ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని
దర్శించుకున్నారు.
శనివారం ఉదయం ప్రారంభ దర్శనంలో కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించారు. ఈ
సందర్భంగా నాగార్జున శ్రీనివాసునికి తలనీలాలు సమర్పించుకున్నారు.
నాగార్జునతోపాటు అమల, అఖిల్ శ్రీవారి సేవలో పాల్గొన్నారు.దర్శనం అనంతరం
నాగార్జున మీడియాతో మాట్లాడుతూ 'రాజన్న' డిఫరెంట్ గా ఉందని...ఢమరుకం సినిమా
మరింత ఆసక్తికరంగా ఉంటుందన్నారు. కాగా
ఈరోజు తిరుమలకు వీఐపీల తాకిడి అధికంగా ఉంది. ఆనాటి హీరోయిన్ మీనా
కుటుంబసమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. కాగా అదే సమయంలో ముఖ్యమంత్రి
రావడంతో మీనా ఇబ్బంది పడ్డారు. కొద్దిసేపు సామాన్య భక్తులతో ఉండిపోయారు
Showing posts with label నాగార్జున. Show all posts
Showing posts with label నాగార్జున. Show all posts
Saturday, 7 January 2012
Monday, 2 January 2012
దూరంగా పొండి అంటూ మీడియాఫై...నాగార్జున ఫైర్
Wednesday, 28 December 2011
జెకె భారవి దర్శకత్వంలో మోహన్ బాబు,నాగార్జున
ప్రముఖ రచయిత జె కె భారవి దర్శకుడుగా మారి చేస్తున్న చిత్రం ఆది శంకరా
చార్య. ఈ చిత్రంలో ఆల్రెడీ నాగార్జున గెస్ట్ గా కీలకమైన పాత్రలో
కనిపించనున్నారు. ఇప్పుడు మోహన్ బాబు కూడా ఓ కీలకమైన పాత్రలో కి ఈ
సినిమాలోకి వచ్చి చేరిందని తెలుస్తోంది. మోహన్ బాబు భారవి చెప్పిన కథ
విని, ఇంత వరకు చిత్రించిన టోటల్ రషెస్ చూసి, అద్భుతంగా ఉందని అభినందిస్తూ
ఆది శంకరలో నటించడానికి నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పుతున్నారు.
గతంలో తాను రాసిన అన్నమయ్యలో మోహన్ బాబు ఓ కీలకమైన పాత్రను చేసి చిత్రానికి
వెన్నుముకలా నిలిచారు. ఇక నాగార్జున ఈ చిత్రంలో చేయటంపై భారవి
మాట్లాడుతూ..‘నా అభిమాన హీరో నాగార్జునను ఈ పాత్రలో చూడాలని 3 ఏళ్లుగా
కలలుకన్నాను. ఆ కలను అవలీలగా ఒక్క స్ట్రోక్ తో నాగ్ నిజం చేశారు. త్వరలో
అన్నమయ్య, శ్రీరామదాసులను మించిన సబ్జెక్టు ఇస్తాను’ అంటూ భారవి ఉద్వేగంతో
చెప్పారు.ఈ విషయమై నాగార్జున మాట్లాడుతూ...హిందూ ధర్మాన్ని నిలబెట్టిన ఆది
శంకరుడి దివ్య చరిత్రలో ఆ మహనీయుడి జీవితాన్ని మలుపు తిప్పిన అత్యంత
కీలకమైన ఒక మాస్ పాత్రలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉందని, భారతీయుడిగా
అది నాబాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు. ఇందులో హీరో కౌషిక్, రియల్
స్టార్ శ్రీహరి, డైలాగ్ కింగ్ సాయికుమార్, సుమన్, జయప్రద, రోషిణి, రోజా,
తులసి, ఆనంద్, నాగబాబు, అశోక్ కుమార్, శివ పార్వతి, సంగీతలతో పాటు
మరికొందరు నటిస్తున్నారు. గ్లోబల్ పీస్ క్రియేటర్స్ పతాకంపై ఈ సినిమాను
నిర్మిస్తున్నారు. ఆది శంకరాచార్య, వేదవ్యాస్ పాటలు అందించగా..నాగ్
శ్రీవత్స సంగీతం సమకూర్చుతున్నారు.Monday, 26 December 2011
నయనతారపై కన్నేసిన నాగార్జున ?
Friday, 25 November 2011
అనుష్క కోసం గోపీచంద్, నాగార్జున పోటీ
Tuesday, 22 November 2011
వర్మ సినిమాలో విలన్ గా నాగార్జున
Subscribe to:
Posts (Atom)