Showing posts with label ఎమ్మెల్యే అమరనాధ రెడ్డి. Show all posts
Showing posts with label ఎమ్మెల్యే అమరనాధ రెడ్డి. Show all posts

Wednesday, 14 December 2011

చిత్తూరు జిల్లాను విడదీస్తే ఊరుకోం...ఎమ్మెల్యే అమరనాధ రెడ్డి

జిల్లాను విభజించే ప్రయత్నాన్ని ప్రభుత్వం వెంటనే మానుకోవాలని పలమనేరు ఎమ్మెల్యే అమరనాధ రెడ్డి డిమాండు చేశారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రి మాణిక్య వరప్రసాద్ జిల్లా విభజనపై లేనిపోని ప్రకటనలు చేసి ప్రజలను ఉద్వేగానికి గురి చేయడం తగదన్నారు. వనరులు, నీటి సదుపాయాలు లేక కరువు కాటకాలతో అల్లాడుతున్న చిత్తూరు జిల్లాలో అంతర్భాగమైన తిరుపతిని వేరు చేయడమంటే ప్రజలను రెచ్చగొట్టడమేనన్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమలపై కడప, నెల్లూరు జిల్లాలకు చెందిన ప్రముఖుల కళ్ళు పడినట్లనిపిస్తోందని, వ్యాపార నిమిత్తం వలస వచ్చి తిరుపతిలో స్థిరపడిన బడా వ్యాపారస్తులు, కొందరు రాజకీ య నేతలు తిరుపతిని చిత్తూరు జిల్లానుంచి వేరు చేయాలనే కుట్ర పన్నుతున్నట్లు తెలుస్తోందన్నా రు. పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త డివిజన్ల ఏర్పాటుకు అందరూ అంగీకరిస్తారని, జిల్లా ను ముక్కలు చేయాలనుకుంటే మాత్రం ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి అయినప్పటికీ సహచర మంత్రి ప్రకటనపై తనకేమీ పట్టనట్టు వ్యవహరించడం విడ్డూరంగా వుందన్నారు. రాజకీయాలకతీతంగా జిల్లా లోని ప్రజాప్రతినిధులందరూ ఈ విషయంపై స్పందించాలని కోరారు. జిల్లాకు ఉద్యోగ, ఉపాధి, వ్యాపార, విద్యాకేం ద్రంగా విలసిల్లుతున్న తిరుప తిని జిల్లా నుంచి వేరు చేస్తామని ప్రభుత్వం ఆలో చిస్తుంటే విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘా లు స్పందించకపోతే భవిష్య త్తులో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని ఆయన హెచ్చరించారు.