Showing posts with label ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి. Show all posts
Showing posts with label ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి. Show all posts

Thursday, 26 January 2012

బాబు డెరైక్షన్‌లో సీబీఐ...భూమా శోభానాగిరెడ్డి

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు డెరైక్షన్‌లో సీబీఐ నడుస్తోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత భూమా శోభానాగిరెడ్డి ఆరోపించారు. ఏదో విధంగా ఎమ్మార్ కేసులో జగన్‌ను ఇరికించాలని చూస్తోందని ఆమె అన్నారు. ఎమ్మార్‌పై అప్పటి కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయాలనే వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేశారని.. ఆ సబ్ కమిటీని సీబీఐ విచారించిందా అని శోభానాగిరెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు, కోనేరు ప్రసాద్‌ల మధ్య ఉన్న సంబంధం రాష్ట్ర ప్రజలందరికి తెలుసున్నారు. జగన్‌కున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక రామోజీరావు నీచమైన కథనాలను రాస్తున్నారని ఆమె మండిపడ్డారు. విజయసాయిరెడ్డి కంటే ముందుగా సీబీఐ జేడీ లక్ష్మినారాయణకు నార్కో టెస్ట్‌లు నిర్వహించాలని శోభానాగిరెడ్డి డిమాండ్ చేశార.సిబిఐ దర్యాఫ్తు చూసి రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారని మరో నేత బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి అంతకుముందు వేరుగా అన్నారు. స్టైలిష్ హోం రంగారావును వదిలేసి సిబిఐ అమాయకుడైన సునీల్ రెడ్డిని అరెస్టు ఎందుకు చేసిందన్నారు. బాబు, కాంగ్రెసు ఫిక్సింగ్ చేసుకొని రైతులను అవమానిస్తున్నారని మండిపడ్డారు. బాబు తమ పార్టీని లక్ష్యంగా చేసుకున్నారన్నారు. రాష్ట్రపతి ప్రసంగం కంటే సునీల్ రెడ్డి అరెస్టే ప్రధానంగా ఎల్లో మీడియా వార్తలు ప్రచురించడమేమిటన్నారు

Wednesday, 18 January 2012

నా రాజీనామాను ఆమోదించండి...ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి

ఎమ్మెల్యే పదవికి తాను సమర్పించిన రాజీనామాను ఆమోదించాలని భూమా శోభా నాగిరెడ్డి స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. తన రాజీనామాను సాంకేతిక కోణంలో చూడకుండా విలువలకు కట్టుబడి ఆమోదించాలని ఆమె కోరారు. అసలు ప్రజారాజ్యం పార్టీయే మనుగడలో లేనపుడు విప్ ధిక్కారానికి సంబంధించి వారిచ్చిన అనర్హత నోటీసుకు సమాధానం చెప్పాల్సిన అవసరమే లేదని ఆమె ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆ పార్టీ అధ్యక్షుడు చిరంజీవి స్వయంగా కాంగ్రెస్‌లో చేరిపోయి అక్కడ సమన్వయ కమిటీ సభ్యుడుగా నియమితులయ్యారనీ అలాంటపుడు ప్రజారాజ్యం ఎక్కడుందని ఆమె ప్రశ్నించారు. ఇంకా తాను పీఆర్పీ అధ్యక్షుడుగా ఉన్నానని చిరంజీవి చెబితే తాను తప్పకుండా ఆయన వద్దకు వెళ్లి వివరణ ఇస్తానని ఆమె ఎద్దేవా చేశారు. తనపై ఉన్న కేసులను ఎత్తివేస్తే కాంగ్రెస్‌లో చేరడానికి వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించినపుడు శోభ తప్పు పట్టారు. తన అక్రమాస్తులు, అవినీతిపై విచారణ జరక్కుండా కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకున్న చంద్రబాబుకు మరొకరి అవినీతి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు చంద్రబాబు, కాంగ్రెస్‌తో కుమ్మక్కు అయ్యారనీ ఆయన అసెంబ్లీలో అవిశ్వాసతీర్మానం పెట్టింది కూడా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కానే కాదనీ కేవలం జగన్‌ను సమర్థించే ఎమ్మెల్యేలను ఇరకాటంలో పెట్టడానికేనని ఆమె అన్నారు. చంద్రబాబుకు రైతుల పట్ల ఏ మాత్రం ప్రేమ లేదననాడికి ఆయన తొమ్మిదేళ్ల పాలనలో చేసిన నిర్వాకమే నిదర్శనమని శోభ గుర్తు చేశారు. చంద్రబాబుకు, కాంగ్రెస్‌కు ధైర్యం ఉంటే తాజాగా అందరమూ కలిసి ఎన్నికలకు పోదాం సిద్ధం కావాలని ఆమె సవాలు విసిరారు. ఇప్పటికే రెండు సార్లు ప్రజల తిరస్కారానికి గురైన చంద్రబాబుకు మళ్లీ అదే అనుభవం ఎదురవుతుందని ఆమె జోస్యం చెప్పారు.

Monday, 12 December 2011

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధం...ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజల్లోకి ధైర్యంగా వెళ్లేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయేనని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి అన్నారు. ఆమె సోమవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కార్ ను మరో రెండేళ్లు అధికారంలో నిలబెట్టాలనే ఉద్దేశ్యంతోనే చంద్రబాబునాయుడు అవిశ్వాస తీర్మానంపై ఇతర ప్రతిపక్షాల మద్దతు కోరలేదన్నారు.రైతుల పేరు చెప్పి అవిశ్వాసం పెట్టిన చంద్రబాబు సమస్యల గురించి చర్చించకుండా వైఎస్ రాజశేఖరరెడ్డిని తిట్టడానికే అసెంబ్లీని వేదికగా చేసుకున్నారని శోభా నాగిరెడ్డి వ్యాఖ్యానించారు. వడ్డీలేని రుణాలు ఇస్తామంటూ ప్రజలను మోసం చేయకుండా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని శోభా నాగిరెడ్డి డిమాండ్ చేశారు.