Showing posts with label తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవి. Show all posts
Showing posts with label తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవి. Show all posts

Thursday, 9 February 2012

కాంగ్రెస్‌లో విభేదాలు వాస్తవమే...ఎమ్మెల్యే చిరంజీవి

కాంగ్రెస్ పార్టీలో విభేదాలు ఉన్నమాట వాస్తవమేనని తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవి అన్నారు. తిరుపతి పర్యటనకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌లో ఉన్న విభేదాలపై రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి గులాం నబీ ఆజాద్ దృష్టి సారిస్తున్నారని ఆయన అన్నారు. తిరుపతి నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు శాసనసభ్యుడు చిరంజీవి పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం నాడు తిరుపతి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుపతి నగర సమగ్రాభివృద్ధికి రూ. 405 కోట్లు విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సుముఖత వ్యక్తం చేశారని ఆయన అన్నారు. సీఎంతో బుధవారం జరిగిన సమావేశంలో అభివృద్ధిపైనే చర్చించినట్లు చిరంజీవి పేర్కొన్నారు.కాగా రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ ముడుపులు తీసుకున్నారంటూ వస్తున్న ఆరోపణలను చిరంజీవి ఖండించారు. ఆరోపణలు నిరాధారమని కొట్టిపారేశారు. మంత్రుల మధ్య సమన్వయానికి కృషి చేస్తానని, శాఖల కేటాయింపుల్లో కూడా సమన్వయం చేస్తామని చిరంజీవి పేర్కొన్నారు.

Friday, 27 January 2012

అభిమానులు ,ప్రజలకు ఎలా ఉండాలో ఫోన్ చేసి చెప్తా...ఎమ్మెల్యే చిరంజీవి

తనను నమ్ముకున్న ప్రజలకు సేవ చేయడానికి తనకున్న శక్తి సామర్థ్యాలు చాలనందునే కాంగ్రెస్‌తో జతకట్టానని తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవి వ్యాఖ్యానించారు.  నీతి నిజాయితీ ప్రాతిపదికగా తాను రాజకీయ రంగప్రవేశం చేశానని, సామాజిక న్యాయం కోసం పాటుపడుతున్నానని చెప్పారు. పూలేలాంటి గొప్ప నేతలను తెర మీదకు తెచ్చి సామాజిక న్యాయం గురించి తమ పార్టీ ప్రచారం చేసిన తర్వాతనే మిగిలిన పార్టీలు అనుసరించి ఆయన విగ్రహాలను పెట్టాయన్నారు.తన అభిమానులు ఎలా ఉండాలో వారికి ఫోన్ చేసి చెబుతానని తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి  మీడియాతో అన్నారు. అభిమానులు పరస్పరం గొడవలకు దిగడం సరికాదన్నారు. ఇలాంటి వాతావరణం తీసుకు రావడం మంచిది కాదన్నారు. మీ అందరికీ తెలుసునని తాను ఎప్పుడూ ఘర్షణలకు చోటిచ్చేలా మాట్లాడలేదన్నారు. అలా మాట్లాడటం ధర్మం, బాధ్యత కాదన్నారు.కాంగ్రెస్‌లో ప్రజారాజ్యం విలీనంపై వస్తున్న విమర్శలపై ఆయన స్పందిస్తూ రాజకీయ లబ్ధి కోసం ఎవరి కాళ్లా వేళ్లా పడాల్సిన అవసరం లేదన్నారు. ఒక శక్తి, మరో శక్తితో జత కడితే అద్భుతాలు సాధించగలనని భావించానన్నారు. అధికారాన్ని దక్కించుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదని, చేతకాని నేతలే తనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా చిరంజీవికి మంత్రి సి.రామచంద్రయ్య భారత రాజ్యాంగం పుస్తకాన్ని బహుకరించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, సి.రామచంద్రయ్య, సినీ నిర్మాత అల్లు అరవింద్, చిరంజీవి అభిమానులు పాల్గొన్నారు.

Monday, 23 January 2012

ఉప ఎన్నికలో తిరుపతి నుంచి చిరంజీవి భార్య సురేఖ పోటీ...!?

తిరుపతి శాసనసభ నియోజకవర్గంలో రాజకీయం ఇప్పటి నుంచే వేడెక్కుతోంది. చిరంజీవి రాజీనామా చేసి కేంద్ర మంత్రిగా వెళ్లిపోతే తిరుపతి శాసనసభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతుంది. ఉప ఎన్నిక జరిగితే కాంగ్రెసు ఓటమి పాలవుతుందనే భయాలను పక్కన పెడుతూ వ్యూహాత్మకంగా చిరంజీవి ముందుకు వస్తున్నట్లు కనిపిస్తోంది. ఉప ఎన్నికలో తిరుపతి అభ్యర్థిగా కాంగ్రెసు నుంచి చిరంజీవి భార్య సురేఖ పోటీ చేసే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. చిరంజీవి వారసురాలిగా తిరుపతి శాసనసభ నియోజకవర్గం నుంచి సురేఖ పోటీ చేసే అవకాశాలను ఆయన వర్గానికి చెందిన నాయకులు తోసిపుచ్చడం లేదు. తిరుపతిలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బలాబలాలపై చిరంజీవి తరుచుగా తన వర్గానికి చెందిన నాయకులను అడిగి తెలుసుకుంటున్నట్లు సమాచారం. అంతేకాకుండా తిరుపతి నియోజకవర్గంలో తరుచుగా పర్యటిస్తూ స్థానికులతో సంబంధాలను కొనసాగిస్తూ వస్తున్నారు. తిరుపతి నియోజకవర్గంలోని వర్గ సమీకరణలపై కూడా ఆయన ఆరా తీస్తున్నట్లు సమాచారం. తిరుపతి శాసనసభ నియోజక వర్గం సీటును చిరంజీవి కుటుంబ సభ్యులకు అప్పగించడానికి కాంగ్రెసు అధిష్టానం సంసిద్ధత వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. తిరుపతి నుంచి తన బావమరిది అల్లు అరవింద్‌ను లేదా సోదరుడు నాగబాబును పోటీకి దించే విషయంపై కూడా చిరంజీవి గతంలో ఆలోచన చేశారని చెబుతున్నారు. అయితే, తన సతీమణి సురేఖను పోటీకి దించితే 30 శాతం బలిజ ఓటర్ల మద్దతు పొందడంతో పాటు ఇతర వర్గాల మద్దతు కూడా లభిస్తుందని ఆయన భావిస్తున్నట్లు ఓ ఆంగ్ల దినపత్రిక రాసింది. సురేఖను కాంగ్రెసు పోటీకి దింపితే టిడిపి మాజీ శాసనసభ్యుడు చదలవాడ కృష్ణమూర్తి భార్య చదలవాడ సుచరితను పోటీకి దించాలని తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి భూమన కరుణాకర్ రెడ్డి పోటీ చేసే అవకాశాలున్నాయి.

Friday, 9 December 2011

శోభా నాగి రెడ్డిపై స్పీకర్‌కు ఫిర్యాదు...చిరంజీవి

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు శోభా నాగి రెడ్డిపై స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌కు ప్రజారాజ్యం పార్టీ ఫిర్యాదు చేసింది. చిరంజీవి నాయకత్వంలోని ప్రజారాజ్యం విప్ వంగా గీత శుక్రవారం సాయంత్రం స్పీకర్‌కు శోభా నాగిరెడ్డి ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన సమయంలో పార్టీ విప్‌కు వ్యతిరేకంగా ఆమె ఓటు వేసిన విషయం తెలిసిందే. అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని విప్ జారీ చేసినప్పటికీ ఆమె మాత్రం అనుకూలంగానే ఓటు వేశారు. దీంతో తీవ్ర తర్జన భర్జన అనంతరం చిరు ఫిర్యాదు చేసేందుకు నిర్ణయించుకున్నారు.2009 ఎన్నికల సమయంలో ఆళ్లగడ్డ పిఆర్పీ వర్గాలు శోభకు టిక్కెట్ వ్యతిరేకించినప్పటికీ చిరంజీవి ఇచ్చారని సమాచారం. ఇప్పుడు ఆమె తీరు చూసి చిరంజీవి ఆవేదన చెందుతున్నారట. మిగిలిన ఎమ్మెల్యేలంతా తనతో ఉంటున్నారు. కానీ కేడర్ వద్దంటున్నా టిక్కెట్ ఇచ్చి గెలిపించిన ఆమె వైఖరితో మాత్రం చిరంజీవిని ఆగ్రహానికి గురి చేస్తుందట

Tuesday, 6 December 2011

ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డిపై చర్యలు...చిరంజీవి

పార్టీ విప్ ధిక్కరించిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డిపై నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి మంగళవారం చెప్పారు. ఆయన పిఆర్పీ ఎమ్మెల్యేలతో తన నివాసంలో భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సాయంత్రం స్పీకర్‌ను కలిసి విప్ ధక్కరించిన ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడిన ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినందుకు తన ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారన్నారు. స్వార్థానికి అతీతంగా ప్రజల పక్షాన మేం నిలబడతామని చెప్పారు. అధికార పార్టీలో ఉన్నప్పటికీ సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళతామన్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించినందుకు సంతోషంగా ఉందన్నారు.ప్రజలు అభివృద్ధి ఎవరు చేస్తున్నారు, అవినీతి ఎవరు చేస్తున్నారో అర్థం చేసుకుంటున్నారని చెప్పారు. తమ ఎమ్మెల్యేలు ప్రజలకు ఉపయోగ పడే విధంగా ఏం చేసినా తప్పు కాదన్నారు. సిఎం పాలనపై తమకు విశ్వాసం ఉందన్నారు. పిఆర్పీ ఎమ్మెల్యేలను కొందరు ప్రలోభాలకు గురి చేశారని కానీ అవి సఫలం కాలేదన్నారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రతిపక్షాలు అవిశ్వాసం పెట్టాయని విమర్శించారు. పడగొట్టి కుర్చీ ఎక్కాలనుకున్న వారి కోరికను మేం నెరవేరకుండా చేశామన్నారు. నిన్నటి అవిశ్వాసం ఘటన విపక్షాలకు చెంపపెట్టు అన్నారు.

Saturday, 3 December 2011

తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవి బుజ్జగిస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి

తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గత ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిని బుజ్జగించే ప్రయత్నంలో పడ్డారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించిన నేపథ్యంలో చిరంజీవి కాంగ్రెసు నాయకత్వంపై తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశారు. తమను గడ్డిపోచల్లా చూస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు. ప్రజారాజ్యం పార్టీకి చెందిన శానససభ్యులు చిరంజీవి వద్ద తమ ఆవేదనను వెళ్లబోసుకున్నారు. ఈ స్థితిలో తన వర్గం శానససభ్యులతో చిరంజీవి రేపు ఆదివారం అత్యవసరంగా సమావేశమవుతున్నారు. ప్రజారాజ్యం పార్టీకి చెందిన 17 మంది శాసనసభ్యులకు కాంగ్రెసు జారీ చేసే విప్ వర్తించదు. దీంతో అవిశ్వాసంపై ఓటింగు సందర్భంగా ప్రజారాజ్యం పార్టీకి చెందిన ఏ కొద్ది మంది జారిపోయినా ప్రభుత్వం చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది. దీంతో కాంగ్రెసు కలవరానికి గురవుతోంది. ప్రభుత్వ విప్ కొండ్రు మురళి చిరంజీవికి ఫోన్ చేసి మాట్లాడారు. ప్రజారాజ్యం పార్టీ శానససభ్యులు అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటు చేసేలా చూడాలని ఆయన చిరంజీవిని అభ్యర్థించారు.