వందేళ్ల జనగణమనకు మన రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా మదనపల్లెతో 92 ఏళ్ల
సుదీర్ఘ అనుబంధం ఉంది. ఎలాగంటారా... మదనపల్లెలో హోమ్రూల్ ఉద్యమ
స్థాపకురాలు అనిబిసెంట్ స్థాపించిన బిసెంట్ థియోసాఫికల్ కళాశాల (బీటీ
కాలేజ్) విద్యార్థులు జాతీయోద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. దీనిపై
ఆగ్రహించిన బ్రిటిష్ ప్రభుత్వం కళాశాల గుర్తింపును రద్దు చేసింది. 1919
ఫిబ్రవరిలో బెంగళూరుకు వచ్చిన రవీంద్రుడిని ఈ కాలేజీ ప్రిన్సిపాల్ కజిన్స్
తమ కళాశాలకు ఆహ్వానించారు.
1919 ఫిబ్రవరి 25న మదనపల్లెకు వచ్చిన ఠాగూర్ వారం రోజులపాటు ఈ కళాశాలలోనే
గడిపారు. అదే సమయంలో తాను తత్సమ బెంగాలీలో రచించిన జనగణమన గీతాన్ని 'ది
మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా' (భారత సుప్రభాత గీతం) పేరిట ఆంగ్లంలోకి
అనువదించారు. ఈ గీతానికి ప్రిన్సిపల్ కజిన్స్ సతీమణి మార్గరెట్ కజిన్స్
బాణీ కట్టి విద్యార్థులతో కలసి ఆలపించారు. ఠాగూర్ గౌరవార్థం దాన్నే తమ
కళాశాల ప్రార్థనాగీతంగా ప్రకటించారు. ఆనాటి నుంచీ 1950 వరకూ బీటీ కళాశాల
ప్రార్థనా గీతంగా కొనసాగిన జనగణమనకు 1950లో జాతీయ గీతం హోదా లభించింది.
No comments:
Post a Comment