Showing posts with label టీమిండియా క్రికెట్ బ్యాట్స్‌మన్‌ రాహుల్ ద్రవిడ్. Show all posts
Showing posts with label టీమిండియా క్రికెట్ బ్యాట్స్‌మన్‌ రాహుల్ ద్రవిడ్. Show all posts

Saturday, 28 January 2012

త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై!...ద్రవిడ్

భారత క్రికెట్‌కు అమూల్యమైన సేవలు అందించి, ఎన్నో కీలక సమయాల్లో క్రికెట్ల వద్ద పాతుకుపోయి జట్టుకు అండగా నిలిచిన సీనియర్ బ్యాట్స్‌మన్ రాహుల్ ద్రవిడ్‌కు అడెలైడ్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి, నాలుగో టెస్టే బహుశా చివరి టెస్టు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 37 ఏళ్ల ద్రవిడ్ త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్తాడని అతని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఆసీస్ టూర్‌లో ఉన్న టీమిండియా నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను ఇప్పటికే 0-3 తేడాతో కోల్పోయిన విషయం తెలిసిందే. చివరి టెస్టులోనూ ఓటమి ముంగిట నిలిచింది. ఈ సిరీస్‌లో ద్రవిడ్ ఆశించిన స్థాయిలో రాణించలేక విమర్శలు ఎదుర్కొంటున్నాడు. 24.25 సగటుతో 194 పరుగులు మాత్రమే చేయగలగడాన్ని ద్రవిడ్ జీర్ణించుకోలేక పోతున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే వనే్డ ఇంటర్నేషనల్స్, టి-20 ఫార్మెట్స్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన అతను, ఇక టెస్టులకు కూడా గుడ్‌బై చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బహుశా అతను శనివారం మ్యాచ్ ముగిసిన వెంటనే తన నిర్ణయాన్ని ప్రకటించినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. భారత్‌ను ఓడించాలంటే ముందుగా ద్రవిడ్‌ను అవుట్ చేయాలని ప్రపంచ దేశాలు భావించేవి. జట్టుకు కొండంత అండగా ఉంటాడు కాబట్టే అతనిని అభిమానులు ‘ది వాల్’ అంటూ పిలుస్తారు. టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్ జాబితాలో సచిన్ తెండూల్కర్ (15,470) తర్వాతి స్థానం ద్రవిడ్‌దే. అతను 13,288 టెస్టు పరుగులు చేశాడు. 52.31 సగటుతో రాణించిన అతని ఖాతాలో 36 సెంచరీలు కూడా ఉన్నాయి. టెస్టుల్లో అతని అత్యధిక స్కోరు 270 పరుగులు. కెరీర్‌లో ఇప్పటి వరకూ 164 టెస్టులు ఆడిన ద్రవిడ్ 210 క్యాచ్‌లతో ఈ విభాగంలో నంబర్‌వన్ స్థానంలో ఉన్నాడు. ‘క్రికెట్ మక్కా’గా పేరొందిన లార్డ్స్ మైదానంలో 1996లో తొలి టెస్టు ఆడిన ద్రవిడ్ 2005-07 మధ్యకాలంలో భారత జట్టుకు కెప్టెన్‌గా కూడా సేవలు అందించాడు. అవసరాలను బట్టి వికెట్‌కీపింగ్ బాధ్యతలను కూడా చేపట్టే సత్తావున్న ద్రవిడ్ ప్రస్తుతం ఫామ్ కోల్పోయి సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అందుకే, అతను రిటైర్మెంట్ గురించి తీవ్రంగా యోచిస్తున్నాడని తెలుస్తోంది. అయితే, ఈ సమాచారంపై వివరణ కోరడానికి పిటిఐ ప్రయత్నించినప్పుడు అతను అందుబాటులో లేడు.ఇలావుంటే, ద్రవిడ్‌తోపాటు ఈ సిరీస్‌లో విఫలమైన మరో సీనియర్ ఆటగాడు వివిఎస్ లక్ష్మణ్‌పైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు మాజీ క్రికెటర్లు అతను రిటైర్ అయితేనే మేలని సూచిస్తున్నారు. ఇప్పట్లో అలాంటి యోచన లేదని లక్ష్మణ్ ఇటీవల ప్రకటించినప్పటికీ, ఒకవేళ ద్రవిడ్ రిటైరైతే, దాని ప్రభావం అతనిపై తప్పక ఉంటుందని అంటున్నారు. కానీ, అతని భవిష్యత్ ప్రణాళికలు ఏమిటో తెలియడం లేదు.

Monday, 2 January 2012

విద్యార్థిలా దర్శనమిచ్చిన ద్రవిడ్!

సీనియర్ బ్యాట్స్‌మన్‌గా టీమిండియాకు ఎనలేని సేవలు అందిస్తున్న ‘మిస్టర్ డిపెండబుల్’ రాహుల్ ద్రవిడ్ టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన రెండవ మేటి బ్యాట్స్‌మన్‌గా రికార్డులకెక్కి ఉండవచ్చు. కానీ క్రికెట్‌లో మాత్రం ద్రవిడ్ ఇప్పటికీ నిత్య విద్యార్థిగానే కొనసాగతున్నాడు. ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (ఎస్‌సిజి)లో మంగళవారం నుంచి ప్రారభం కానున్న రెండో టెస్టు సన్నద్ధమవుతున్న ద్రవిడ్ ఆదివారం ముమ్మరంగా నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొని మరోసారి విద్యార్థిలా దర్శనమిచ్చాడు. బ్యాటింగ్‌లో కొత్త మెళకువలను నేర్చుకుంటూ క్రికెట్ పట్ల తనకున్న నిబద్ధతను, అంకితభావాన్ని చాటుకున్నాడు. ఫీల్డింగ్ కోచ్ ట్రెవర్ పెన్నీ స్వల్ప దూరం నుంచి విసురుతున్న బంతులను ఎదుర్కొంటూ సాధన చేసిన ద్రవిడ్ తన బ్యాటింగ్ తీరును నిశితంగా గమనించి తగిన సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా టీమిండియా కోచ్ డంకన్ ఫ్లెచర్‌ను కోరాడు. ఈ సిరీస్‌లో భాగంగా ఇంతకుముందు మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌లోనూ క్లీన్‌బౌల్డ్‌గా పెవిలియన్‌కు చేరిన ద్రవిడ్ ఇప్పుడు నెట్స్‌లో తన బ్యాటింగ్ తీరును మరోసారి సమీక్షించుకుని లోపాలను సరిదిద్దుకునేందుకు ప్రయత్నించాడు. మైదానంలో ప్రత్యర్థి జట్టు బౌలర్లు విసిరే బంతులను డిఫెన్సివ్ స్ట్రోక్స్ రూపంలో ఆఫ్ సైడ్‌కు తరలిస్తున్నప్పడు తన బ్యాట్‌కు-ప్యాడ్‌కు మధ్య ఎందుకు గ్యాప్ ఏర్పడుతోందో పరిశీలించుకున్నాడు. నెట్ ప్రాక్టీస్‌లో ద్రవిడ్ ఆటతీరును పరిశీలించిన ఫీల్డింగ్ కోచ్ ట్రెవర్ పెన్నీ, జట్టు కోచ్ ఫ్లెచర్ పైన పేర్కొన్న లోపాన్ని సరిదిద్దేందుకు అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చారు. ద్రవిడ్‌తో పాటు టీమిండియాలోని మిగిలిన సభ్యులు కూడా  ఉదయం 9 గంటలకే మైదానంలోకి దిగి ముమ్మరంగా నెట్ ప్రాక్టీస్‌ను కొనసాగించారు. డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెవాగ్, ‘మాస్టర్ బ్లాస్టర్’ సచిన్ తెండూల్కర్, సీనియర్ పేసర్ జహీర్ ఖాన్, విరాట్ కోహ్లి నెట్స్‌లో ఎంతో ఉల్లాసంగా గడిపారు. బిసిసిఐ (్భరత క్రికెట్ కంట్రోల్ బోర్డు) సెలెక్టర్లు నరేంద్ర హీర్వాణి, మొహిందర్ అమర్‌నాథ్ కూడా నెట్స్ వద్దకు వచ్చి ఆటగాళ్ల సాధనను పరిశీలించారు.