Showing posts with label శ్రీశైలం దేవస్థానం. Show all posts
Showing posts with label శ్రీశైలం దేవస్థానం. Show all posts

Monday, 20 February 2012

శ్రీశైలం పుణ్య క్షేత్రం భక్తులతో కిటకిట

శ్రీశైలం పుణ్య క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది. రాత్రి 7 గంటలకు నందివాహనసేవతో స్వామివారి గ్రామోత్సవం, ఎదుర్కోల్ల ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. రాత్రి 10:30 గంటలకు లింగోద్భోవకాల మహాన్వసపూర్వక రుద్రాభిషేకం, రాత్రి 12 గంటలకు భ్రమరాంభిక-మల్లికార్జుస్వామి వారి కల్యాణోత్సవం జరగనుంది. చిత్తూరు  మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరాలయం భక్తులతో పోటెత్తింది. ముక్కోటిని దర్శించుకోడానికి వేలాది మంది భక్తులు బారులు తీరారు. తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. శ్రీవారి దర్శనం సుమారు ఆరు గంటల సమయం పడుతోంది.

Monday, 13 February 2012

శ్రీశైలంలో మహాశివరా త్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

శ్రీశైల మహాపుణ్య క్షేత్రంలో సోమవారం నుంచి మహాశివరా త్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కా నున్నాయి. 11 రోజులపాటు వైభవంగా నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలకు భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల ఉభయ దేవాలయాలను విద్యుద్దీపాలతో అలంకరించారు. ఉత్సవాలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులు, శివస్వాములకు దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఉత్సవాల్లో భాగంగా భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు ప్రత్యేక పూజలు, వివిధ వాహనసేవలు నిర్వహిస్తారు. ప్రధానంగా మహాశివరాత్రి పర్వదినం రోజున లింగోద్భవ సమయాన స్వామివారికి మహారుద్రాభిషేకం జరుగుతుంది.అనంతరం పాగాలంకరణ, కల్యాణ మహోత్సవం జరుగుతుంది. మొదటిరోజు సోమవారం ఉదయం వేదపండితులు యాగశాలలో గణపతిపూజ, పుణ్యాహవాచనం, శివసంకల్పం, చండీశ్వరపూజ, రుత్విగ్వరణం చేస్తారు. అనంతరం అఖండస్థాపన, వాస్తుపూజ, వాస్తుహోమం, పంచావరణార్చన, మండపారాధన, రుద్రకలశ స్థాప న జరుగుతుంది. సాయంత్రం అంకురారోపణ, అగ్ని ప్రతిష్ఠాపన, రాత్రి త్రిశూల పూజ, ధ్వజారోహణ, ధ్వజపటావిష్కరణ, బలిహరణలు చేపడతారు. కాగా రహదారులు సరిగా లేక కంకరతేలి ఉండటంతో శ్రీశైల క్షేత్రానికి పాదయాత్రగా వచ్చే భక్తులకు ముఖ్యంగా శివమాల ధరించిన భక్తులు తీవ్రఇక్కట్లకు గురవుతున్నారు. శివదీక్షా శిబిరాల వద్ద శివస్వాములకు ఉచిత వసతి ఏర్పాట్లతోపాటు విద్యుత్ సౌకర్యం, మంచి నీరు ఏర్పాటు చేసి, జ్యోతిర్ముడిని సమర్పించుకోవడానికి అనువుగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అన్ని క్యూలతో పాటు ఆలయ ప్రాంగణం లోపల, ప్రధానాలయ గోపురం నుంచి ముఖ ద్వారం వరకు విద్యుద్ధీకరణ పనులు పూర్తయ్యాయి. సాక్షి గణపతి, హఠకేశ్వరం, శిఖరేశ్వరం, కైలాస ద్వారం తదితర ప్రదేశాలకు మొబైల్ ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయడానికి రంగం సిద్ధం చేశారు. శాశ్వత ప్రాతిపదికన నిర్మించిన మరుగుదొడ్లలో చేయాల్సిన పనులు పూర్తికాగా, వివిధ ప్రదేశాలలో తాత్కాలిక మరుగుదొడ్ల నిర్మాణాలు మరో రెండు, మూడు రోజుల్లోగా పూర్తయ్యే అవకాశం ఉంది. పాతాళగంగ మెట్ల మార్గంలో విద్యుద్ధీకరణ, మంచి నీటి కొళాయిల ఏర్పాట్లు పూర్తయ్యాయి. పాతాళగంగలో గజ ఈతగాళ్లను నియమించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి వెళ్లే వాహనాలకు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా నిర్ణీత ప్రదేశాలలో పార్కింగ్ చేయడానికి అనువుగా ట్రాఫిక్ నియంత్రణ చేపట్టినట్లు పోలీస్ అధికారులు తెలిపారు.

Tuesday, 7 February 2012

శివరాత్రికి శ్రీశైలంలో విస్తృత ఏర్పాట్లు

శివరాత్రికి శ్రీశైలం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ రాంశంకర్ నాయక్ తెలిపారు. ఫిబ్రవరి 13 నుంచి 23 వరకు జరుగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లకై  దేవస్థానం కార్యనిర్వాహక భవనంలో సమీక్ష సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ రాంశంకర్‌నాయక్, ఎస్పీ శివప్రసాద్, ఇ ఓ హనుమంతరావు, దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ ఇమిడిశెట్టి కోటేశ్వరరావు, పాలక మండలి సభ్యుల అధ్యక్షతన అన్ని శాఖలకు చెందిన ఉన్నతాధికారుల సమక్షంలో ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శివరాత్రికి సంబంధించిన ఏర్పాట్ల గురించి, వసవి విభాగం, పారిశుద్యం, ట్రాఫిక్, క్యూలైన్లు, వాలెంటీర్లు తదితర ఏర్పాట్ల గురించి చర్చించారు. తాగునీటి సమస్యలు రాకుండా పంపింగ్ ద్వారా, ట్యాంకుల ద్వారా ఏర్పాటు చేయాలన్నారు. 9 వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి సేవలు అందిస్తామన్నారు. పారిశుద్ధ్యం కొరకు 350 మందిని, 650 స్వీపర్లు, 6 ట్రాక్టర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వసతి నిమిత్తం 1300 బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఘాట్‌రోడ్ల వద్ద స్వీడ్ బ్రేకర్ల ఏర్పాటు చేస్తామన్నారు. ఈప్రాంతాల్లో పల్లె వెలుగు బస్సులకు బదులుగా కొత్త బస్సులు ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను నియంత్రించాలని ఆర్ ఎంలను కలెక్టర్ ఆదేశించారు. అగ్నిమాపక సిబ్బందిని ఏర్పాటు చేసి పాతాళగంగ సమీపంలో గజ ఈతగాళ్ళను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 11 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో 95 సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జి తెలుగులో వచ్చే కార్యక్రమాలను కూడా ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. 1800 మంది భద్రతా సిబ్బందిని, నిఘా కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. చివరి రోజులైన 19, 20, 21 తేదీల్లో మద్యపానాన్ని నిషేదిస్తున్నట్లు తెలిపారు. ఏదేమైనా భక్తులకు దర్శనాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు సహకరించి సేవ చేయాలని వారు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్‌కో ఎస్ ఇలు, ఆర్టీసి ఆర్‌యంలు, ఆర్డీవో వెంకటమురళి, ఫారెస్టు, పారిశుద్య తదితర అధికారులు పాల్గొన్నారు.

Sunday, 8 January 2012

నేడు శ్రీశైలం మల్లన్న వార్షిక ఆరుద్రోత్సవం

పరమశివుని జన్మనక్షత్రమైన ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆదివారం రాత్రి శ్రీమల్లికార్జున స్వామికి వార్షిక ఆరుద్రోత్సవ  నిర్వహిస్తున్నట్లు  ఈఓ హనుమంతరావు  తెలిపారు. ఈ ఉత్సవంలో భాగంగా ఆదివారం రాత్రి 10.30 గంటలకు స్వామివార్లకు లింగోద్భవకాల, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, అన్నాభిషేకం, 9వ తేదీ సోమవారం స్వామివార్ల ప్రాతఃకాల పూజలనంతరం 5.30 గంటలకు ఉత్తరద్వార దర్శనం ఉంటుందన్నారు. అనంతరం 6 గంటలకు స్వామి అమ్మవార్లను నంది వాహనంపై వేంచేయించి పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహిస్తారని తెలిపారు. సోమవారం వేకువజామున 3.30 గంటలకు ఆలయ ఉత్తరద్వారమైన శివాజీ గోపురాన్ని తెరచి 4 గంటలకు సుప్రభాతసేవ, 5 గంటలకు మహామంగ ళహారతులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. వార్షిక ఆరుద్రోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం వేకువజామున జరిగే సుప్రభాత, మహామంగళహారతి సేవా టికెట్లను నిలుపుదల చేసినట్లు పేర్కొన్నారు. ప్రతి ఉత్సవంలో ఆలయ మహాద్వారమైన కృష్ణదేవరాయ గోపురం (తూర్పుద్వారం) మీదుగా గ్రామోత్సవానికి తరలివేళ్లే స్వామివారు ధనుర్మాసంలో వచ్చే ముక్కొటిఏకాదశి, వార్షిక ఆరుద్రోత్సవం రోజులలో మాత్రమే ఉత్తరద్వారం గుండా తరలి వెళ్లడం విశేషమన్నారు. స్వామివార్ల ప్రాతఃకాల ఉత్తర ద్వార దర్శనానంతరం 6 గంటలకు తూర్పుద్వారమైన శ్రీకృష్ణదేవరాయ రాజగోపురద్వారాలను తెరచి భక్తులకు దర్శన, ఆర్జితసేవలకు అనుమతిస్తున్నట్లు ఈఓ పేర్కొన్నారు

Wednesday, 4 January 2012

ముక్కోటి ఏకాదశికి శ్రీశైలంలో ప్రత్యేక పూజలు

ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీశైల మహాక్షేత్రంలో ప్రత్యేక పూజలను నిర్వహించనున్నామని కార్యనిర్వాహణాధికారి వి.హనుమంతరావు తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ వేలల్లో మార్పులు చేయనున్నట్లు ఆయన తెలిపారు. 3గంటలకు ఆలయ ద్వారాలను తెరచి మంగళహారతులు, మూడున్నర్ర గంటలకు సుప్రభాతసేవలను నిర్వహించి భక్తులకు స్వామిఅమ్మవార్లు దర్శనమివ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఉదయం ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్లు రావణ వాహనంలో ఆసీనులై ఉత్తర ద్వారమైన శివాజీ గోపురం మీదుగా గ్రామోత్సవం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. దేవస్థానంలో నేడు అన్ని ఆర్జిత సేవలను నిలుపుదల చేస్తున్నట్లు భక్తులు ఆ విషయాన్ని గమనించగలరని ఆయన తెలిపారు.రాష్ట్ర ఎన్నికల అధికారి కమిషనర్ బన్వర్‌లాల్ కుటుంబసమేతంగా స్వామి అమ్మవార్లను దర్శించారు. వీరికి సాధరంగా దేవస్థానం కార్యనిర్వాహణాధికారి హనుమంతరావు, ఆలయ ఎఇఓ సదానందం, వసతి గృహ ఎఇఓ రాజశేఖర్, అర్చకులు, వేదపండితుల నడుమ ఘనంగా ఆహ్వానం పలికి స్వామివారికి రుద్రాభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చనాది కార్యక్రమాలను నిర్వహించి శేషవస్త్రాన్ని, స్వామి వారి జ్ఞాపికను స్వీకరించారు.

Friday, 30 December 2011

నూతన సంవత్సరం సందర్భంగా శ్రీశైలంలో ఆర్జిత సేవలు రద్దు

ద్వాదశ జ్యోతిర్లింగ శైవక్షేత్రం, అష్టాదశ శక్తి పీఠమైన శ్రీశైల దేవస్థానంలో కొలువున్న శ్రీ భ్రమరాంబిక, మల్లిఖార్జునస్వామి దేవస్థానంలో రానున్న నూతన సంవత్సర సందర్భంగా ఆదివారం రోజున శ్రీశైల దేవస్ధానంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు కార్యనిర్వాహణాధికారి వి హనుమంతరావు తెలిపారు. నూతన సంవత్సరంలో స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారనే ముందస్తు జాగ్రత్త చర్యగా ఆరోజున అన్ని ఆర్జిత సేవలను రద్దుచేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలియజేశారు. శాశ్వత కల్యాణాలు త ఉన్నా భక్తులు యధావిధిగా కల్యాణాలు నిర్వహించబడతాయని అంతేకాక ఆ రోజున ఆలయ వేలాలలో కూడా మార్పులు చేయనున్నారు. వేకువ జాముననే 3:30 గంటలకు ఆలయద్వారాలు తెరచి మంగళవాయిద్యాలు 4గంటలకు సుప్రభాత సేవ, 4:30గంటలకు మహామంగళహారతి నిర్వహించిన అనంతరం స్వామి అమ్మవార్లు దర్శనమివ్వనున్నారు.

Sunday, 25 December 2011

శ్రీశైలప్రభలో ఆధ్యాత్మిక పత్రికలో నాయకుల ఫొటోలా?

శ్రీశైలం దేవస్థానం ఆధ్వర్యంలో ప్రచురితమవుతున్న శ్రీశైలప్రభ ఆధ్యాత్మిక పత్రికలో రాజకీయ నాయకుల ఫొటోలు కనిపించడం విడ్డూరంగా ఉందని, ఆధ్యాత్మికతకు పెద్దపీట వేయాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా జరుగుతోందని విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామీజీ అన్నారు. రాజకీయ నాయకుల ఫొటోలను పత్రికలో ముద్రించడం హేయమైన చర్య అని అన్నారు. మల్లన్న దర్శనార్థం శ్రీశైలం చేరుకున్న స్వామీజీ విలేఖరులతో మాట్లాడుతూ శ్రీశైలప్రభ పత్రిక భక్తి పారవశ్యంతో ఆధ్యాత్మిక చింతనతో ప్రచురితం కావాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా వివిధ రాజకీయ నాయకుల ఫొటోలతో వారికి ప్రచారం చేస్తున్నట్టుగా ఉందన్నారు. సొంత నిర్ణయాలతో ఇటువంటి చర్యలకు పాల్పడటం హేయమైన చర్యగా స్వామీజీ అభివర్ణించారు. ఇప్పటికైనా దేవాదాయశాఖ అధికారులు కళ్లు తెరవాలని, ఇటువంటి కార్యకలాపాలను ప్రోత్సహించడం మానుకోవాలని స్వరూపానందేంద్ర హితవు పలికారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను ఆధ్యాత్మిక చింతనతో నిర్వహించాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల ప్రాంగణాల్లో అన్యమత ప్రచారం ఎక్కువగా జరుగుతోందన్నారు. దాన్ని నిరోధించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అన్యమత ప్రచారానికి లోనైన ప్రజలు మతమార్పిళ్లకు పాల్పడి హిందూత్వాన్ని కాలరాస్తున్నారన్నారు. అలా జరుగకుండా చూడాల్సిన బాధ్యత ఆయా దేవాలయాల అధికారులు, కార్యనిర్వహణ సిబ్బందిపై ఉందన్నారు. అన్యమత ప్రచారాన్ని ప్రోత్సహించేవారిని దేవాదాయ చట్టం కింద కఠినంగా శిక్షించాలన్నారు. ఈ విధంగా మతమార్పిళ్లను కొంతైనా నిరోధించవచ్చునన్నారు. గిరిజన, చెంచుగూడేల్లో శివాలయాలు నిర్మించి అన్యమత ప్రచారానికి తావివ్వకుండా చూడాలన్నారు.