Monday, 2 January 2012
ద్విచక్ర వాహనాలతో కాలేజీలకు వచ్చేవిద్యార్థులకు హెల్మెట్ తప్పనిసరి
కర్నూలు జిల్లా ఉప ఎన్నికల అభ్యర్థులపై పార్టీల కసరత్తు!
విద్యార్థిలా దర్శనమిచ్చిన ద్రవిడ్!
డీఎస్సీ నోటిఫికేషన్కు సీఎం ఆమోదం
రాష్ట్రంలో భారీగా టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
ఇచ్చింది. ఇప్పటికే ఖాళీగా 11 వేల పోస్టులతోపాటు మరో తొమ్మిదివేల పోస్టులకు
సీఎం ఆమోదం తెలిపారు. జనవరి 15 తేది తర్వాత 20 వేల పోస్టులతో డీఎస్సీ
నోటిఫికేషన్ను ప్రభుత్వం జారీ చేయనుంది. 11 వేల 139 ఖాళీలను ఇప్పటికే
గుర్తించారు. వాటిలో 7 వేలకు పైగా ఎస్జీటీ పోస్టులు, 2 వేలకు పైగా స్కూల్
అసిస్టెంట్ పోస్టులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ పోస్టులకు తోడుగా
మరో 9 వేల 659 పోస్టులను ఒకేసారి భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు
చేపట్టింది.
డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల భర్తీకి సీఎం ఆమోదం తెలిపిన నేపథ్యంలో రాలయసీమ జిల్లాల వారీగా ఉన్న టీచర్ పోస్టుల ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.
చిత్తూరు- 528, కడప- 97, అనంతరపురం- 399, కర్నూలు- 625
డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల భర్తీకి సీఎం ఆమోదం తెలిపిన నేపథ్యంలో రాలయసీమ జిల్లాల వారీగా ఉన్న టీచర్ పోస్టుల ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.
చిత్తూరు- 528, కడప- 97, అనంతరపురం- 399, కర్నూలు- 625
Sunday, 1 January 2012
2014 ఎన్నికలలోపు జగన్ తిరిగి కాంగ్రెసులోకి రాక తప్పదు..జెసి దివాకర్ రెడ్డి
ప్రభుత్వ ఉద్యోగార్థులకు వయో పరిమితి రెండేళ్లు పెంపు
నిరుద్యోగులకు ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి నూతన సంవత్సరం కానుక
ప్రకటించారు. అన్ని కేటగిరీల్లో గరిష్ఠ వయోపరిమితిని రెండు సంవత్సరాలు
పెంచుతున్నట్లు శనివారం ప్రకటించారు. కొన్నేళ్ళుగా ఖాళీల భర్తీ జరగకపోవడం,
ఇదే క్రమంలో ఇటీవల లక్ష ఉద్యోగాల భర్తీకి నిర్ణయించడంతో... వయో పరిమితి
పెంచాలంటూ విన్నపాలు అందాయి. దీంతో అధిక సంఖ్యలో నిరుద్యోగులకు అవకాశం
కల్పించాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి వయో పరిమితి పెంపు నిర్ణయం
తీసుకున్నారు. ప్రస్తుతం సర్వీసులో ఉండి మరో పోస్టుకు దరఖాస్తు
చేసుకునేవారికి కూడా ఈ వయోపరిమితి పెంపు వర్తిస్తుంది.
Subscribe to:
Posts (Atom)