Sunday, 6 November 2011

డిసెంబర్‌లోగా 5,292 మందికి ఉపాధి కల్పించేందుకు ప్రణాళిక సిద్ధం


 రాజీవ్ యువ కిరణాలు ద్వారా ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరులోగా
డిసెంబర్‌లోగా 5,292 మందికి ఉపాధి కల్పిస్తామని జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజ్
ముఖ్యమంత్రికి తెలిపారు. ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డి కోరారు. శనివారం హైదరాబాదు
నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్
మాట్లాడుతూ జిల్లాకు రాజీవ్ యువకిరణాల కింద 12,765 మందికి ఉపాధి కల్పించేందుకు ఈ
ఏడాది లక్ష్యంగా కేటాయించారని అందులో డిసెంబర్‌లోగా 5,292 మందికి ఉపాధి కల్పించేందుకు
ప్రణాళిక సిద్ధం చేశామని, ఇప్పటికే 2,749 మందికి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించామని చెప్పారు.
ఇంకా 2,543 మందికి శిక్షణ కల్పిస్తున్నామని తెలిపారు. ప్రతి నెల గ్రామీణ ప్రాంతాల్లో 10, 20,
30వ తేదీల్లో యువతను సమావేశపర్చి అవగాహన కల్పిస్తున్నామన్నారు. జిల్లాలో గల 97
మంది పారిశ్రామిక వేత్తలతో సమావేశం ఏర్పాటు చేసి వారికి కావాల్సిన రంగాల్లో యువతకు
శిక్షణ అందిస్తున్నామన్నారు. ఇప్పటికే 27 మంది పారిశ్రామిక వేత్తలు 2000 మందికి ఉపాధి
కల్పించగలమని తెలిపినట్లు వివరించారు. అంతకు ముందు ముఖ్యమంత్రి 1 లక్ష మంది
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు జిల్లా కలెక్టర్లు చరుగ్గా పనిచేయాలని ఆదేశించారు.
రాజీవ్ యువకిరణాలు ద్వారా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు ఎక్కువ సంఖ్యలో ఎస్టీ,
ఎస్సీలకు అవకాశాలు కల్పించాలన్నారు. శిక్షణ ఇచ్చేటప్పుడే శిక్షణ పూర్తి అయ్యాక ఎక్కడ
అవకాశం ఉంటుంది, జీతం వివరాలను ముందుగానే స్పష్టంగా తెలపాలన్నారు

అరటి రైతులు తీవ్ర ఆందోళన

  జిల్లాలో ఒక్కసారిగా అరటి పండు ధరలు పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మొన్నటి వరకు కిలో రూ. 10 పలుకగా నేడు కిలో రూ. 3 పలుకుతోంది. దీంతో అరటి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో రైల్వేకోడూరు, రాజంపేట, పులివెందుల నియోజకవర్గాలలో దాదాపు 50 వేల ఎకరాలలో అరటి సాగు చేశారు. ప్రస్తుత సీజన్‌లో రోజు వంద లారీలు అరటి కాయలు ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. ప్రస్తుత సీజన్‌లో కిలో ధర రూ. 10 నుంచి 11 వరకు విక్రయించాల్సి ఉండగా ధరలు పడిపోవడంతో రైతులు కిలో రూ. 3 నుండి 3-50లకే విక్రయించుకోవలసిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అరటి సాగుపై పెట్టిన పెట్టుబడి కూడా రైతుకు దక్కే అవకాశాలు కనిపించడం లేదు. ఎకరాకు రూ. 70 వేలు ఖర్చు అవుతుంది. వివిధ రకాలకు చెందిన అరటి పిలకలను తీసుకొచ్చి రైతులు పంటను సాగు చేశారు. 11 నెలలకే పంట దిగుబడి వస్తుంది.   
                                         

 ఎకరాకు 12 వందల చెట్లు రైతులు వేస్తారు. అందులో దాదాపు 300 చెట్లు తెగుళ్లు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా దెబ్బ తింటాయి. ఇక మిగిలిన 900 చెట్లను ఆధారం చేసుకొని రైతులు ఆదాయం తీసుకోవాలి. బాగా పండిన తోటలో ఒక్కొక్క గెలకు 25 నుంచి 30 కిలోల కాయలు వస్తాయి. కిలో రూ. 9 నుంచి 10 వరకు ధర పలుకుతుంది. అయితే కాయలు బాగా పెద్ద సైజ్‌లో ఉన్న ధర మాత్రం పూర్తిగా పడి పోయింది. దళారులకు రైతులు ఒక్కొక్క గెలకు కమిషన్ కూడా తీస్తుంటారు. అయితే రైతులు అందించిన సమాచారం మేరకు నెల కిందట 160 గెలలు కొడితే కేవలం రూ. 9 వేలు మాత్రమే చేతికి అందాయి. ధర బాగుండింటే చేతికి రూ. 25 వేల నుంచి 30 వేల వరకు అందేది. ధరలు పడిపోవడం వల్ల కేవలం రూ. 9 వేలు వచ్చిందని రైతులు వాపోతున్నారు. ఎకరా పంటకు రూ. 70 వేలు పెట్టుబడి పెట్టి 11 నెలల పాటు అరటి తోటలను కంటికి రెప్పలగా కాపాడుకున్న ఫలితం దక్కలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు

త్రిపుల్ ఐటిల్లో రిలే దీక్షలను ప్రారంభించారు

రాష్ట్ర ప్రభుత్వం త్రిపుల్ ఐటిల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది సమస్యల పట్ల స్పందించి పరిష్కారం చేయకపోవడం దర్మార్గమని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ. రాంమోహన్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. స్థానిక కలెక్టరేట్ ఎదుట ఆర్‌జెయు - ఐఐఐటి ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర పిలుపుమేరకు చేపట్టిన రిలే దీక్షలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రాంమోహన్ మాట్లాడుతూ ఇడుపులపాయ త్రిపుల్ ఐటిలో 300 మంది దాకా బోధన, బోధనేతర సిబ్బంది గత 3 సంవత్సరాలుగా పని చేస్తున్నారని ఆయన తెలియజేశారు. వీరిలో మెంటర్స్, హెచ్‌ఆర్‌టిలు, ఇతర సిబ్బంది వివిధ రకాల పనులు నిర్వహించుచున్నారని ఆయన తెలిపారు. ఇతర సిబ్బందికి జివో నెం.3 ప్రకారం వేతనాలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సిలర్‌కు, డైరెక్టర్‌గా అనేక సార్లు విజ్ఞప్తి చేసినా స్పందించి సమస్యను పరిష్కారం చేయలేదన్నారు. దీనికి నిరసనగా నవంబర్ 9 నుండి ట్రిపుల్ ఐటి సిబ్బంది సమ్మె చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి ఎన్. శివరాం, జిల్లా కమిటీ సభ్యులు కామనూరు శ్రీనివాసులరెడ్డి, ఐఐటి ఎంప్లాయిస్ అసోసియేషన్ నాయకులు మల్లికార్జున, సాగర్ తదితరులు పాల్గొన్నారు

రామలింగరాజును దర్శకుడు రాంగోపాల్‌వర్మ కలిశారు


ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌వర్మ మరో సంచలనం రేపారు. సత్యం కుంభకోణంలో బెయిల్‌పై విడుదలైన రామలింగరాజును ఆయన కలిశారు. రెండున్నరేళ్ల జైలు జీవితం అనంతరం రామలింగరాజు శనివారం తొలి సారిగా ఇంటికొచ్చారు. అక్కడే ఆయనతో వర్మ అర్ధగంటకుపైగా భేటీ అయ్యారు. ఈ విషయాన్ని వర్మ సమీప బంధువొకరు «ద్రువీకరించారు. అయితే ఈ భేటీ ఎందుకన్నదీ తెలియరాలేదు. వర్మ ఏదైనా సినిమాకు ప్రణాళిక రూపొందిస్తున్నారా? ఇందులో భాగంగానే రామలింగరాజును కలిశారా? అన్న ఊహాగానాలు జోరందుకున్నాయి
                                         . 
గతంలో పరిటాల సునీతను, సూరిని కలిసిన అనంతరమే వర్మ.. పరిటాల రవిపై సినిమా తీసే విషయాన్ని వెల్లడించారు. అనంతరం ఫ్యాక్షన్ రాజకీయాల నేపథ్యంతో ఆయన రూపొందించిన 'రక్త చరిత్ర'పై దుమారం రేగిన సంగతి తెలిసిందే. అలాగే విజయవాడలో రెండు వర్గాల ఆధిపత్య రాజకీయాలపై చిత్ర నిర్మాణం చేపట్టి మరో వివాదానికి తెరతీశారు. 'బెజవాడ రౌడీలు' అన్న టైటిల్‌పై తీవ్ర విమర్శలు రేగడంతో దానిని 'బెజవాడ'గా మార్చారు. ఈ సినిమా కూడా విడుదల అనంతరం వివాదాలు సృష్టించొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా సత్యం రామలింగరాజుతో భేటీ జరపడం వెనుకా.. ఏదైనా సినిమా తీసే యోచన ఉండొచ్చన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి

Saturday, 5 November 2011

క్రికెట్ కి దేవుడయ్యాడు సచిన్ టెండూల్కర్

సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్లో అత్యున్నత శిఖరాలకు చేరుకున్న వ్యక్తి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే వ్యక్తిత్వం ఆయన సొంతం. అందుకే కాబొలు క్రికెట్ కి దేవుడయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్లో 20 సంవత్సరాలు కెరియర్‌ని ముగిసినప్పటికీ సీనియర్లు పాఠాలు తనని ఎంతగానో ప్రోత్సహించాయని ఇటీవల 2000 సంవత్సరంలో తాను ఆడిన సెమీఫైనల్ మ్యాచ్ అలా ఒకసారి గుర్తు చేసుకున్నాడు. సచిన్ టెండూల్కర్ ఇప్పటి వరకు తన క్రికెట్ జీవితంలో మొత్తం 33 రంజీ మ్యాచ్‌లలో పాల్గోనడం జరిగింది.

                                  
ఈ సందర్బంలో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ భారత్‌లో ఏ క్రికెటర్‌కైనా రంజీ ట్రోఫీ అతి ముఖ్యమైన టోర్నీ అని అన్నాడు. 2000 సంవత్సరంలో తాను ఆడిన సెమీఫైనల్ మ్యాచ్ గురించి చెబుతూ, ‘484 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మేం విజయానికి దగ్గరగా వచ్చాం. ఇంకా 42 పరుగులు చేయాలి. చేతిలో రెండు వికెట్లు మాత్ర మే ఉన్నాయి. ఆ 42 పరుగుల్నీ నేనే చేశాను. పది, పదకొండో స్థానాల్లో వచ్చిన ఆటగాళ్లు ఖాతానే తెరవలేదు. విచిత్రమేమంటే వీరిద్దరు ఒక్క పరుగు కూడా చేయలేదని నాకు ఆట అయిపోయేంత వరకు తెలియదు. రంజీ మ్యాచ్‌లలో ఇది నాకు ఇష్టమైన సంఘటన’ అని అన్నారు. ఈ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ డబుల్ సెంచరీ (234 బంతుల్లో 233, ఆరు సిక్స్‌లు, 21 ఫోర్లు) సాధించాడు.
ఇప్పుడు ఇక్కడ నేను రంజీ మ్యాచ్ ల గురించి ప్రస్తావించడానికి కారణం.. రంజీల్లో ఆడటం వల్ల సీనియర్ ఆటగాళ్లతో సాన్నిహిత్యం పెరుగుతుందని... తద్వారా వారి అనుభవాలు ఎంతో ఉపయోగపడతాయని సచిన్ తెలిపారు. ‘నేను రంజీలు ఆడే రోజుల్లో ఏడెనిమింది టెస్టు ఆటగాళ్లు మాజట్టులో ఉండేవారు. వెంగ్‌సర్కార్, రవిశాస్త్రి, మంజ్రేకర్, చంద్రకాంత్ పండిట్... వీరందరితో ఆడే అవకాశం నాకు లభించింది. అప్పటికి నా వయసు 15 ఏళ్లే’ అని సచిన్ తన అనుభవాలను నెమర వేసుకున్నాడు

కడప జిల్లా ఒంటెల వ్యాపారం జోరుగా సాగుతుంది

                                         
ముస్లీంలు పవిత్రంగా నిర్వహించుకునే బక్రీద్‌ పండుగ దగ్గర పడటంతో ఏర్పాట్లను జోరుగా చేస్తున్నారు. ఈ పర్వదినం సందర్భంగా రాజస్థానం నుంచి ఒంటెలను ప్రత్యేకంగా తెప్పించారు. వివిధప్రాంతాలనుంచి తెప్పించిన వందలాది ఒంటెలు కడప జిల్లా రాయచోటికి చేరుకున్నాయి. ముస్లీంలు జరుపుకునే బక్రీద్ పర్వదినం సందర్భంగా రాజస్థాన్ నుంచి ఒంటెలను కొనుగోలు చేస్తున్నారు. కడప జిల్లా రాయచోటిలో పాతికేళ్లనుంచి ఒంటెల వ్యాపారం జోరుగా సాగుతుంది. బక్రీద్ పండుగ నెలముందునుంచే ఈ వ్యాపారం జోరందుకుంటోంది. ఇందుకోసం రాజస్థాన్‌నుంచి సుమారు 6వందల ఒంటెలను ఇక్కడికి తీసుకొచ్చారు. ఈ ఒంటెలను కొనేందుకుమన రాష్ట్రంవాల్లేకాకుండా తమిళనాడు,కేరళనుంచి వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తున్నారు

రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్‌లో ఆందోళన

రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్‌లో మెయింటెనెన్స్ ఉద్యోగాల భర్తీలో సిఇ కుమార్‌బాబు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగాల భర్తీకి జెన్‌కో నుంచి ఆదేశాలు వచ్చినా జాబితా ప్రకటించడం లేదన్నారు. ఈ మేరకు వారు సిఈ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఉద్యోగుల జాబితాను తనవద్దే ఉంచుకుని తనకు అనుకూలురైన వారికి మాత్రమే నియమిస్తున్నారని వారు ఆరోపించారు