Showing posts with label మోహన్ బాబు. Show all posts
Showing posts with label మోహన్ బాబు. Show all posts

Thursday, 29 December 2011

విష్ణు ఈ సారి తప్పకుండా కొడతాడంటున్న...మోహన్ బాబు

తన కుమారుడు విష్ణు ఈ సారి తప్పకుండా హిట్ కొడతాడంటున్నారు సినీయర్ నటుడు మోహన్ బాబు. విష్ణ, హన్సిక జంటగా జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ సమర్పణలో 24ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఓ వినోద భరితమైన చిత్రాన్ని నిర్మించబోతోంది. జనవరి 5న ఈ చిత్రం షూటింగ్ ప్రారంభ కానున్న నేపథ్యంలో మోహన్ బాబు మీడియాతో మాట్లాడుతూ విష్ణు కెరీర్లోనే అద్భుతమైన హిట్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం, చక్రి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని నాలుగు పాటలు ఇప్పటికే రికార్డు చేయడం పూర్తయిందన్నారు. 2012లో ఈ సినిమా తమ బేనర్ లో మంచి విజయాన్ని సాధిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. లక్ష్మి ప్రసన్న నిర్మాతగా రూపొందుతున్న ఊ కొడతారా ఉలిక్కి పడతారా చిత్రం కూడా మనోజ్ కెరీర్ లో మంచి హిట్ గా నిలుస్తుందని, బయటి బ్యానర్లో మనోజ్ నటిస్తున్న మిస్టర్ నోకియా చిత్రం కొత్త సంవత్సరంలో ఘన విజంయ సాధిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

Wednesday, 28 December 2011

జెకె భారవి దర్శకత్వంలో మోహన్ బాబు,నాగార్జున

ప్రముఖ రచయిత జె కె భారవి దర్శకుడుగా మారి చేస్తున్న చిత్రం ఆది శంకరా చార్య. ఈ చిత్రంలో ఆల్రెడీ నాగార్జున గెస్ట్ గా కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. ఇప్పుడు మోహన్ బాబు కూడా ఓ కీలకమైన పాత్రలో కి ఈ సినిమాలోకి వచ్చి చేరిందని తెలుస్తోంది. మోహన్ బాబు భారవి చెప్పిన కథ విని, ఇంత వరకు చిత్రించిన టోటల్ రషెస్ చూసి, అద్భుతంగా ఉందని అభినందిస్తూ ఆది శంకరలో నటించడానికి నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పుతున్నారు. గతంలో తాను రాసిన అన్నమయ్యలో మోహన్ బాబు ఓ కీలకమైన పాత్రను చేసి చిత్రానికి వెన్నుముకలా నిలిచారు. ఇక నాగార్జున ఈ చిత్రంలో చేయటంపై భారవి మాట్లాడుతూ..‘నా అభిమాన హీరో నాగార్జునను ఈ పాత్రలో చూడాలని 3 ఏళ్లుగా కలలుకన్నాను. ఆ కలను అవలీలగా ఒక్క స్ట్రోక్ తో నాగ్ నిజం చేశారు. త్వరలో అన్నమయ్య, శ్రీరామదాసులను మించిన సబ్జెక్టు ఇస్తాను’ అంటూ భారవి ఉద్వేగంతో చెప్పారు.ఈ విషయమై నాగార్జున మాట్లాడుతూ...హిందూ ధర్మాన్ని నిలబెట్టిన ఆది శంకరుడి దివ్య చరిత్రలో ఆ మహనీయుడి జీవితాన్ని మలుపు తిప్పిన అత్యంత కీలకమైన ఒక మాస్ పాత్రలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉందని, భారతీయుడిగా అది నాబాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు. ఇందులో హీరో కౌషిక్, రియల్ స్టార్ శ్రీహరి, డైలాగ్ కింగ్ సాయికుమార్, సుమన్, జయప్రద, రోషిణి, రోజా, తులసి, ఆనంద్, నాగబాబు, అశోక్ కుమార్, శివ పార్వతి, సంగీతలతో పాటు మరికొందరు నటిస్తున్నారు. గ్లోబల్ పీస్ క్రియేటర్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆది శంకరాచార్య, వేదవ్యాస్ పాటలు అందించగా..నాగ్ శ్రీవత్స సంగీతం సమకూర్చుతున్నారు.