ధార్మిక సంస్థ టీటీడీకి గుత్తేదారులు శతవిధాలా శఠగోపం పెడుతున్నారు. కిలో
రూపాయి సర్కారీ బియ్యానికి పాలిష్చేసి టీటీడీకి అంటగడుతున్నారనే ఆరోపణలు
వెల్లువెత్తాయి. పౌరసరఫరాల బ్యాగుల్లోనే వచ్చిన వేలాది కిలోల బియ్యాన్ని
టీటీడీ మార్కెటింగ్ అధికారులు పక్కన పెట్టారు. వాటి నమూనాలు తీసి పరీక్షల
నిమిత్తం ల్యాబ్కు పంపించారు. టీటీడీకి బియ్యం సరఫరా టెండరుదారైన
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్కు చెందిన గంగాదేవి మోడ్రన్ రైస్మిల్
నిర్వాహకులు శనివారం రెండు లారీల్లో 50 కిలోల బరువున్న 2,220 బియ్యం
బ్యాగులు టీటీడీ మార్కెటింగ్ గోడౌన్కు పంపారు. మార్కెట్లో కిలో రూ.30లు
పలుకుతున్న సోనా మసూరి బియ్యాన్ని రూ.21.06 లకు సరఫరా చేస్తామని గుత్తేదారు
టెండర్ దక్కించుకున్నారు. నెలకు 50 లారీల బొప్పున 6 నెలలకు 300 లోడ్ల
బియ్యం వారు సరఫరా చేయాల్సి ఉంది. మూడు నెలలుగా 150 లారీల బియ్యాన్ని సరఫరా
చేశారు. కాగా అర్మూర్ రైస్ మిల్లు నుంచి వచ్చిన బియ్యం సంచులు
పౌరసరఫరాల శాఖ రేషన్షాపు డీలర్లకు సరఫరా చేసే బ్యాగులు కావడం, వాటిపై
అగ్మార్క్ ముద్ర లేకపోవడంతో టీటీడీ అధికారులకు అనుమానం వచ్చింది. అవి
కిలో రూపాయి సబ్సిడీ బియ్యమనే భావించి వాటిని పక్కన పెట్టారు. పరీక్షల
నిమిత్తం వాటిని టీటీడీ ల్యాబ్కు పంపినట్లు టీటీడీ మార్కెటింగ్ ఆఫీసర్
శ్రీహరి తెలిపారు.
Showing posts with label టీటీడీ. Show all posts
Showing posts with label టీటీడీ. Show all posts
Tuesday, 3 January 2012
Wednesday, 30 November 2011
రేపు ముంబయి నగరంలో టీటీడీ సమాచార కేంద్రం ప్రారంభం
ముంబయి నగరంలోని సైమాన్ ఏరియాలో గురువారం టీటీడీ సమాచార కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. శ్రీవారి భక్తులకు కోరిన సమాచారాన్ని అందించేందుకు అత్యాధునిక సమాచార వ్యవస్థ, మౌలిక సదుపాయాలతో ఈ సమాచార కేంద్రాన్ని నెలకొల్పారు. గురువారం కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి జయంత్ పాటిల్ చేతుల మీదుగా ఈ సమాచార కేంద్రం ప్రారంభమవుతుందని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. మహారాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి ఆర్వై.గైక్వాడ్, టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఈవో ఎల్వీ.సుబ్రమణ్యం, పాలక మండలి సభ్యులు, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొంటారని టీటీడీ పేర్కొంది
Subscribe to:
Posts (Atom)