Showing posts with label చిత్తూరు. Show all posts
Showing posts with label చిత్తూరు. Show all posts

Saturday, 3 December 2011

చిత్తూరులో సీపీఎం జిల్లా మహాసభలు



సీపీఎం జిల్లా పదవ మహాసభలు ఆది, సోమవారాల్లో చిత్తూరులో నిర్వహించనున్నారు.ఈ మహాసభల్లో జిల్లాకు సంబంధించి 22 అంశాలపై తీర్మానాలు ఆమోదించనున్నామని తెలిపారు. తొలి రోజు మధ్యాహ్నం 3 గంటలకు రైల్వేస్టేషన్ నుంచి హైరోడ్డు, గాంధీబొమ్మ, ఎంఎస్ ఆర్ సర్కిల్, దర్గా చౌక్‌ల మీదుగా కణ్ణన్ కళాశాల వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. ర్యాలీ అనంతరం కళాశాల మైదానంలో బహిరంగ సభలో రాష్ట్ర కార్యదర్శి రాఘవులు ప్రసంగిస్తారన్నా రు. రెండవ రోజుప్రతినిధుల సమావేశంలో పార్టీ నిర్ణయాలను, తీర్మానాలను ఆమోదిస్తామని తెలిపారు. జిల్లాకు చెందిన కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పటికీ అభివృద్ధి విషయంలో సొంత నియోజకవర్గం పీలేరుకు మాత్రమే పరిమితవుతున్నారని కుమార్‌రెడ్డి ధ్వజ మెత్తారు. పీలేరు పట్టణంలో తన సొంత స్థలంలో రూ. 60లక్షల పంచాయతీ నిధులతో క్యాంపు కార్యాలయాన్ని నిర్మించడాన్ని తీవ్రంగా విమర్శించారు. ప్రజల సొమ్ముతో భవనం నిర్మించిన స్థలాన్ని పంచాయతీకి అప్పగిస్తారా అని సీఎంను ప్రశ్నించారు. జిల్లాలో వ్యవసాయరంగానికి మేలు చేసే సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంలో రాష్ట్రప్రభుత్వం పూర్తి గా విఫలమైందన్నారు. హరికృష్ణ మాట్లాడుతూ టీటీడీ నిధులను జిల్లా అభివృద్ధికి వినియోగించాలని డిమాండ్ చేశారు. టీటీడీ ఉద్యోగాల్లో జిల్లావాసులకు కొంత వాటా, జిల్లాలోని జూనియర్, డిగ్రీ కళాశాలల నిర్వహణ, తాగునీరు, వైద్యానికి టీటీడీ నిధులు కేటాయించాలని తీర్మానాలు చేయనున్నామని చెప్పారు. జిల్లాలోని 5.25లక్షల సంఘటిత, అసంఘటిత రంగాల్లోని కార్మికులకు ఉద్యోగభద్రత కనీస వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేశారు.పార్టీ రాష్ట్ర కార్యదర్శి బీవీ.రాఘవులు, కార్యదర్శివర్గ సభ్యులు కృష్ణయ్య, సోమయ్య ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ప్రజాపోరాటాలు, భవిష్యత్ కార్యాచరణపై సమీక్షించనున్నట్టు పార్టీ జిల్లా కార్యదర్శి కె.కుమార్‌రెడ్డి, సీఐటీయూ కార్యదర్శి హరికృష్ణ, చిత్తూరు డివిజన్ కార్యదర్శి పి.చైతన్య వెల్లడించారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో వారు శుక్రవా రం విలేకరుల సమావేశంలో మాట్లాడా రు.

Wednesday, 9 November 2011

వడ్డీ లేకుండా అప్పిచ్చువాడు.. ఆ మహానుభావుడు

శ్యామరాజు అంటే పుంగనూరు, చౌడేపల్లె మండలాల్లో తెలియని వారంటూ లేరు. తొమ్మిది పదుల వయసులో కూడా పాదరక్షలు ధరించకుండా, ఎలాంటి ఆర్భాటాలు లేకుండా, నిరాడంబరంగా కనిపించే ఆయనో కోటీశ్వరుడంటే నమ్మశక్యం కాదు! చిన్నతనం నుంచీ వ్యవసాయంతో కోట్లాది రూపాయల ఆస్తులను కూడబెట్టినా ప్రజల కోసం కోట్లాది రూపాయల ఆస్తులను విరాళాలుగా ఇచ్చిన దాతృత్వం ఆయనది.
చౌడేపల్లె మండలం పందిళ్లపల్లె పంచాయతీ బాలసముద్రం గ్రామంలో పెరుమాళ్లరాజు, కుప్పమ్మ అనే రైతు కుటుంబంలో 1912లో శ్యామరాజు ఐదవ సంతానంగా జన్మించారు. పెరుమాళ్లరాజు కుటుంబం తమిళనాడు నుంచి చౌడేపల్లె మండలానికి వచ్చి స్థిరపడింది. శ్యామరాజు ఆయన భార్య లక్ష్మమ్మకు ఇద్దరు సంతానం. చిన్నతనం నుంచీ వ్యవసాయం అంటే శ్యామరాజుకు ఎంతోఇష్టం. ఆయన తల్లిదండ్రులు సంపాదించిన 62 ఎకరాల్లో మామిడి, చింత తోటలను పెంచారు. అలాగే వేరుశెనగ, చెరుకు సాగు చేసేవారు. కాలక్రమంలో వ్యవసాయ కష్టంతో కోట్లాది రూపాయల ఆస్తులను సంపాదించారు. వ్యవసాయ పనుల కోసం రైతులకు ఏ రూపంలో సాయం కావాలన్నా చేస్తారనే పేరుతెచ్చుకున్నారు. వడ్డీ లేని రుణాలు ఇవ్వడమే కాదు; బ్యాంకుల్లో రైతుల రుణాలకు హామీదారుడిగా ఉంటారనే పేరూ ఉంది. రైతులు ఫలసాయం చేతికొచ్చాక సొమ్ము రూపేణాగానీ లేదా పంట రూపంలోగానీ ఆయనకు అప్పు చెల్లిస్తూంటారు. ఈ గుణమే ఆయన్ను రైతులకు ఆప్తుడిని చేసింది. నిరాడంబరి, నిగర్విగా పేరున్న శ్యామరాజు పందిళ్లపల్లె పంచాయతీకి 1960లో తొలిసారిగా ఏకగ్రీవ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. నాటి నుంచి సర్పంచ్ పదవిలో కొనసాగుతున్నారు. 2000 సంవత్సరంలో ఎస్సీలకు రిజర్వు చేశారు. తిరిగి 2005లో సర్పంచ్‌గా ఆయన ఎన్నికయ్యారు. పంచాయతీని ఎంతగానో అభివృద్ధి చేశారు. పందిళ్లపల్లె పంచాయతీకి నాలుగుసార్లు జిల్లాలో ఉత్తమ పంచాయతీ అవార్డు లభించింది. బెంగళూరులో శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇన్‌స్టిట్యూట్స్ ఆధ్వర్యంలో నిర్మించిన ఇంజినీరింగ్, మెడికల్ ఇతర కళాశాలల్లో తన కుమారులను భాగస్వామ్యులుగా చేసి, ప్రతి ఏటా నలుగురు ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నారు. శ్యామరాజు ప్రస్తుతం పుంగనూరులోని ఎల్‌ఐసీ కాలనీలో నివాసముంటూ వ్యాపార కార్యకలాపాలు చూసుకుంటున్నారు. ఈయన భార్య లక్ష్మమ్మ మాత్రం బాలసముద్రం గ్రామంలో ఉంటూ వ్యవసాయ పనులు పర్యవేక్షిస్తుంటారు. ఈయన కుమారులు, కోడళ్లు, అందరూ ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. వీరు కూడా తీరిక వేళల్లో వ్యవసాయ పనులు చేస్తుంటారు.

ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు
వ్యవసాయంతో కష్టపడ్డాను. పైవాడూ దయ చూపాడు. అందుకే ఈ స్థితికొచ్చాను. మట్టిని నమ్ముకున్నోళ్లు పచ్చగా ఉంటేనే అందరూ బాగా ఉంటారనే నమ్మేవాళ్లలో నేనూ ఒకణ్ని. అందుకే రైతులకు చేతనైనంత సాయం చే స్తున్నా. ఇరవై ఏళ్ల క్రితం ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేస్తున్నా. పుంగనూరు పట్టణంలో కోర్టు భవనాల నిర్మాణం కోసం సుమారు 2 కోట్ల రూపాయల విలువ చేసే ఎకరా పొలం, ఆర్టీసీ బస్టాండు నిర్మాణానికి సుమారు 3 కోట్ల రూపాయల విలువ చేసే ఎకరా స్థలాన్ని విరాళంగా ఇచ్చాను. చౌడేపల్లె మండలంలో ఎన్నో కుటుంబాలకు సాయం చేశాను. కుడిచేత్తో సాయం చేస్తే ఎడమ చేతికి తెలియకూడదని సామెత ఉంది. అవన్నీ ఎందుకు చెప్పడం? పైవాడు పిలిస్తే ఏమీ మూట కట్టుకుని పోలేం కద నాయనా!? ఇతరులకు సాయం చేస్తే ఆ పైవాడే చల్లగా చూస్తాడు. - శ్యామరాజు

Sunday, 6 November 2011

డిసెంబర్‌లోగా 5,292 మందికి ఉపాధి కల్పించేందుకు ప్రణాళిక సిద్ధం


 రాజీవ్ యువ కిరణాలు ద్వారా ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరులోగా
డిసెంబర్‌లోగా 5,292 మందికి ఉపాధి కల్పిస్తామని జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజ్
ముఖ్యమంత్రికి తెలిపారు. ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డి కోరారు. శనివారం హైదరాబాదు
నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్
మాట్లాడుతూ జిల్లాకు రాజీవ్ యువకిరణాల కింద 12,765 మందికి ఉపాధి కల్పించేందుకు ఈ
ఏడాది లక్ష్యంగా కేటాయించారని అందులో డిసెంబర్‌లోగా 5,292 మందికి ఉపాధి కల్పించేందుకు
ప్రణాళిక సిద్ధం చేశామని, ఇప్పటికే 2,749 మందికి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించామని చెప్పారు.
ఇంకా 2,543 మందికి శిక్షణ కల్పిస్తున్నామని తెలిపారు. ప్రతి నెల గ్రామీణ ప్రాంతాల్లో 10, 20,
30వ తేదీల్లో యువతను సమావేశపర్చి అవగాహన కల్పిస్తున్నామన్నారు. జిల్లాలో గల 97
మంది పారిశ్రామిక వేత్తలతో సమావేశం ఏర్పాటు చేసి వారికి కావాల్సిన రంగాల్లో యువతకు
శిక్షణ అందిస్తున్నామన్నారు. ఇప్పటికే 27 మంది పారిశ్రామిక వేత్తలు 2000 మందికి ఉపాధి
కల్పించగలమని తెలిపినట్లు వివరించారు. అంతకు ముందు ముఖ్యమంత్రి 1 లక్ష మంది
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు జిల్లా కలెక్టర్లు చరుగ్గా పనిచేయాలని ఆదేశించారు.
రాజీవ్ యువకిరణాలు ద్వారా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు ఎక్కువ సంఖ్యలో ఎస్టీ,
ఎస్సీలకు అవకాశాలు కల్పించాలన్నారు. శిక్షణ ఇచ్చేటప్పుడే శిక్షణ పూర్తి అయ్యాక ఎక్కడ
అవకాశం ఉంటుంది, జీతం వివరాలను ముందుగానే స్పష్టంగా తెలపాలన్నారు

Friday, 4 November 2011

ఈరోజు 'మీసేవ' కార్యక్రమాన్నిప్రారంభించారు ముఖ్యమంత్రి

మహతి ఆడిటోరియంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు 'మీసేవ' కార్యక్రమాన్నిప్రారంభించారు. ప్రభుత్వంలోని వివిధ శాఖలలో అవినీతిని అరికట్టేందుకు ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు ఇక నుండి ప్రజలు ధృవీకరణ పత్రాల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ ఉదయం చిత్తూరు జిల్లా తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో మీ కోసంను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మీ కోసం ద్వారా ప్రజలు ఇక నుండి సులభంగా పది రకాల ధృవీకరణ పత్రాలు తీసుకోవచ్చునని చెప్పారు. ఇంతకుముందు మాదిరి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదన్నారు. ప్రజల కోసం చట్టాన్ని మార్చి దీనిని తీసుకు వచ్చామన్నారు. ప్రస్తుతం కృష్ణా, చిత్తూరు జిల్లాలో దీనిని ప్రవేశ పెడుతున్నామని, వచ్చే సంవత్సరం మార్చి 31వ తేదీలోగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రవేశ పెడతామని చెప్పారు
                                       .

ఈ సందర్భంగా మాట్లాడిన తిరుపతి కాంగ్రెసు శాసనసభ్యుడు చిరంజీవి లోగో విషయంలో ఓ సలహా ఇచ్చారు. లోగో చాలా అద్భుతంగా కనిపిస్తోందని అయితే లోగో కింద ఉన్న త్వరగా తేలిగ్గా అనే పదాల కంటే సులభంగా వేగంగా అని ఉంచితే బాగుండేదని సూచించారు. సామాన్యులకు సులభంగా అర్థమయ్యేలా ఉంటుందనే తాను ఈ సలహా ఇస్తున్నానని ఈ విషయంలో ఆలోచించాలని ఆయన కోరారు. అన్నీ ప్రింట్ అయిపోయినందున ఏమైనా మార్పులు చేర్పులు చేసే అవకాశాలను పరిశీలించాలన్నారు

Sunday, 30 October 2011

చిత్తూరు జిల్లాలో 13 మండలాలనే కరువు మండలాలుగా ప్రకటించింది

ఖరీఫ్ సీజన్‌లో తగినంత వర్షాలు లేక జిల్లాలో అత్యధిక మండలాలు కరవు కోరల్లో చిక్కుకుని సతమతమవుతుండగా, ప్రభుత్వం మాత్రం 13 మండలాలనే కరువు మండలాలుగా ప్రకటించింది. ఖరీఫ్ సీజన్‌లో మైనస్ 17 శాతం నుంచి- మైనస్ 43 శాతం తక్కువ వర్షపాతం నమోదైన మండలాలను మాత్రమే ప్రభుత్వం కరువు ప్రాంతాలుగా గుర్తించింది. జిల్లా యంత్రాంగం 14 మండలాలలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని ప్రభుత్వాని కి నివేదిక పంపించింది.

చౌడేపల్లె, వాల్మీకిపురం, కేవీపల్లె, గుడుపల్లె, పుంగనూరు, శాంతిపురం, బైరెడ్డిపల్లె, గుర్రంకొండ, సోమల, కలకడ, కురబలకోట, తిరుపతి రూరల్, ఎర్రావారి పాళెం, రామసముద్రం మండలాలను అధికారులు ప్రతిపాదించగా, శనివారం జరిగిన మంత్రి మండలి సమావేశంలో ప్రభుత్వం రామసముద్రం మండలాన్ని మాత్రం మినహాయించి మిగిలిన 13 మండలా లను కరువు ప్రాంతంగా ప్రకటించింది.

వాస్తవానికి వర్షపాతం, పంటల విస్తీర్ణం, తెగుళ్ళు, పంటల దిగుబడి తదితర అంశాల ప్రాతిపదికన చూస్తే జిల్లాలో 49 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమాచారాన్ని కూడా జిల్లా యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. పొరుగునే వున్న అనంతపురం జిల్లాలో అన్ని మండలాలనూ కరువు మండలాలుగా ప్రకటించగా సాక్షాత్తూ ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో ఇంచుమించు 50 మండలాల్లో కరువు పరిస్థితులు తలెత్తినప్పటికీ కేవలం వర్షాభావాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుని 13 మండలాలకే ప్రకటనను పరిమితం చేశారు

Friday, 28 October 2011

టీడీపీ-కాంగ్రెస్‌ వర్గాల మధ్య నెలకొన్న పాత కక్షలుభగ్గుమన్నాయి

AAటీడీపీ-కాంగ్రెస్‌ వర్గాల మధ్య నెలకొన్న పాత కక్షలుభగ్గుమన్నాయి.
దీంతో..ఇరువర్గాలు దాడికి దిగాయి. ఈ దాడిలో 10మంది గాయపడ్డారు.చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామపంచాయితీలోని వడ్డె పల్లిలో ఈ ఘటన జరిగింది.గాయపడిన వారిలో మహిళలు కూడా ఉన్నారు.క్షతగాత్రులను పోలీసులు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యచికిత్సలు అందిస్తున్నారు

Friday, 21 October 2011

వనిత కార్డులు తీసుకున్న గ్రామాలకు ప్రత్యేక సర్వీసులు

వనిత కార్డుల అమ్మకాల్లో చిత్తూరు జిల్లా మొదటి స్థానంలో ఉందని ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్(నెల్లూరు) సూర్యచంద్రరావు తెలిపారు. గురువారం సాయంత్రం స్థానిక టు డిపో మేనేజర్ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ నెల్లూరు, ఒంగోలు, తిరుపతి రీజియన్ల పరిధిలో ఇప్పటి వరకు లక్షా 34 వేల వనిత కార్డులు అమ్మినట్లు తెలిపారు. 17వేల వనిత కార్డులు తీసుకున్న గ్రామాలకు ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు చెప్పారు.

నెల్లూరు, తిరుపతి, ఒంగోలు రీజియన్ల పరిధిలో త్వరలో 40 ఇంద్ర బస్సులు నడుపుతామన్నారు. శబరిమలైలోని పంబా వద్ద ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తిరుపతి రీజియన్ పరిధిలో శబరిమలకు వంద సర్వీసులు నడపుతున్నట్లు తెలిపారు. బస్సుల్లో ఇద్దరు గురుస్వాములు, ఇద్దరు బాలస్వాములు, ఒక వంటమనిషికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. శబరిమలకు బస్సులు బుక్ చేసిన వారికి ప్రోత్సాహకాలు అందజేయనున్నట్లు తెలిపారు. మూడు బస్సులు బుక్ చే స్తే రూ.250, నాలుగు బస్సులు రూ.300, ఐదుపైన బస్సులు రూ.350 చొప్పున రోజుకు ఇవ్వనున్నట్లు తెలిపారు. త్వరలో తిరుపతి రీజియన్ పరిధిలో కండక్టర్లు, డ్రైవర్ల నియమాకం చేపట్టనున్నట్లు తెలిపారు. తిరుపతి సమీపంలోని మంగళం డిపోను త్వరలో ప్రారంభిస్తామన్నారు. బి.కొత్తకోట డిపోకు స్థలం ఇస్తే తిరిగి పునః ప్రారంభిస్తామన్నారు

Tuesday, 18 October 2011

ఈ నెల 21న తిరుపతి సీపీఐ 24గంటల నిరాహారదీక్ష

                                     
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా ఈ నెల 21న తిరుపతి, చిత్తూరుల్లో సీపీఐ ఆధ్వర్యంలో భారీ ఎత్తున 24గంటల నిరాహారదీక్ష జరుగుతుందని పార్టీ జిల్లా కార్యదర్శి పి.హరినాథ రెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్యుల సమా వేశం ఎస్.సయ్యద్ బాషా అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్భంగా హరినాథ రెడ్డి మాట్లాడుతూ,2 జీ కుంభకో ణాల్లో అవినీతికి పాల్పడిన యూపీఏ ప్రభుత్వ మంత్రులు ఊచలు లెక్కపెడుతున్నారని విమర్శించారు. అవినీతి సొమ్ముతో రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు.పేదలకు సెంటు భూమి ఇచ్చేందుకు నిబంధనలు చెప్పే ప్రభుత్వం జిందాల్ వంటి కంపె నీలకు వేలాది ఎకరాలు బంగారుపళ్ళెంలో పెట్టి ఇస్తున్నారని, వీరికి నిబంధనలు వర్తించవా? అని ప్రశ్నించారు.

2.50 లక్షల పోస్టులు భర్తీ చేయని ప్రభుత్వం లక్ష ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించడం ఉత్తుత్తి మాటలుగా వర్ణించారు. 21న తిరుపతిలో జరిగే 24గంటల నిరాహార దీక్షలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ, చిత్తూ రు పట్టణంలో జరిగే దీక్షలో ప్రముఖ నాయకులు పాల్గొంటారని చెప్పారు

జిల్లాలో 30 వర్క్‌సైట్ పాఠశాలలను ఏర్పాటు

జిల్లాలో 30 వర్క్‌సైట్ పాఠశాలలను ఏర్పాటు చేసేందుకు రాజీవ్ విద్యామిషన్(ఆర్వీఎం) అధికారులు సన్నాహా లు చేస్తున్నారు. ఎయిడ్ ఎట్ యాక్షన్ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి ఈ స్కూళ్లను ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ స్వచ్ఛంద సంస్థ ఇటీవల జిల్లాలో సర్వే నిర్వహించి 599 మంది పిల్లలు పలు చోట్ల పని చేస్తున్నట్లు గుర్తించింది. గ్రానైట్ పరిశ్రమల్లో, ఇటుకబట్టీల్లో, స్టోన్ క్రషింగ్ యూనిట్లలో ఒడిస్సా, కర్ణాటక, తమిళనాడు, బీహార్ తదితర ప్రాం తాల నుంచి వలస వచ్చిన వారి పిల్లలు కూడా పనిచేస్తున్నట్లు గుర్తించింది. పరిశ్రమల్లో సుమా రు 3,400 మంది పిల్లలు పనిచేస్తున్నట్లు స్వ చ్ఛంద సంస్థ అంచనా వేసినా, ఇప్పటి వరకు 599మంది పిల్లలను గుర్తించారు.

ఎక్కడెక్కడ ఎంతమంది...
మండలాల వారీగా కుప్పంలో 93 మంది పిల్లలు, ఆర్‌సీపురంలో 40మంది, తిరుపతి రూ రల్‌లో 65మంది, బీఎన్‌కండ్రిగలో 33మంది, వరదయ్యపాళెంలో 20మంది, వి.కోటలో వందమంది, తిరుచానూరులో 22 మంది, బంగారుపాళెంలో 20మంది, బెరైడ్డిపల్లెలో 20మంది, పీలేరులో 20 మంది పలు పరిశ్రమల్లో పనిచేస్తున్నట్లు గుర్తించారు. అలాగే పులిచెర్ల మండలంలో 20మంది, నిమ్మనపల్లెలో 20మంది, మదనపల్లెలో 41మంది, బీ.కొత్తకోటలో 22మంది, సీటీఎంలో 20మంది, కురబలకోటలో 20మంది, కలికిరి మండలంలో 20 మంది పిల్లలు పలు చోట్ల పనిచేస్తున్నట్లు ఇప్పటి వరకు గుర్తించారు. వీరిలో ప్రతి 20 మందికి ఒక పాఠశాలను ఏ ర్పాటు చేసి ఒక విద్యావాలంటీర్‌ను నియమిం చనున్నారు. మొత్తం తొమ్మిది నెలల పాటు పిల్లలకు వారి మాతృభాషలో విద్యను బోధించనున్నారు

Saturday, 15 October 2011

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది

                           
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు చిత్తూరు జిల్లా నేతలతో ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి సమీక్ష నిర్వహించారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరిలో 50 శాతం మంది ఓటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. రెండు నెలల్లోనే ఈ జిల్లాలో పార్టీకి విశేష స్పందన అభించింది. ఈ నియోజకర్గంలో 1,27,250 మంది ఓటర్లు ఈ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఆ పార్టీ నేత చెవిరెడ్డి భాస్కర రెడ్డి చంద్రగిరి నియోజకవర్గం వివరాలను జగన్మోహన రెడ్డికి అందజేశారు. 43 పంచాయతీల నుంచి నమోదైన సభ్యత్వం వివరాలను ఆయన తెలియజేశారు

Friday, 14 October 2011

పల్లె వెలుగు బస్సుల్లో టిమ్ మిషన్లతో టికెట్లు ఇస్తామని

                                   
జిల్లాలో అన్ని పల్లె వెలుగు బస్సుల్లో టిమ్ మిషన్లతో టికెట్లు ఇస్తామని ఆర్టీసీ జిల్లా రీజనల్ మేనేజర్ నాగశివుడు తెలిపారు. గురువారం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో పల్లెవెలుగు బస్సును ఆయన ప్రారంభించారు. అనంతరం టిమ్ యంత్రాన్ని కండక్టర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో మాత్రం ఈ పెలైట్ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రారంభించిందని తెలిపారు

Thursday, 13 October 2011

ఎస్వీయూనివర్సిటీలో సౌతిండియా రచయితల సమ్మేళనం

ఈనెల 15, 16 తేదీలలో ఈశాన్య, దక్షిణ భారతీయ రచయితల సమ్మేళనం తిరుపతిలోని ఎస్వీయూనివ ర్సిటీ సెనేట్ హాలులో జరగనుంది. సాహిత్య అకాడమీ, విశ్వవిద్యాలయ ఆంగ్ల శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశంలో దేశంలోని అనేక ప్రాంతాల నుంచి పలువురు రచయితలు, కవులు పాల్గొననున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు జరిగే ప్రారంభసమావేశానికి ప్రముఖ కథా రచయిత ఆచార్య కేతు విశ్వనాథ రెడ్డి, ప్రముఖ అస్సామీ రచయిత లక్ష్మీ నందన్ బోరా, సంస్కృత విద్యాపీఠం ఉపకులపతి హరేకృష్ణ శత్పథి, సాహిత్య అకాడమీ ఉపకార్యదర్శి కె. శ్రీనివాసరావు హాజరవుతారు. తొలిరోజు జరిగే కవితాపఠనంలో కొండేపూడి నిర్మల, కె.ఎస్ రమణ, కె.పి.మృత్యుంజయ్(కన్నడ),రోజ్ మేరీ(మలయాళం), త.ఇబోపిషక్ సింగ్(మణిపురి), రోజ్‌మేరీ జూచు(తెనిడి) పాల్గొంటారు.

అదే రోజు సాయంత్రం శ్రీనివాస ఆడిటోరియంలో అస్సామీ నృత్య ప్రదర్శన ఉంటుంది. ఆదివారం ఉదయం జరిగే కథాపఠనంలో ఆర్.ఎం. ఉమామహేశ్వర రావు, ఏ.ఎన్. జగన్నాథ శర్మ, చంద్రలత, జ్యోతిర్మయి ప్రధాని(రాజ్‌బోంత్షి), సుబ్రభారతి మణియన్(తమిళం) పాల్గొంటారు. ఆరోజు మధ్యాహ్నం జరిగే కవితాపఠనంలో ఎస్.మునిసుందరం, పెరుగు రామకృష్ణ, టెంసులా ఓ(ఇంగ్లీషు), అరబిందో ఉజిర్(బోడో), జయశ్రీ కంబార్(కన్నడ), హరిదాస్ బాలకృష్ణన్(మలయాళం), రఘు లైశాంతెమ్(మణిపురి),మార్గరెట్ పాచౌ(మిజో) పాల్గొంటారు. సాయంత్రం శ్రీనివాస ఆడిటోరియంలో మణిపురి మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శన, మృదంగ నృత్యం ఉంటుంది.