భూవివాదం కేసులో మద్దెలచెరువు సూరి సోదరి గంగుల హేమలతను సీఐడీ పోలీసులు
అరెస్ట్ చేశారు. గురువారం ఆమెను నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు.
న్యాయస్థానం హేమలతకు రిమాండ్ విధించటంతో చంచలగూడ జైలుకు తరలించారు.
మహేశ్వరంలోని ఓ భూవివాదం విషయంలో రియల్టర్ ను ఆమె బెదిరించటంతో పోలీసులు
అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. కాగా మద్దెలచెరువు సూరి జనవరిలో తన ప్రధాన
అనుచరుడు భాను చేతిలో హతమైన విషయం తెలిసిందే.
No comments:
Post a Comment