదటి స్థానంలో ఉందని గుర్తు చేశాడు. ఇక సచిన్ తెండూల్కర్ సెంచరీపై స్పందిస్తూ సచిన్ సెంచరీ సాధించడం కంటే జట్టు గెలిస్తేనే తనకు అమితానందమని, ఓ దేశం కోసం ఆడుతున్న సమయంలో వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు విజయానే్న ఆటగాడు కోరుకోవాలన్నాడు. సచిన్ సెంచరీ చేయలేదన్న బాధ కంటే నాలుగు టెస్టుల సిరీస్‌ను 0-3 తేడాతో చేజార్చుకోవడమే అధికంగా బాధిస్తోందని, చివరి టెస్టులో సచిన్ సెంచరీ కన్నా జట్టు 1-3 తేడాతో విజయం సాధిస్తేనే ఆనందమన్నాడు. సచిన్ సెంచరీ సాధించి, చివరి టెస్టులో ఓటమిపాలైతే అది తమకు ఆనందం కలిగించబోదన్నాడు. మరోవైపు తొలి మూడు టెస్టుల్లో దూకుడు మీదున్న ఆసీస్‌ను చివరి టెస్టులో కట్టడి చేసి విజయం సాధిస్తామనే ధీమాను ఈ సందర్భంగా గంభీర్ వ్యక్తం చేశాడు. ఆసీస్‌తో వనే్డ సిరీస్ ఉన్న నేపథ్యంలో బ్యాటింగ్ విధానంపై స్పందిస్తూ తాము స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తున్నామని, ఆసీస్ బ్యాట్స్‌మెన్లు ఆ విధంగా బ్యాటింగ్ చేయలేకపోతున్నారన్నాడు. అయితే ఈ పర్యటనలో తన ఫాం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశాడీ ఢిల్లీ బ్యాట్స్‌మన్. ఓపెనర్‌గా ఉన్న తాను పేలవమైన ప్రదర్శననిస్తున్నానని అంగీకరించాడు. అయితే ఓపెనర్‌గా దిగుతుండటంతో పరిస్థితులు భిన్నంగా ఉంటాయని, బంతి బాగా బౌన్స్ అవుతోందని వివరించాడు

Sunday, 22 January 2012

టిడిపి పార్టీ ఆదేశిస్తే చిరంజీవిపై పోటీ చేస్తా...బాలయ్య

తెలుగుదేశం పార్టీ ఆదేశిస్తే .. చిరంజీవిపై పోటి చేయడానికి సిద్ధమని బాలకృష్ణ స్పష్టం చేశారు. పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానని ఆయన అన్నారు. ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న బాలకృష్ణ పాడేరులో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని బలపరుస్తూ తాను పార్టీలో కొనసాగుతానని స్పష్టం చేశారు. తమ కుటుంబంలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవన్నారు. పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానని చెప్పారు. పాడేరులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.కాగా అంతకుముందు తాను ఏ ప్రాంతం నుండి పోటీ చేసేందుకైనా సిద్ధమని బాలకృష్ణ చెప్పారు. ఆయన విశాఖపట్టణంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పార్టీ ఆదేశిస్తే తాను ఎక్కడి నుండి పోటీ చేసేందుకైనా సిద్ధమని చెప్పారు. ఏ ప్రాంతమైనా తనకు ఫర్వాలేదన్నారు. ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీకి అత్యంత ప్రజాధరణ ఉందని చెప్పారు. సినిమాల్లో రాష్ట్ర ప్రజలు తనపై ఎంతగా ఆదరణ చూపారో అదే ఆదరణ రాజకీయాల్లోనూ తనపై ప్రజలు చూపాలని కోరుకుంటున్నానని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు టిడిపికి పట్టం కట్టడం ఖాయమన్నారు. కాగా బాలయ్య రాక సందర్భంగా విశాఖలో సందడి నెలకొంది. తెలుగుదేశం పార్టీలో క్యాడర్‌లో కొత్త ఉత్సాహం కనిపించింది. కాగా ఇటీవల బాలకృష్ణ రాజకీయ పర్యటనలు చేస్తున్న విషయం తెలిసిందే. తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు బాలయ్య పక్షం రోజుల క్రితం కృష్ణా జిల్లా పర్యటనలో విస్పష్ట ప్రకటన చేశారు. అప్పటి నుండి పలుమార్లు రాజకీయ కోణంలోనే మాట్లాడుతున్నారు. ఇటీవల ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కూడా తాను రాజకీయాల్లోకి వస్తున్నానని, ఎంపీగా కాకుండా అసెంబ్లీ నుండి పోటీ చేస్తానని చెప్పారు. బాలయ్య ఎక్కడి నుండి పోటీ చేసినా స్వాగతిస్తామని ఆయన అభిమానులు, టిడిపి క్యాడర్ చెబుతోంది.

24న జాతీయగీతం జనగణమన వందేళ్ల ఉత్సవం

జాతీయగీతం జనగణమనకు వందేళ్లు, విశ్వకవి రవీంద్రనాథ్‌ఠాగూర్ 150వ జయంతిని పురస్కరించుకుని మదనపల్లె బిటి కళాశాల ప్రిన్సిపల్ తులసీరామ్‌నాయుడు ఆధ్వర్యంలో ఈనెల 24న జనగణమన జాతీయగీత వందేళ్ల ఉత్సవం నిర్వహించనున్నారు. ఈ ఉత్సవానికి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, గవర్నర్ నరసింహన్, డిప్యూటి సిఎం దామోదర్ తో పాటు 10మందికి పైగా కేంద్ర, రాష్టమ్రంత్రులు, చిరంజీవి, ఎమ్మెల్యేలు, ఎంపిలు ఉత్సవానికి హాజరవుతున్నట్లు మదనపల్లె ఎమ్మెల్యే ఎం.షాజహాన్‌బాష వెల్లడించారు.  విశ్వకవి రవీంద్రుడు ఆరురోజుల పాటు మదనపల్లె బిటి కళాశాలలో బసచేసిన ప్రదేశాలు, నాడు జనగణమన గేయానికి బెంగాలీ నుంచి ఆంగ్లంలోకి ట్యూన్‌చేసి గీతాన్ని మొదటిసారిగా అప్పటి విద్యార్థులచే ఆలపించిన ప్రదేశాలను సిఎం, గవర్నర్‌లు పరిశీలించనున్న దృష్ట్యా వాటిని అధికారులు పరిశీలించారు. అనంతరం హెలీప్యాడ్ ల్యాండ్ స్థలం కోసం బెంగళూరురోడ్డులోని బిటి కళాశాల ఆవరణాన్ని పరిశీలించారు. అనంతరం జరిగే సిఎం బహిరంగ సభ కోసం పుంగనూరురోడ్డులోని మిషన్‌కాంపౌండు ఆవరణాన్ని పరిశీలించారు. అనంతరం ఆర్‌అండ్‌బి అతిథిగృహం, ఎమ్మెల్యే స్వగృహాన్ని కూడా అధికారులు పరిశీలించారు. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు సిఎం మదనపల్లె పట్టణంలో ఉంటున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్‌బాష స్థానిక విలేఖరులతో మాట్లాడారు. జనగణమనకు వందేళ్ళు, విశ్వకవి రవీంద్రునికి 150 జయంతి ఉత్సవాలను ఈనెల 24న ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా 24న మధ్యాహ్నం 2గంటలకు ప్రజలందరూ ఒకేసారి జనగణమన జాతీయగీతం ఆలపించే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

సత్యసాయి సూపర్ స్పె షాలిటీ హాస్పిటల్‌కు విద్యుత్ సబ్సిడీ రద్దు

లక్షలాది మంది రోగులకు ఉచిత వైద్య సేవలందించే సత్యసాయి సూపర్ స్పె షాలిటీ హాస్పిటల్‌కు ప్రభుత్వం భరించే విద్యుత్ సబ్సిడీని రద్దు చేస్తూ ప్రభుత్వం శనివారం అధికారికంగా ఉత్తర్వులు విడుదల చేసింది. జిఓఆర్‌సి నెం.9 మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. పుట్టపర్తిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను 1992లో ప్రారంభించారు. రోగుల నుండి ఒక నయాపైసా వసూలు చేయకుండా సేవలందిస్తున్న దృష్ట్యా విద్యు త్ సబ్సిడీని ప్రభుత్వం జీఓ ఎంఎస్ నెం 98 1993 ఏప్రిల్ 26 నుంచి ప్రభుత్వమే చెల్లించేది. ఇది సుమా రు రెండు దశాబ్దాలుగా ఈ ప్రక్రియ అమలవుతోం ది. ఇప్పటి దాకా సత్యసాయి సూపర్ స్పెషాలిటీ విద్యు త్ వినియోగానికి అనుగుణంగా ట్రాన్స్‌కోకు రూ. 4.2 కోట్లు ప్రభుత్వపరంగా సబ్సిడీ మొత్తం చెల్లించాల్సి వుంది. గత కొంతకాలంగా ఈ వ్యవహారంపై ట్రాన్స్‌కో సబ్సిడీ మొత్తాన్ని చెల్లించాలని సత్యసాయి సెంట్రల్ ట్రస్టుపై వత్తిడి తెస్తూ నోటీసులు సె తం జారీ చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ట్రస్టు కూడా ప్రభుత్వపరంగా విద్యుత్ సబ్సిడీ మొత్తాన్ని విడుదల చేయాలని కూడా తమ లేఖలో పలుమార్లు కోరింది. అయితే అనూహ్యంగా ప్రభు త్వం విద్యుత్ సబ్సిడీని రద్దు చేస్తూ శనివారం అధికారికంగా విడుదల చేసిన ఉత్తర్వుల్లో విద్యుత్‌ను వివిధ కంపెనీల నుంచి కొనుగోలు చేస్తున్న దృష్ట్యా కొనుగోలు వ్యయం 86% చేరిందని, ఈ క్రమంలో సబ్సిడీని వినియోగదారుడే భరించాలి తప్పా ట్రాన్స్ కో భరించే స్థితిలో లేదని ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వం ఈ అంశంపై ఎంతో కూలంకషంగా పరిశీలించిన పిమ్మట, ట్రాన్స్‌కో పంపిన ప్రతిపాదన మేరకు శ్రీ సత్యసాయి వైద్య విజ్ఞాన సంస్థకు భరించే విద్యుత్ సబ్సిడీని 2009 సంవత్సరం నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ట్రాన్స్‌కో ఎండి తన ఉత్తర్వు ల్లో పేర్కొన్నారు. జిఓ ఆర్‌సి నెం 9 మేరకు ఈ విద్యు త్ సబ్సిడీ రద్దు ప్రక్రియ అమలులోకి వస్తుందని వెలువరించిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వపరంగా సబ్సిడీ రద్దయితే ప్రతి నెల సూపర్‌స్పెషాలిటి హాస్పిటల్ వర్గాలు రూ. 16 లక్షల వంతు న విద్యుత్ చార్జీలు చెల్లించాల్సి వుంటుంది. హాస్పిటల్‌లో వినియోగించే విద్యుత్‌లో యూనిట్‌కు రూ.4 వంతున వసూలు చేసే మొత్తంలో రూ.3.70 పైసల వంతున ప్రభుత్వం సబ్సిడీని భరిస్తుండగా 30పైసల వంతున హాస్పిటల్ వర్గాలు విద్యుత్ బిల్లులు చెల్లించే ప్రక్రియ నేటి దాకా కొనసాగుతోంది. ప్రతి నెల సుమారు రూ. 16 లక్షల మేర బిల్లులు రానుండగా ఇందులో రూ. 3 లక్షల వంతున సత్యసాయి సూపర్ స్పెషాలిటీ వర్గాలు క్రమం తప్పకుండా చెల్లిస్తున్నాయి. అయితే ప్రభుత్వం తాజా ఉత్తర్వుల ప్రకారం విద్యుత్ బిల్లుల మొత్తాన్ని హాస్పిటల్ వర్గాలే భరించాల్సి వుంటుంది. సత్యసాయి శివైక్యం పొందిన తదుపరి ఈ పరిణామం చోటుచేసుకోవ డం పుట్టపర్తి ప్రజలను ద్రిగ్భాంతికి గురిచేసింది. లక్షలాది మంది నిరుపేదలకు ఉచితంగా వైద్య సేవలందిస్తున్న హాస్పిటల్‌కు విద్యుత్ సబ్సిడీని రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించడం అన్యాయమంటూ స్థానికులు ఆక్రోశిస్తున్నారు