Sunday, 1 January 2012

2014 ఎన్నికలలోపు జగన్ తిరిగి కాంగ్రెసులోకి రాక తప్పదు..జెసి దివాకర్ రెడ్డి

2014 ఎన్నికల వరకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి కాంగ్రెసులోకి రాక తప్పదని అనంతపురం జిల్లా సీనియర్ కాంగ్రెసు శాసనసభ్యుడు, మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి ఆదివారం అభిప్రాయపడ్డారు. వచ్చే సాధారణ ఎన్నికలలోపు పార్టీని వీడిన వారు అందరూ స్వగృహానికి వస్తారని ఆయన ఆశాభావం వ్య్తక్తం చేశారు. తెలంగాణలో ఉప ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్న జగన్ నిర్ణయం తనకు తెలియదని ఆయన వ్యాఖ్యానించారు. సంక్రాంతి తర్వాత నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తానని సిఎం చెప్పడం శుభ పరిణామం అన్నారు. కాగా సంక్షేమ పథకాల ప్రచారంతోనే తాము ఉప ఎన్నికల్లో ప్రజల్లోకి వెళతామని ఆనం వివేకానంద రెడ్డి వేరుగా అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ఈ ఏడాది పూర్వ వైభవం పొందుతుందన్నారు.ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల మధ్య అవగాహన వాస్తవమైనా అందులో ఆశ్చర్యపడాల్సిన అంశమేమీ లేదని మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ గుంటూరు జిల్లాలో అన్నారు. పాలనలో కొన్ని ఒడిదుడుకులు ఎదురు కావడం సహజమేనని వాటిని అధిగమిస్తామన్నారు. కొత్త సంవత్సరంలో తమ శాఖ మరింత సమర్థవంతంగా పని చేస్తుందన్నారు. ప్రాంతీయ పార్టీలు ఏవీ ప్రజల బాగోగులు పట్టించుకోవని, కేవలం అధికారం కోసమే పాకులాడతాయన్నారు.
నమస్తే రాయలసీమ డాట్ కాం

 పాఠకులకు 2012 నూతన సంవత్సర శుభాకాంక్షలు






ప్రభుత్వ ఉద్యోగార్థులకు వయో పరిమితి రెండేళ్లు పెంపు

నిరుద్యోగులకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి నూతన సంవత్సరం కానుక ప్రకటించారు. అన్ని కేటగిరీల్లో గరిష్ఠ వయోపరిమితిని రెండు సంవత్సరాలు పెంచుతున్నట్లు శనివారం ప్రకటించారు. కొన్నేళ్ళుగా ఖాళీల భర్తీ జరగకపోవడం, ఇదే క్రమంలో ఇటీవల లక్ష ఉద్యోగాల భర్తీకి నిర్ణయించడంతో... వయో పరిమితి పెంచాలంటూ విన్నపాలు అందాయి. దీంతో అధిక సంఖ్యలో నిరుద్యోగులకు అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి వయో పరిమితి పెంపు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం సర్వీసులో ఉండి మరో పోస్టుకు దరఖాస్తు చేసుకునేవారికి కూడా ఈ వయోపరిమితి పెంపు వర్తిస్తుంది.

Friday, 30 December 2011

సౌత్ టాప్ హీరో సర్వేలో జూ ఎన్టీఆర్

ప్రముఖ తమిళ పత్రిక కండక్టు చేసిన సర్వే ప్రకారం సౌత్ టాప్ హీరోల లిస్ట్ అంటూ ఓ లిస్ట్ నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఆన్ లైన్ సర్వే చేసి ప్రకటించామంటున్న వారి లెక్కలు ప్రకారం...

1.రజనీకాంత్ --95%

2.జూ.ఎన్టీఆర్ --85%

3.చిరంజీవి---82%

4.అజిత్--76%

5.విజయ్---74%

6.పవన్ కళ్యాణ్-72%

7.మోహన్ లాల్--63%

8.సూర్య--63%

9.మహేష్ బాబు--57%

10.ప్రభాస్--56%

అయితే ఈ పర్శంటేజ్ లు కేవలం ఆన్ లైన్ సర్వే ప్రకారం చేసినవి అని చెప్తున్నారు. అలాగే ఈ లెక్కలు 'ధట్స్ తెలుగు' స్వయంగా వేసినవి కాదని గమనించాలి. ప్రచారంలో ఉన్న వాటిని పాఠకులు కోసం అందించటం జరుగుతోంది.

అక్కినేని అన్నపూర్ణమ్మ నాకు తల్లిలాంటివారు... బాలకృష్ణ


 

ప్రముఖ నటులు అక్కినేని నాగేశ్వరరావు సతీమణి అన్నపూర్ణ నిన్న కన్నుమూశారు. తెలుగు పరిశ్రమ మొత్తం చూసి వచ్చి సంతాపం ప్రకటించారు. వారిలో...బాలకృష్ణ మాట్లాడుతూ..‘‘నాకు తల్లిలాంటివారు. నాకెంతో ఇష్టమైనవారు. నేనీ మధ్య ‘శ్రీరామరాజ్యం’ చిత్రంలో రాముని పాత్ర చేసిన సంగతి తెలిసిందే. అందులో వాల్మీకిగా నటించాలని నాగేశ్వరరావుగారిని అడిగితే... అన్నపూర్ణగారు చాలా ప్రోత్సహించారు. ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’అన్నారు. ఇక సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడుతూ..‘‘నాగేశ్వరరావుగారికి ఇది నిజంగా పూడ్చలేని లోటు. నా సినీ కెరీర్ మొదలైన నాటినుంచి అక్కినేని కుటుంబంతో నాకు అనుబంధం ఉంది. ఇంటికెళ్లినప్పుడల్లా ఎంతో ఆప్యాయంగా పలకరించేవారామె. అన్నపూర్ణమ్మగారి మరణం అక్కినేని కుటుంబానికే కాదు... చిత్రపరిశ్రమకే తీరని లోటు. ఈ బాధ నుంచి నాగేశ్వరరావుగారు త్వరగా బయటపడాలని ఆ దేవుడ్ని వేడుకుంటున్నాను’’అన్నారు ఇక ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు మాట్లాడుతూ...‘‘అక్కినేని నాగేశ్వరరావు, అన్నపూర్ణమ్మ ఆదిదంపతులు. అన్నపూర్ణ స్టూడియోలోకి అడుగుపెడుతుంటే శివపార్వతుల విగ్రహం కనిపి స్తుంది. ఆ విగ్రహం చూడగానే నాకు ఈ ఇద్దరే గుర్తొస్తారు. అన్నపూర్ణ స్టూడియో పతాకంపై నిర్మించిన తొలి చిత్రం ‘కళ్యాణి’కి నేను దర్శ కత్వం వహించాను. ఆ తర్వాత బుచ్చిబాబు, ప్రేమాభిషేకం, యువ రాజుతో కలిపి ఆరు సినిమాలు ఈ సంస్థలో చేశాను. అన్నపూర్ణమ్మ ఎప్పుడూ షూటింగ్‌కి వచ్చేవారు కాదు. కానీ షూటింగ్ పూర్తయ్యే సమయానికి ఏదో ఒకటి తినడానికి తీసుకువచ్చేవారు. ఆ రకంగా ‘అన్నపూర్ణ’ అనిపించుకున్నారు’’ అన్నారు. అలాగే మోహన్ బాబు మాట్లాడుతూ..‘‘ఆ మహాతల్లి మరణవార్త ఓ ‘షాక్’లా నా మనసంతా కదిలించి వేసింది. ఆ కుటుంబంతో నా అనుబంధం మాటల్లో చెప్పలేనిది. ‘కురుక్షేత్రం’లో నా డైలాగులు ఎంతో నచ్చాయని, ఎన్టీఆర్ తర్వాత అలా డైలాగ్స్ నేను మాత్రమే చెప్పగలనని ఆమె నా గురించి అన్న మాటలు ఈ సందర్భంలో గుర్తొస్తున్నాయి. ఆ స్త్రీమూర్తికివే నా కన్నీటి వీడ్కోలు’’ అన్నారు.

యమదొంగ,సింహాద్రి తరహాలో...ఎన్టీఆర్ తాజా చిత్రం దమ్ము

ఎన్టీఆర్ తాజా చిత్రం దమ్ములో హైలెట్స్ చాలా ఉన్నాయని చెప్తున్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకోదగినవి..ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం..అయితే అదుర్స్ టైప్ లో కాకుండా రెండు పాత్రలూ చాలా పవర్ ఫుల్ గా ఉంటాయని చెప్తున్నారు. అందులో ఒకటి పోలీస్ అధికారిగా అదరకొట్టే పాత్ర అని చెప్తున్నారు. అంతేగాక రెండో పాత్ర అది,సింహాద్రిలను తలపించే రేంజిలో పాత్ర అంటున్నారు. ఆ రేంజి ఎమోషన్స్ ఆ పాత్రలో నింపాడని చెప్తున్నారు. అలాగే చిత్రంలో రెండో హైలెట్ సిస్టర్ సెంటిమెంట్. శంభో శివ శంబో లో చేసిన అభినయ ఈ చిత్రంలో ఎన్టీఆర్ కు చెల్లిగా చేస్తోంది. వీరిద్దరి మధ్య వచ్చే టచింగ్ సీన్స్ సినిమాకు ప్రాణమై నిలుస్తాంటున్నారు. రాఖీ రేంజిలో సిస్టర్ సెంటిమెంట్ పండుతుందని చెప్తున్నారు. వీటికి అదనపు బలం ఎమ్.ఎమ్ కీరవాణి సంగీతం. యమదొంగ,సింహాద్రి తరహాలో ఈ చిత్రంలో పాటలన్నీ మ్యూజికల్ హిట్స్ అవ్వటమే కాక సినిమా సీన్స్ కు బలం చేకూరుస్తాయని చెప్తున్నారు. చివరగా అపజయమెరగని దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వ ప్రతిభ. వరస ఫ్లాపుల్లో ఉన్న బాలకృష్ణను సింహా చిత్రంతో మరోసారి హిట్ పధంలో నడిపించిన ఘనత బోయపాటికే దక్కింది. ఈ చిత్రంతో తను యంగ్ హీరోల చిత్రాలను డైరక్ట్ చేసే కంటిన్యూ అవకాశాలు కోసం ఎదురుచూస్తున్నాడు..అందుకు తగిన కృషి చిత్రంలో కనిపిస్తుందని చెప్తున్నారు.ఇక దమ్ము చిత్రంలో ఎన్టీఆర్ సరసన త్రిష,కార్తిక నటిస్తున్నారు.తొట్టింపూడి వేణు ఈ చిత్రంలో ఎన్టీఆర్ కి బావగా కనిపించనున్నారు.భానుప్రియ ..ఎన్టీఆర్ కి తల్లిగా చేస్తోంది.ఇలా ఎక్కడా రాజీపడకుండా అద్బుతమైన తారాగణంతో ఉన్నతమైన సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేయాలని భావిస్తున్నారు.

న్యూఇయర్ వేడుకలకు ముస్తాబు

కాల గమనంలో ఎన్ని వసంతాలు మన కళ్ల ముందు మంచులా కరిగిపోతున్నా కొత్త సంవత్సరం రాక నూతనోత్సాహమే. పాత ఏడాదికి వీడ్కోలు చెబుతూ కొత్త సంవత్సరాన్ని వినూత్నంగా ఆహ్వానం పలికేందుకు అందరూ సిద్ధమవుతున్నారు.న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం కొందరు ఇతర ప్రాంతాలకు వెళ్తుంటే.. మరికొందరు పుణ్యక్షేత్రాలకు పయనమవుతున్నారు. అలా వీలు కాని వాళ్లు మాత్రం స్థానికంగానే అంబరాన్నంటే సంబరాల్లో మునిగిపోవాలని పరితపిస్తున్నారు. కొత్త ఏడాది ప్రారంభానికి రెండు రోజులుండగానే ‘అనంత’ సుందరంగా ముస్తాబవుతోంది. వన్ ప్లస్ వన్ ఆఫర్లంటూ అప్పుడే వ్యాపారస్తులు న్యూఇయర్ బొనాంజా ప్రకటిస్తున్నారు.మద్యం కూడా ఆఫర్లలో లభిస్తుండడంతో మద్యంప్రియులు హుషారెక్కేందుకు సిద్ధమవుతున్నారు. వస్త్రదుకాణాలు కిటకిటలాడుతున్నాయి. పలు విద్యా సంస్థలు వేడుకలు నిర్వహించేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. కాగా కాలం తెచ్చిన మార్పుతో గ్రీటింగ్ కార్డులు వెలవెలబోతున్నాయి. సెల్ ఫోన్‌తో క్షణాల్లో శుభాకాంక్షలు చెప్పుకునే వీలుం డడంతో అందరూ వాటిపైనే ఆసక్తి చూపుతున్నారు. కొత్త ఏడా ది తమ జీవితంలో ఎలాంటి మార్పులు తెస్తుందో తెలుసుకోవాలనే కుతూహలం ఉండడంతో జ్యోతిష్కులకు డిమాండ్ పెరి గింది. గురువారం నగరంలోని రెస్టారెంట్లు, ఐస్ క్రీం పార్లర్‌లు, బేకరీలు విద్యుద్దీపాలంకరణతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.