Thursday, 2 February 2012

అనంతపురం జిల్లాలో వజ్రాలపై అంతర్జాతీయ సదస్సు

స్థానిక జియలాజికల్ సర్వే ఆఫ్‌ఇండియా(జీఎస్‌ఐ) వజ్రాల పరిశోధన కేంద్రంలో గురువారం నుంచి రెండు రోజుల పాటు వజ్ర పరిశోధనలపై అంతర్జాతీయ సదస్సు జర గనుంది. ఈ సదస్సుకు దేశ, విదేశీ శాస్త్రవేత్తలు హాజరుకానున్నారు.వారి కోసం వసతి ఏర్పాట్లు పూర్తి చేశారు. వజ్రాలు ఎలా లభిస్తాయి? వజ్రాల ముడి ఖనిజమైన కింబర్‌లైట్ ఎలా ఉంటుంది ? అందులో ఎన్ని రకాలు ఉంటాయి? నాణ్యతను గుర్తించడం ఎలా ? వ్యాపారపరంగా సాధ్యమా.. కాదా? తదితర అంశాలపై శాస్త్రవేత్తలు సదస్సులో చర్చించనున్నట్లు సమాచారం. అలాగే ముడిఖనిజాన్ని ప్లాంట్‌కు తరలించిన తరువాత వజ్రాలు ఎలా వెలికితీస్తారు? అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయాలను జూనియర్ జియాలజిస్టులకు సీనియర్ శాస్తవేత్తలు వివరించే అవకాశముంది.

రేపట్నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్

విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాల ఆం దోళనల నేపథ్యంలో.. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్‌ను బోర్డు ప్రకటించింది. ఈ శుక్రవారం నుంచి ఈనెల 25వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తం గా 6,33,571 మంది విద్యార్థులు ప్రాక్టికల్స్‌కు హాజరుకానున్నారు. అందులో 4,85, 356 మంది జనరల్, 1,48,215 మంది ఒకేషనల్ విద్యార్థులు ఉన్నారు. వివరాలను ఇంటర్ బోర్డు సెక్రెటరీ  ఒక ప్రకటనలో విడుదల చేశా రు. పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయినట్లు తెలిపారు. రోల్ నెంబర్లు, బ్యాచ్ లు, టైమ్-టేబుల్ సహా హాల్ టికెట్ల ముద్రణ, అభ్యర్థులకు పంపిణీ పూర్తయ్యాయి. అభ్యర్థులు తమ బ్యాచ్‌ని మార్చుకునేందుకు అవకాశం లేదు. జాతీయ క్రీడలకు హాజరయ్యే అభ్యర్థులకు మాత్రం ఇందుకు మినహాయింపు ఉంటుంది. 'సమ్మక్క-సారల మ్మ' జాతర రూట్లలో ఉన్న కాలేజీల్లో ప్రాక్టికల్ పరీక్షలను జాతర అనంతరం నిర్వహిస్తారు. సెంటర్ల వద్ద ర్యాండమ్‌గా వీడియోగ్రఫీ ఏర్పాటు చేస్తారు. జిల్లా కలెక్టర్ ఛైర్మన్‌గా.. ఎస్పీ వైస్ ఛైర్మన్‌గా.. ఆర్జేడీ, డీవీఈవో ఎక్స్అఫీషియో మెంబర్లుగా ఒక సీనియర్ ప్రిన్సిపాల్ మెంబర్‌గా హైపవర్ కమిటీని ఏర్పాటు చేశారు. మాల్ ప్రాక్టీస్ జరిగిన సెంటర్లలో రీఎగ్జామ్ నిర్వహణకు ఆదేశించే అధికారం ఈ కమిటీకి ఉంటుంది. పనిచేసే కాలేజీల్లో/అదే యాజమాన్య కాలేజీలో ప్రాక్టికల్ పరీక్షల విధులు నిర్వహించకుండా ఎగ్జామినర్లను జంబ్లింగ్ చేస్తున్నారు. ప్రతి 20 సెంటర్లకు ఒక ఫ్లయింగ్ స్క్వాడ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఏదైనా కాలేజీలో 25 శాతం మందికిపైగా విద్యార్థులకు 100శాతం మార్కులు వస్తే.. ఆయా విద్యార్థుల ఆన్సర్ స్క్రిప్టును రీవెరిఫికేషన్ చేస్తారు. మూల్యాంకనం అనంతరం 27 నుంచి 30 మార్కుల మధ్య స్కోర్ సాధిస్తే మిగతా వారి ఆన్సర్ స్క్రిప్టులను కూడా రీవెరిఫికేషన్ చేస్తారు.
నాలుగు విడతల్లో నిర్వహించనున్న ఈ పరీక్షల కోసం 2,708 సెంటర్లు ఏర్పాటు చేశారు. మొత్తం 11,456 మంది ఎగ్జామినర్లను నియమించారు. మొదటి విడత 3వ తేదీ నుంచి నుంచి 8వరకు, రెండో విడత 9 నుంచి 13 వరకు, మూడో విడత 14 నుంచి 18 వరకు, నాలుగో విడత ప్రాక్టికల్స్ 21 నుంచి 25 వరకు జరుగుతాయి. మిలాద్ నబీ కారణంగా ఈ నెల 5న, వీఆర్వో పరీ క్ష కారణంగా 19న, శివరాత్రి కారణంగా 20న పరీక్ష ఉండదు.

Tuesday, 31 January 2012

కెప్టెన్సీ నుండి తోలగించినా నేను సిద్దం...!మహేంద్ర సింగ్ ధోని

తన బరువు బాధ్యతల మీద సంపూర్ణ అవగా హన కలిగిన వ్యక్తి ధోనీ. ఏ కెప్టెన్‌కైనా కష్టనిష్ఠూ రాలు సహజం. ఆడినా ఆడలేక పోయినా వికెట్లు తీయ లేకపోయిన సహచరులను పల్లెత్తుమాట అనకుండా తనకు కావాల్సింది ఇతరుల నుంచి రాబట్టుకోగల నేర్పరి ధోనీ. ఓటమి ఎదురవుతున్న స్థితిలోనూ మహీ నిరాశకులోనైన సందర్భం ఒక్కటీ నేను చూడలేదు. సంయమనంతో వ్యవహరిం చడమనేది ధోనీకి ఉన్న గొప్ప లక్షణం.అన్ని విభా గాల్లోనూ ఆటగాళ్లను సక్రమంగా వినియో గించుకోగలిగాడు. వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌, కెప్టెన్‌ అవతారాల్లో ధోనీ మీద ఏ స్థాయిలో ఒత్తిడి ఉంటుందో ఒకసారి ఊహించండి. ధోనీయే అత్యుత్తమ కెప్టెననేది నా అభిప్రాయం అని అంశు మన్‌ గైక్వాడ్ అభిప్రాయపడ్డాడు. భారత్‌ వరుస పరాజయాలకు ఒక్క ధోనీనే నిందించడం తగదు. కానీ ఓటమికి జట్టుతో సహా జవాబుదారీగా నిలవాలని అనిల్ కుంబ్లే వ్యాఖ్యానించాడు.ఆస్టేలియా టెస్టు సిరిస్‌లలో టీమిండియా ఓటిమికి భాద్యత వహిస్తూ తాను తన కెప్టెన్సీని వదులు కోవడానికి సిద్దంగా ఉన్నట్లు తెలిపాడు.ఇంగ్లాండ్, ఆస్టేలియాలలో ఘోర పరాజయాలను మూటగట్టుకున్నందుకు టీమిండియా జట్టు కెప్టెన్‌గా తాను భాద్యతను వహిస్తున్నానని మహేంద్ర సింగ్ ధోని ఓ ప్రముఖ టివి ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడారు. ఇంగ్లాండ్, అంతేకాకుండా ఆస్టేలియా మీడియా ముందు ధోని కెప్టెన్సీ అనేది నేను అదనపు బాధ్యతగా భావించడం లేదు. సెలక్టర్స్ నన్ను కెప్టెన్సీ నుండి తోలగించినా నేను ఆనందంగా ఆ బాధ్యతల నుండి వైదోలగడానికి సిద్దంగా ఉన్నానని అన్నారు.
టీమిండియా కెప్టెన్‌గా ధోనీ 2007వ సంవత్సరంలో బాధ్యతలను స్వీకరించాడు. తాను కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించిన తర్వాత టీమిండియా ఎన్నో విజయాలను సొంతం చేసుకుంది. 28 సంవత్సరాలుగా కళ్లు కాయలు కాచేలా వేచిచూసిన ప్రపంచ కప్‌ని అందించిన అత్యత్తుమ కెప్టెన్‌గా ధోనీ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు. ధోనీ క్రికెట్ ట్రాక్ రికార్డుని గనుక పరిశీలిస్తే 67 టెస్టులాడి, మొత్తం 3509 పరుగులు చేశాడు.
ఐతే ఇంగ్లాండ్, ఆస్టేలియా వరుస ఓటముల తర్వాత ధోనీ కెప్టెన్సీ‌పై చర్చనీయాంశం అయింది. ఇటీవల ఆస్టేలియా క్రికెటర్ ఇయాన్ ఛాపెల్ మాట్లాడుతూ టీమిండియా కొత్త కెప్టెన్‌ని వెతకాల్సిన సందర్బం వచ్చిందని పేర్కోన్నడమే కాకుండా.. ధోనీ టెస్టు క్రికెట్‌కి మరిన్ని రోజులు సమాధానం చెప్పలేడని తేలికగా కొట్టి పారేశాడు. ధోనీని విదేశంలో జరిగిన ఈ రెండు టూర్స్‌లలో గమనించినట్లేతే బ్యాటింగే కాదు.. కీపింగ్‌లో కూడా ఏమంత ప్రతిభను కనబర్చలేదు. 2011లో జరిగిన ఇంగ్లాండ్ నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరిస్‌లో ధోనీ కేవలం 220 పరుగులు మాత్రమే చేశాడు. యావరేజి చూస్తే 31.40గా నమోదైంది. ఇక ఆస్టేలియా టెస్టు సిరిస్‌లో కూడా ఆడిన మూడు టెస్టు మ్యాచ్‌లలో కేవలం 102 పరుగులు చేసి 20.40 యావరేజిని నమోదు చేశాడు. పెర్త్‌లో జరిగిన మూడవ టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా అడిలైడ్ టెస్టుకి ధోనిని నిషేధించిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఇండియన్ క్రికెట్ మాజీలు ధోనిని సమర్దిస్తున్నారు. నా వరకు ఇప్పటికీ ధోనీయే అత్యుత్తమ కెప్టెన్‌ అని కపిల్ దేవ్ అన్నాడు. నాలుగు సంవత్స రాల్లో కెప్టెన్‌గా ధోనీ రాణించిన విధానం అద్భు తం. 'ఇది గెలువు' అని అడిగిన ప్రతిదీ గెలిపించి పెట్టాడు. పరిమితులకు లోబ డే గెలుపును సాధించాడు. ఇప్పుడు కూడా అదే పరిమితులను గుర్తించి ధోనీ విషయంలో నిర్ణయం తీసుకుంటే జట్టుకు మేలు జరుగుతుందని కిరణ్ మోరే అన్నాడు.

దెబ్బతిన్న టీమిండియా

టెస్టు సిరీస్‌ను 0-4 తేడాతో ఓడిపోయిన టీమిండియాను ఆస్ట్రేలియా జట్టు కోచ్ మికీ ఆర్థర్ దెబ్బతిన్న పులితో పోల్చాడు. ఏ క్షణంలోనైనా ఎదురుదాడికి దిగుతుందని జోస్యం చెప్పాడు. అతను విలేఖరులతో మాట్లాడుతూ, శ్రీలంక, ఆస్ట్రేలియా జట్లు కూడా పాల్గొనే ముక్కోణపు వనే్డ సిరీస్‌లో విభిన్నమైన భారత జట్టును చూస్తామని వ్యాఖ్యానించాడు. సురేష్ రైనా, రోహిత్ శర్మ వంటి యువ ఆటగాళ్లు బుధవారం జరిగే మొదటి టి-20 మ్యాచ్‌లో అద్భుతాలు సృష్టించే అవకాశం లేకపోలేదని అన్నాడు. విరాట్ కోహ్లీ సమర్థుడైన ఆటగాడని, రవీంద్ర జడేజా వంటి యువ ఆల్‌రౌండర్ టీమిండియాకు అండగా నిలుస్తాడని చెప్పాడు. ఆసీస్ జట్టులోనూ యువ ఆటగాళ్లు చాలా మంది ఉన్నారని, కాబట్టి టి-20 సిరీస్‌తోపాటు, ముక్కోణపు వనే్డ టోర్నీ కూడా ఉత్కంఠ భరితంగా సాగుతుందని ఆర్థర్ పేర్కొన్నాడు. వికెట్‌కీపర్ హాడిన్ స్థానంలో జట్టులోకి వచ్చిన మాథ్యూ వేడ్ తన స్థానాన్ని పదిలం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడన్న ఆశాభావం వ్యక్తం చేశాడు. అవసరాలను దృష్టిలో ఉంచుకొని, టి-20, వనే్డ టోర్నీలకు ఆసీస్ జట్టు ఎంపిక ఉందని స్పష్టం చేశాడు.

బీఈడీ అభ్యర్థులకు ప్రభుత్వం షాక్

అయితే నియామకాల సమయానికి డీఎడ్, బీఎడ్ అంటూ సమస్యను తెరపైకి తెచ్చి ప్రతిభా అభ్యర్థులకు తీరని అన్యాయం చేశారు. కోర్టు వరకు వెళ్లి ఏడాదిన్నరపాటు వ్యవహారం కొనసాగి, చివరకు డీఎడ్ 30, బీఈడీలకు 70 శాతం ఎస్‌జీటీ పోస్టులను కేటాయించి నియామకాలు జరిపారు. దీంతో ఎందరో ప్రతిభ చూపిన బీఈడీ అభ్యర్థులకు పోస్టులు దక్కకుండా పోయాయి. ఆ తర్వాతనైనా ప్రభుత్వం ముందే కళ్లు తెరవలేదు. వచ్చే డీఎస్సీలో ఎస్‌జీటీ పోస్టులను కేవలం డీఎడ్‌లకే అని ప్రకటించలేదు. దీంతో అభ్యర్థులు బీఈడీ చేశారు. ముందే బీఈడీ చేసిన వారు వచ్చే డీఎస్సీలోనైనా ఉద్యోగం సంపాదించవచ్చని ఆశపడి చదువుతూ వచ్చిన వారికి నిరాశే మిగిలిపోయింది. అంతలోనే టెట్ విధానం తెరపైకి తెచ్చారు. ఇందులో పాసైతేనే డీఎస్సీ రాయడానికి అవకాశం అన్నారు. అయినా అభ్యర్థులు తమ రాత ఇలా ఉందనుకుని తొలి టెట్ పోటీ పరీక్ష రాశారు. ఆనాడు బీఈడీ అభ్యర్థులకు ఎస్‌జీటీ, స్కూల్ అసిస్టెంట్‌ట్లు రెండు పేపర్స్ రాయడానికి అవకాశం కల్పించారు. జనవరిలో రెండో టెట్ చేపట్టారు. అయితే ఇందులో బీఈడీ అభ్యర్థులు కేవలం స్కూల్ అసిస్టెంట్ పేపర్-2 మాత్రమే రాయడానికి అర్హులని నిబంధన విధించారు. అనుకున్నట్లుగానే బీఈడీ అభ్యర్థులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో ఎస్‌జీటీ పోస్టులకు బీఈడీలు అనర్హులుగా ప్రకటించారు. దీంతో ఈ బీఈడీ అభ్యర్థులకు ఎదురుదెబ్బ తగిలింది. లబోదిబోమంటూ అభ్యర్థులు నెత్తినోరు కొట్టుకుంటున్నారు. ఆవేశం తట్టుకోలేక ప్రభుత్వం తీరుపై ఆందోళన చేపట్టి నిరసనలు వ్యక్తం చేశారు. అసలు కథలోకి వెళితే ప్రభుత్వం రోజుకొక నిబంధన విధించి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోంది. 2008 డీఎస్సీ నోటిఫికేషన్ కామన్‌గా విడుదల చేశారు.
అయితే నియామకాల సమయానికి డీఎడ్, బీఎడ్ అంటూ సమస్యను తెరపైకి తెచ్చి ప్రతిభా అభ్యర్థులకు తీరని అన్యాయం చేశారు. కోర్టు వరకు వెళ్లి ఏడాదిన్నరపాటు వ్యవహారం కొనసాగి, చివరకు డీఎడ్ 30, బీఈడీలకు 70 శాతం ఎస్‌జీటీ పోస్టులను కేటాయించి నియామకాలు జరిపారు. దీంతో ఎందరో ప్రతిభ చూపిన బీఈడీ అభ్యర్థులకు పోస్టులు దక్కకుండా పోయాయి. ఆ తర్వాతనైనా ప్రభుత్వం ముందే కళ్లు తెరవలేదు. వచ్చే డీఎస్సీలో ఎస్‌జీటీ పోస్టులను కేవలం డీఎడ్‌లకే అని ప్రకటించలేదు. దీంతో అభ్యర్థులు బీఈడీ చేశారు. ముందే బీఈడీ చేసిన వారు వచ్చే డీఎస్సీలోనైనా ఉద్యోగం సంపాదించవచ్చని ఆశపడి చదువుతూ వచ్చిన వారికి నిరాశే మిగిలిపోయింది. అంతలోనే టెట్ విధానం తెరపైకి తెచ్చారు. ఇందులో పాసైతేనే డీఎస్సీ రాయడానికి అవకాశం అన్నారు. అయినా అభ్యర్థులు తమ రాత ఇలా ఉందనుకుని తొలి టెట్ పోటీ పరీక్ష రాశారు. ఆనాడు బీఈడీ అభ్యర్థులకు ఎస్‌జీటీ, స్కూల్ అసిస్టెంట్‌ట్లు రెండు పేపర్స్ రాయడానికి అవకాశం కల్పించారు. జనవరిలో రెండో టెట్ చేపట్టారు. అయితే ఇందులో బీఈడీ అభ్యర్థులు కేవలం స్కూల్ అసిస్టెంట్ పేపర్-2 మాత్రమే రాయడానికి అర్హులని నిబంధన విధించారు. ఈ పరీక్షకు జిల్లాలో మొత్తం మీద 21335 మంది అభ్యర్థులు రాశారు. ఇందులో టెట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు కేవలం స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు మాత్రమే అర్హులు. ప్రస్తుతం అధికారిక లెక్కల మేరకు జిల్లాలో 199 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మాత్రమే డీఎస్సీకి ఖాళీలు చూపారు. అర్హత సాధించిన బీఈడీ అభ్యర్థులు ఈ పోస్టులకు మాత్రమే పోటీపడాల్సి ఉంటుంది. దీంతో వారి పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. పెద్దఎత్తున ఆందోళనలకు సిద్ధమవుతున్నారు.

Monday, 30 January 2012

కాణిపాకం ఆలయ హుండీలో వాచ్ కలకలం

చిత్తూరు జిల్లా ఐరాల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి ఆలయ ఆవరణలోని హుండీలో బాంబు ఉందని సోమవారం కలకలం రేగింది. నాలుగు గంటల ఉత్కంఠ అనంతరం ఎలక్ట్రానిక్ రిస్ట్‌వాచ్ అని తేలడంతో గ్రామస్థులు, అధికారులు, భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.కాణిపాక వరసిద్ధి ఆలయ ఆవరణలో సోమవారం వేకువజామున ఉన్నట్లుండి టైమ్ బాంబుకు సంబంధించిన బీప్ శబ్దం నెమ్మదిగా వినిపిస్తోంది. ఈ విషయాన్ని గమనించిన ఆలయ హోంగార్డులు క్షుణ్ణంగా పరిశీలించగా ప్రధాన ఆలయ గర్భగుడి పక్కనే ఉన్న అద్దాల మండపం వద్ద ఏర్పాటు చేసిన హుండీ నుంచి ఈ శబ్దం వస్తున్నట్లు గుర్తించారు. వెంటనే అప్రమత్తమై ఉలిక్కిపడ్డ అధికారులందరూ హుటాహుటిన ఆలయం వద్దకు చేరుకుని హుండీని పరిశీలించి, బాంబు స్క్వాడ్‌కు సమాచారమిచ్చారు. శబ్దం వస్తున్న హుండీ స్వామివారి దర్శనానికి వెళ్లే క్యూలైన్లకు ఆనుకుని ఉండటంతో భక్తులను దర్శనానికి అనుమతించలేదు. నిబంధనల మేరకు తాళాలు చిత్తూరు ఏసీ కార్యాలయంలో ఉండటంతో హుండీ తెరవడానికి మూడు గంటలకుపైగా సమయం పట్టింది.తాళాలు వచ్చిన తర్వాత బాంబుస్క్వాడ్ సిబ్బంది సురేష్ ద్వారా హుండీని నెమ్మదిగా తెరిపించారు. అందులో ఎలక్ట్రానిక్ రిస్ట్ వాచ్ కనపడటంతో ఆలయాధికారులు, భక్తులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. దీంతో నాలుగు గంటల ఉత్కంఠకు తెరపడింది.

సిబిఐ వెనుక రాజకీయ కుట్ర...విజయమ్మ

సిబిఐ దర్యాప్తు వెనుక రాజకీయ కుట్ర కనిపిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు విజయమ్మ ఆరోపించారు. ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కు ఆమె ఒక లేఖ రాశారు. మే 2009కి ముందు ఏ రాజకీయ హొదా లేని జగన్మోహన రెడ్డిని విచారించడం రాజకీయ కుట్రలో భాగమేనన్నారు. సిబిఐ కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. నిర్ణయాలు తీసుకున్న మంత్రులను వదిలిపెట్టి, వైఎస్ కుటుంబ ప్రతిష్టని దెబ్బతీసే విధంగా సిబిఐ వ్యవహరిస్తోందని తెలిపారు. జగన్ కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని సాక్షులను సిబిఐ బెదిరిస్తోందన్నారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో స్టైలిష్ హొం ఎండి రంగారావుని ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆమె ప్రశ్నించారు. అతనిని కేసు నుంచి తప్పించడానికి ప్రయత్నిస్తున్నారని ఆమఆరోపించారు.రంగారావుకు బెయిలు ఇవ్వడంలో సిబిఐ నిస్సిగ్గుగా వ్యవహరిస్తోందని స్పష్టమైందన్నారు. నిధులు దుబాయ్ కి తరలించిన కోనేరు ప్రసాద్ కుమారుడిపైన ఏవిధమైన చర్యలు లేవని తెలిపారు.అన్ని పార్టీలకు డబ్బు ఇచ్చానని కోనేరు ప్రసాద్ చెప్పారు. ఇప్పటి వరకు ఏ ఒక్క పార్టీ వారిని విచారించకుండా, ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారినే వేధిస్తున్నారని ఆ లేఖలో ప్రధానికి విజయమ్మ తెలిపారు. సిబిఐకి ఆధారాలు దొరక్కపోవడంతో విజయసాయి రెడ్డి అనుమతి లేకుండా నార్కో ఎనాలసిస్ పరీక్ష చేయించి, తప్పుడు నివేదిక సృష్టించారన్నారు.