Thursday, 29 December 2011

విష్ణు ఈ సారి తప్పకుండా కొడతాడంటున్న...మోహన్ బాబు

తన కుమారుడు విష్ణు ఈ సారి తప్పకుండా హిట్ కొడతాడంటున్నారు సినీయర్ నటుడు మోహన్ బాబు. విష్ణ, హన్సిక జంటగా జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ సమర్పణలో 24ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఓ వినోద భరితమైన చిత్రాన్ని నిర్మించబోతోంది. జనవరి 5న ఈ చిత్రం షూటింగ్ ప్రారంభ కానున్న నేపథ్యంలో మోహన్ బాబు మీడియాతో మాట్లాడుతూ విష్ణు కెరీర్లోనే అద్భుతమైన హిట్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం, చక్రి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని నాలుగు పాటలు ఇప్పటికే రికార్డు చేయడం పూర్తయిందన్నారు. 2012లో ఈ సినిమా తమ బేనర్ లో మంచి విజయాన్ని సాధిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. లక్ష్మి ప్రసన్న నిర్మాతగా రూపొందుతున్న ఊ కొడతారా ఉలిక్కి పడతారా చిత్రం కూడా మనోజ్ కెరీర్ లో మంచి హిట్ గా నిలుస్తుందని, బయటి బ్యానర్లో మనోజ్ నటిస్తున్న మిస్టర్ నోకియా చిత్రం కొత్త సంవత్సరంలో ఘన విజంయ సాధిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

మల్టీస్టారర్ చిత్రాలు పెరిగేనా?

ప్రతి ప్రేక్షకునికి ఇద్దరు అభిమాన నటులుంటారు. వారిద్దరూ కలిసి, ఒకే సినిమాలో నటిస్తే చూడాలని, అన్నివర్గాల ప్రేక్షకులకు వుంటుంది. పాత తరం నటుల్లో దాదాపు అగ్ర హీరోలందరూ కలిసి నటించి, అభిమానుల్ని అలరించారు. కానీ నేటి తరం ప్రేక్షకులకు ఆ కమ్మని అనుభూతి కలగానే మిగిలిపోయింది. ఆరోజుల్లో ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్‌బాబు లాంటి అగ్రనటులు ఎటువంటి భేషజాలు లేకుండా కలిసి నటించి అభిమానుల్ని ఆనందపరిచారు.ఎందుకో తెలియదు గాని ఈనాటి హీరోలు మల్టీస్టారర్ సినిమాల గురించి ఆలోచించడం లేదు. ఏ నటున్నైనా ఈ విషయం గురించి ప్రస్తావిస్తే, సరైన కథ దొరికితే, తప్పకుండా కలిసి నటిస్తామని చెబుతుంటారు. సరైన కథలంటే ఏంటో వారికే తెలియాలి. తెలుగు సినీ పరిశ్రమలో ఎందరో చక్కని కథారచయితలు, దర్శకులున్నారు. వీరు ఆ మాత్రం కథల్ని అందించలేరా? ఇప్పుడు ఇక్కడి హీరోలకు కలిసి నటించేందుకు కావాల్సింది కథలు మాత్రమే! సాటి హీరోలతో కలిసి నటించాలన్న అభిలాష లేకపోవడంవల్లనే, మల్టీ స్టారర్ సినిమాలు రావడం లేదు. అప్పట్లో కొనే్నళ్ళపాటు చిరంజీవి, బాలకృష్ణ కలిసి నటిస్తే చూడాలని ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూశారు. చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్ళడం వలన, ఇక వారి అభిమానుల ఆశ, అడియాసగానే మిగిలిపోయింది. కాబట్టి ఇప్పుడైనా స్టార్ ఇమేజ్ వున్న హీరోలు మల్టీ స్టారర్ చిత్రాలపై దృష్టిసారిస్తే మంచిది.ఇలా నటించడంవలన అభిమాన ప్రేక్షకులకు ఆనందం పంచడమే కాకుండా, పరిశ్రమలో సుహృద్భావ వాతావరణంకోసం కృషిచేసిన వారిగా చెప్పుకోబడతారు.ఇటీవల అనౌన్స్ అయిన మల్టీస్టారర్ సినిమాలు ప్రేక్షకులకు కాస్త ఊరటగా అనిపించింది. వెంకటేష్ మహేష్‌బాబుతో కలిసి నటించబోతున్న ‘‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’’అనే చిత్రం, రామ్‌చరణ్ తేజ్ అల్లు అర్జున్‌తో కలిసి నటిస్తున్న సినిమాలు రాబోయే రోజుల్లో మల్టీస్టారర్ సినిమాల వాతావరణాన్ని సృష్టిస్తాయని తెలుగు సినీ ప్రేక్షకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ గోపీచంద్ లాంటి యంగ్ హీరోలు కూడా ఒకరితో ఒకరికి కలిసి నటించాలని వుందన్న విషయాన్ని, బయటపెట్టడం అభినందనీయం. ఇప్పుడున్న స్టార్ హీరోలలో నాగార్జున, మోహన్‌బాబు, శ్రీహరి, జగపతిబాబు, శ్రీకాంత్, రవితేజ, అల్లరి నరేష్ మొదలైనవారు మల్టీ స్టారర్ సినిమాలకు సై అంటున్నారు.వీరిలా అందరు హీరోలు ఆలోచిస్తే ఎంతో బాగుంటుంది. కొంతకాలంపాటు హీరోలందరూ భేషజాలు పక్కనపెడితే, సూపర్ హిట్ మల్టీస్టారర్ సినిమాలు వస్తాయి. అప్పుడు మనం బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్, జూ.ఎన్టీఆర్, ప్రభాస్, నాని, గోపీచంద్ వంటి హీరోలు ఒకరితో ఒకరు కలిసి నటిస్తే, చూసి తరిస్తాం. అప్పుడు బాక్స్ ఆఫీసులు కూడా పచ్చనోట్లతో కళకళలాడుతాయి.

రామ్‌చరణ్ పూర్తి చేస్తాడు, పదవి ఏదైనా ఓకే: చిరంజీవి

మిగిలిన తన సినీ ప్రస్థానాన్ని తన తనయుడు రామ్‌చరణ్ తేజ పూర్తి చేస్తాడని తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి గురువారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అన్నారు. కాంగ్రెసు పార్టీ ఏ పదవి ఇచ్చినా తనకు అభ్యంతరం లేదన్నారు. ఏ పదవి ఇచ్చినా స్వీకరించి పార్టీ కోసం పని చేస్తానన్నారు. తాను పదవి కోసం ఎప్పుడూ పాకులాడదేలన్నారు. తన బలం, బలహీనత రెండూ అభిమానులేనని ఆయన అన్నారు.కాగా చిరంజీవి వర్గం శాసనసభ్యులకు కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో రెండు పదవులు ఇచ్చేందుకు అధిష్టానం సుముఖత వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. సిఎం కిరణ్ తన ఢిల్లీ పర్యటనలో చిరు వర్గానికి మంత్రి పదవుల అంశంపై కూడా చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది.

జనవరిలో వ్యవసాయ అధ్యయన కమిటీ పర్యటన

'జిల్లాలో వ్యవసాయ రంగం నష్టం పోవడానికి కారణాలను అధ్యయనం చేసేందుకు ఏర్పాటు అయిన కేంద్ర క మిటీ జనవరిలో.. జిల్లాలో పర్యటన చేస్తుంది. ఇక్కడి వాస్తవ పరిస్థితులు, పక్కా సమాచారం సేకరించి ఆ బృం దానికి నివేదికలు ఇవ్వండి. పర్యటన లో కూడా ఎలాంటి పొరపాట్లు జరగకుండా ప్రణాళిక బద్ధంగా చేపట్టేందు కు సిద్ధం చేయాల'ని అధికారులకు రె వెన్యూ శాఖ మంత్రి రఘవీరారెడ్డి ఆదేశించారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జనవరిలో 12 మంది సభ్యులతో కూడిన కేంద్ర బృం దం జిల్లాలో పర్యటించనుందన్నారు. జిల్లా వ్యాప్తంగా పర్యటించి సమగ్రం గా పరిశీలన జరిపి జిల్లా వ్యవసాయ అభివృద్ధి ప్రణాళికను తయారుచేస్తారన్నారు ఇందు కోసం వారికి అవసరమైన పూర్తి సమాచారాన్ని ప్రణాళిక బ ద్ధంగా రూపొందించి అమలు చేయాలన్నారు. వారికి సరైన దిశానిర్దేశం చేయాలన్నారు. రైతులు ఇబ్బందుల తెలుసుకుని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి జి ల్లాకు రెండు టీఎంసీల నీటిని కేసీకెనాల్ ద్వారా విడుదలకు ఆదేశాలు ఇ చ్చారన్నారు. సాగునీటి కోసం రైతులు ఎలాంటి ఆందోళనలకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. అన్ని ప్రాంతాలకు కచ్చితంగా సాగునీరు అందిస్తామన్నారు.

Wednesday, 28 December 2011

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌తో మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి ‘ఢీ’

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి వాదులాటకు దిగినట్లు తెలుస్తోంది. ఆరోగ్యశ్రీపై ముఖ్యమంత్రి బుధవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో కిరణ్ కుమార్ రెడ్డికి, రవీంద్రా రెడ్డికి మధ్య వాగ్వివాదం జరిగినట్లు తెలుస్తోంది. 104 సర్వీసుల ఉద్యోగుల తొలగింపుపై ఇరువురి మధ్య భేదాభిప్రాయాలు చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. ఎక్కువగా ఉన్న 104 సర్వీసుల ఉద్యోగులను తొలగించాలని రవీంద్రా రెడ్డి పట్టుబట్టగా అలా తొలగిస్తే సమస్యలు వస్తాయని ముఖ్యమంత్రి చెప్పినట్లు సమాచారం. దీంతో రవీంద్రా రెడ్డి సమావేశం నుంచి మధ్యలో ఆగ్రహంగా బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. 104 సర్వీసుల్లో హెచ్ఎంఆర్ఐ అవసరానికి మించి ఉద్యోగులను నియమించిందని, ఎక్కువగా ఉన్న ఉద్యోగులను తొలగించే విషయంపై పరిశీలిస్తున్నామని డిఎల్ రవీంద్రా రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రితో ఏ విధమైన వాగ్వివాదం జరగలేదని ఆయన చెప్పారు. 108 సర్వీసులను నెలలోగా అందుబాటులోకి తెస్తామని ఆయన చెప్పారు. 104 సర్వీసులను ప్రభుత్వమే నిర్వహించాలా, కొత్త టెండర్లను ఆహ్వానించాలా అనే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే, ఆరోగ్యశ్రీ పథకాన్ని ట్రస్టు పద్ధతిలో నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. దానిపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. దీంతో జివికె నుంచి 108 సర్వీసులను తప్పిస్తారు.

ఎన్నికలు ఎప్పుడొచ్చినా పోటీకి సిద్ధమే....భూమానాగిరెడ్డి

రాష్ట్రంలో ఉప ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీకి సిద్ధంగా ఉన్నారని వెనకాడే ప్రసక్తే లేదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ గవర్నింగ్ సభ్యులు మాజీ ఎంపి భూమానాగిరెడ్డి పేర్కొన్నారు.  గోస్పాడులో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరు, ఆళ్ళగడ్డ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు ఎప్పుడు జరిగినా పోటీకి సిద్ధంగా ఉన్నామని భూమా స్పృష్టం చేశారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి రాజీనామా చేసిందన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి రైతుల అభ్యున్నతికి పాటుపడుతున్నారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ ఆశయాలను కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తుందన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ప్రజలు బ్రహ్మరథం పట్టి గెలిపిస్తారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పెంచిన ధరలతో రైతులు, సామాన్య ప్రజానికం కొట్టుమిట్టాడుతూ ఇబ్బందులు పడుతున్నారని ఇంత అసమర్థత ప్రభుత్వాన్ని ఎన్నడు చూడలేదన్నారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. రైతుల అభ్యున్నతే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. ఆళ్ళగడ్డ ఉప ఎన్నికలు ఎప్పుడు జరిగినా తాము సిద్దంగా ఉన్నామని మాజీ ఎంపి భూమానాగిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

రాలయసీమ జిల్లాలో మాఫియాకు రాజకీయ అండ!

రాలయసీమ జిల్లాలో అడ్డదారిలో సంపాదనకు అలవాటు పడిన వారు మాఫియా మారి రాజకీయ అండదండలతో చెలరేగి పోతున్నారు. వీరిని కాదని సామాన్యుడికి న్యాయం ఎలా జరుగుతుందన్న ప్రశ్న ప్రజల నుంచి ఎదురవుతోంది. మాఫియాకు రాజకీయ నాయకులు, రాజకీయ నాయకులకు అధికారులు అండగా ఉన్నంత కాలం ఏ అక్రమ వ్యవహారాన్ని అడ్డుకోలేరని వారు తేల్చి చెబుతున్నారు. తమ కష్టం తమకు తప్పదని మాఫియా విషయంలో జోక్యం చేసుకోవడం ప్రమాదమే కాని ప్రయోజనం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మద్యం, ఇసుక దందాలపై హడావుడి చేసి దాడులు నిర్వహించి భరతం పట్టాలని ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం వాటి అమలులో శ్రద్ధ చూపకపోవడమే ఇందుకు నిదర్శనమని ప్రజలు పేర్కొంటున్నారు. జిల్లాలో మద్యం అధిక ధరలకు విక్రయించడం, ఇసుక అక్రమ రవాణాతో పాటు అడవులను కొల్లగొడుతూ ఎర్ర చందనం, గనులను తవ్వుతూ అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారు. వీటిపై ఉక్కు పాదం మోపితే ప్రభుత్వ ఖజానాకు భారీ ఎత్తున నిధులు సమకూరుతాయి. అయితే ఎక్కడా, ఏ అధికారి ఆ దిశగా అడుగులు వేస్తున్న దాఖాలు కనిపించడం లేదు. అధికారులు పట్టించుకోకపోవడంతో అక్రమార్కుల మేడలపై మేడలు కడుతూ, బీరువాల్లో కరెన్సీ నోట్ల కట్టలను పేర్చుకుంటున్నారు. ఖనిజ సంపదతో పాటు మద్యం వ్యవహారంలో రాజకీయ నాయకులకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సంబంధాలు ఉండటంతో మాఫియాలకు తలొంచుతూ వారి వైపు పోలీసు, రెవిన్యూ, గనులు, విజిలెన్స్ అధికారులు కనె్నత్తి చూడడం లేదు. పరోక్షంగా సంబంధాలు ఉన్న రాజకీయ నాయకులు తమ మద్దతుగా ఉన్నందుకు వారికి భారీగా నజరానా ముడుతోందన్న ఆరోపణలు బలపడుతున్నాయి. ఇక ప్రత్యక్షంగా సంబంధాలు ఉన్న నాయకులు అధికారుల సహకారంతో తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు. ఈ వ్యవహారంలో అధికార, ప్రతిపక్ష నాయకులు ఆరోపణలు చేసుకునే విషయం బహిరంగంగా జరిగితే లోలోన మాత్రం ఒక అభిప్రాయానికి వచ్చి తమ పని చక్కబెట్టుకుంటారంటున్నారు. మద్యం, ఇసుక, కలప, మైనింగ్ మాఫియాలపై నాయకులు చేసే హడావుడి కేవలం తమను నమ్మించడానికి చేసే ప్రయత్నమేనని చెబుతున్నారు. నిజాయితీ కలిగిన రాజకీయ నాయకులను వెతికితే ఎక్కడో ఒకరో ఇద్దరో కనిపించినా వారు కూడా మాఫియాను, వారికి అండగా ఉన్న వారిని ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటున్నారు. జిల్లాలో చెలరేగుతున్న మాఫియాను వారికి అండగా ఉన్న రాజకీయ నాయకులు, అధికారుల ఆగడాలను అడ్డుకోవాలంటే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తే తప్ప ప్రయోజనం ఉండదని చెబుతున్నారు. మద్యం, ఇసుకపై దాడులు చేయించిన ప్రభుత్వం మద్యం ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని, ఇసుకను అక్రమంగా తరలిస్తే కేసులు నమోదు చేయాలని ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు బుట్టదాఖలవుతున్నాయి. ప్రజల కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించనంత కాలం సామాన్యుడికి మేలు జరిగే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు. అక్రమార్కులను కట్టడి చేయనంత కాలం సామాన్యుడికి కష్టాలు తప్పవని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.