Wednesday, 2 November 2011

అనంతపురం జిల్లా లో చంద్రబాబు పాదయాత్ర

                                                          
ని త్యం కరువుతో సతమతమవుతున్న రై తులకు అండగా టీడీపీ అధినేత చం ద్రబాబునాయుడు పాదయాత్రకు శ్రీ కారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా కరు వు ప్రాంతాల్లో చంద్రబాబునాయుడు తలపెట్టిన ఈ పాదయాత్రకు అనంతపురం జిల్లానుంచి బుధవారం ప్రారం భం కానుంది. నిత్యం కరువుతో సతమతమవుతున్న అనంత రైతులకు బా సటగా ఈ యాత్ర సాగనుందని టీడీ పీ శ్రేణులు వెల్లడించాయి. అనంతపు రం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని సీసీ కొత్తకోట గ్రామం నుంచి( ధర్మవరం- పుట్టపర్తి రహదారిపై) చంద్రబాబు పాదయాత్ర సాగుతుం ద ని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కా ల్వ శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షుడు బీ కే పార్థసార«థి తెలిపారు.


సీసీకొత్తకోట గ్రామం నుంచి మొదలయ్యే చంద్రబాబు పాదయాత్ర రాప్తాడు నియోజకవర్గంలోని బసంపల్లి, కనముక్కల, వె ల్దుర్తి, ఆముదాలకుంట క్రాస్, పుట్టపర్తి నియోజకవర్గంలోని కొడపగానిపల్లి, మైలేపల్లి, కొత్తచెరువు వరకు 15 కిలోమీటర్ల మేర సాగుతుంది. కరువు అనగానే గుర్తుకు వచ్చే అనంతపురం జి ల్లానుంచి ఈ యాత్రకు శ్రీకారం చు ట్టాలని టీడీపీ శ్రేణులు భావించాయి. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో వందేళ్ల చరిత్రలో ఎప్పుడూ లేని విధం గా ఆరు సంవత్సరాలు వరుస కరువులు వచ్చాయని, దీంతో వ్యవసా యం చేయడం అలా ఉంచితే బతుకే భారమైన పరిస్థితి రైతాంగంలో నెలకొంది.

దీంతో రైతులకు అండగా ని లిచి వారి కష్టాలు తెలుసుకోవడంతోపాటు, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు చేపట్టిన చంద్రబాబు పాదయాత్రకు అన్ని వర్గాలు మద్దతు పలకాలని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. రై తు సమస్యలపట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన పాదయాత్రను దృష్టిలో పెట్టుకు ని టీడీపీ నేతలు జనసమీకరణలో ము నిగిపోయారు. చంద్రబాబు పాదయాత్రకు సంబంధించిన ఏర్పాట్లులో టీ డీపీ నేతలు తలమునకలయ్యారు

Tuesday, 1 November 2011

కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గోల్డ్ మెడల్ గ్రహిత

                         
భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, ఒలంపిక్ గోల్డ్ మెడల్ గ్రహిత అభినవ్ బింద్రాలకు అరుదైన గౌరవం దక్కింది. ధోని, బింద్రాలకు టెర్రిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ హోదాను ఆర్మీ చీఫ్ జనరల్ వీకే సింగ్ అందజేశారు. సౌత్ బ్లాక్‌లో జరిగిన కార్యక్రమానికి ధోని, బింద్రాలు హాజరయ్యారు.

బాలయ్య కొన్ని విమర్శలు

నందమూరి హీరో బాలయ్య నటించిన ‘శ్రీరామ రాజ్యం’ ఆడియో అభినందన సభ సోమవారం రాత్రి జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో బాలయ్య కొన్ని విమర్శలు సంధించారు. "చరిత్ర తెలియని వారు తెలుగు సినిమాల గురించి చాలా చిన్నతనంగా మాట్లాడారు. ఒకాయన మాట్లాడుతూ.. తెలుగులో ఏమున్నాయండి.. సరైన సినిమాలు.. సరైన డైరెక్టర్లే లేరు... అంటూ ఏదోదే వాగాడు. నేను వెంటనే... చరిత్ర తెలియకుండా మాట్లాడకు. మాట్లాడేముందు నోరు కంట్రోల్‌ చేసుకో! మీకు తెలుగు దర్శకుల గురించి మాట్లాడే హక్కులేదు. ఆదిత్య 369, భైరవద్వీపం వంటి సినిమాలు తీసింది తెలుగువారు కాదా?" అని అన్నారు
                            .

ఈ వాఖ్యలు మెగా వాసరుడు రామ్ చరణ్ ను ఉద్దేశించి అన్నవే అనే వాదన వినిపిస్తోంది ఫిల్మ్ నగర్లో..., సూర్య, మురుగదాస్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'సెవెన్త్‌ సెన్స్‌' సినిమా ప్రమోషన్‌లో మురుగదాస్‌ను, సూర్యను పొగడ్తల్తో ముంచెత్తాడు రామ్ చరణ్. రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌లు కూడా ఇటువంటి పాత్రలు చేయడం సూర్యకే సాధ్యం. మాకు సాధ్యం కాదంటూనే... మురుగదాస్‌ వంటి గొప్ప దర్శకుడు తెలుగులో లేరు అని వ్యాఖ్యానించారు. దీంతో అప్పుడు బాలయ్య రామ్ చరణ్, అల్లు అర్జున్ కు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. తాజాగా నిన్న రాత్రి బాలయ్య ఇదే విషయాన్ని లేవనెత్తడంతో.....సర్వత్రా 
చర్చనీయాంశమైంది

శ్రీరామరాజ్యం సినిమా కార్తీక పౌర్ణమి ఈనెల 15న ప్రేక్షకుల ముందుకు

వెండితెరపై రాముడంటే ఎన్టీవోడే. మరి, బాలయ్య ఎలా ఉంటాడు? ఇప్పటికే కృష్ణుడిగా మెప్పించిన బాలకృష్ణ శ్రీరాముడి గెటప్‌లో వెలిగిపోతున్నాడు. బాపు దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీరామరాజ్యం ఈనెల 15న ప్రేక్షకుల ముందుకు దూసుకొస్తోంది. వెండితెర అందగాడు బాలకృష్ణ రాముడి వేషమిది. శ్రీరామరాజ్యం స్టిల్స్‌ని చిత్ర యూనిట్‌ రిలీజ్‌ చేసింది. ఫస్ట్‌లుక్‌లో బాలయ్య కేక పెట్టిస్తున్నాడు. రామాయణ ఘట్టాల్ని తెరకెక్కించడంలో తనదైన స్టైల్‌ని కనబరిచే అగ్రశ్రేణి దర్శకుడు బాపు నిర్దేశకత్వంలో బాలయ్య అలరిస్తున్నాడు    
                                 
ఆహార్యంలో..., వేషధారణలో... నఖశిఖ పర్యంతం తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ స్పష్టంగా కనిపిస్తోంది. రొటీన్‌ సినిమాల నుంచి భిన్నంగా శ్రీరామరాజ్యం నిలుస్తుందని చిత్ర యూనిట్‌ ఆశాభావం వ్యక్తం చేసింది. నవ్యతకు కొదవలేని సృజనాత్మక సాంకేతిక నిపుణులు మన దగ్గరా ఉన్నారని, గతాన్ని ఓసారి పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుందని బాలయ్య అన్నారు. బాలయ్యతో పాటు లక్ష్మణుడిగా శ్రీకాంత్, సీతగా నయనతార పాత్రల్ని ఛాలెంజింగ్‌గా తీసుకుని నటించారని చిత్ర యూనిట్‌ చెప్తోంది. శ్రీరామరాజ్యం సినిమా కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈనెల 15న ప్రేక్షకుల ముందుకు వస్తోంది

పెట్రోవాత లీటరుకు రూ.1-80పైసలు పెరిగే అవకాశం

                                   
పెట్రోవడ్డన మరోసారి వినియగదారుల నడ్డి విరచనుంది. ఇటీవల లీటరుకు ఐదు రూపాయలు పెంచిన సర్కార్‌ నాలుగు నెలల వ్యవధిలోనే మళ్ళీ పెట్రోవాత పెట్టేందుకు రెడీ అవుతోంది. లీటరకు రూపాయి ఎనభై పైసల నుంచి రెండు రూపాయల వరకు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెట్రోలియం కంపెనీలు నష్టాలను మూటగట్టుకుంటున్నాయంటూ ఓసాకును చూపి ప్రజలపై మోయలేని భారం మోపుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి

నేటి నుంచి రూపాయికి కిలో బియ్యం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కిలో రూపాయి బియ్యం పధకం ఇవాల్టి నుండి ప్రారంభం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఖైరతాబాద్‌లో లాంఛనంగా ప్రారంభిస్తారు. రాష్ట్రంలోని దారిద్య్ర రేఖకు దిగువనున్న 2 కోట్ల 26 లక్షల కుటుంబాలకు మేలు జరుగుతుందని అంచనా. దీని వల్ల రాష్ర్టంలోని 7.5 కోట్ల మంది నిరుపేదలకు లబ్ది చేకూరనుంది. 

తెల్ల రేషన్ కార్డు దారులందరికీ రేషన్‌ దుకాణాల ద్వారా కిలో రూపాయికే బియ్యం పంపిణీ చేయడం వల్ల 6వందల కోట్ల భారం పెరుగుతుందని అంచనా.1983లో బహిరంగ మార్కెట్‌లో బియ్యం ధర రెండున్నర ఉండగా ప్రభుత్వం పేదల కోసం కిలోకు రెండు రూపాయలకే ఎన్టీఆర్ సర్కార్ పంపిణీ చేసింది. అప్పట్లో అదో సంచలనం. 1996లో చంద్రబాబు సబ్బిడీ బియ్యం ధరను మూడున్నర రూపాయలకు పెంచా

Monday, 31 October 2011

కర్నూలు జిల్లా లో 300 ఏళ్ల నాటి శివాలయ ముఖ మంటపం కూలిపోయింది

కర్నూలు జిల్లా ఆత్మకూరులో 300 ఏళ్ల నాటి శివాలయ ముఖ మంటపం సోమవారం కూలిపోయింది. కార్తీక మాసం మొదటి సోమవారం పురస్కరించుకుని ఆలయానికి విద్యుద్దీపాలంకరణ చేసేందుకు మౌలాలి అనే కార్మికుడు ఆలయం పైకి ఎక్కగా ఈ ఘటన చోటుచేసుకుంది. అతడికి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

పూర్వం శ్రీశైల మల్లిఖార్జునుని దర్శించుకునేందుకు మహర్షులు ఆత్మకూరు మీదుగా కాలినడకన వెళ్లే సమయంలో ఓ భారీ రాతిబండను పంచలింగాల ఆకృతిలో మలచి స్వయంభూ పరమేశ్వరుడిని రూపొందించి పూజలు చేశారన్నది చరిత్ర. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న ఈ ఆలయానికి 300 ఏళ్ల క్రితం భక్తులు ముఖమండపాన్ని నిర్మించారు. అప్పటి నుంచి నిత్యపూజలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కార్తీక మాసం మొదటి సోమవారం నాడు ముఖమంటపం కూలిపోవడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు