Sunday, 18 December 2011
ఇంటర్నేషనల్ వెబ్ సైట్స్ సర్వేలో కాజల్ టాప్
ఎస్వీ పాలిటెక్నిక్ కళాశాలలో కంప్యూటర్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానం
ఎస్వీ పాలిటెక్నిక్ కళాశాలలో జనవరి 1వతేది నుండి ప్రారంభం కానున్న నూతన
బ్యాచ్లో వివిధ రకాల కంప్యూటర్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు
ప్రిన్సిపాల్ సుధాకర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కంప్యూటర్
ఫండమెంటల్స్, ఎంఎస్ ఆఫీస్, డిసిఏ, పిజిడిసిఏ, డిటిపి, సి, సిప్లెస్,
ప్లెస్, విబి అండ్ ఓరాకిల్, జావ, జావ2 ఇఇ, హార్డ్వేర్, నెట్వర్కింగ్,
మోబైల్ టెక్నాలజి, మల్టీమీడియా, పిజి డిప్లమా ఇన్ అడ్వాన్మ్ మల్టీమీడియా,
యానిమేషన్, ఆటోకార్డు, టాలీ తదితర కోర్సులకు ధరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
అభ్యర్థులు 10వ తరగతి పాస్ అయిన నిరుద్యోగులు, విద్యార్థులు, గృహిణులు,
ఉద్యోగులు దరఖాస్తులు చేసుకోవచ్చునన్నారు.
తిరుపతిని వరల్డ్క్లాస్ రైల్వేస్టేషన్గా అభివృద్ధి చేయడంపై ప్రత్యేక దృష్టి !
నేడు అనంతపురం లో మెగా జాబ్మేళా
నగర, పట్టణ యువతీ యువకులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఆదివారం
అనంతపురంలోని ఎస్ఎస్బీఎన్ కళాశాలలో మెగా జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు
నగర పాలక సంస్థ కమిషనర్ నీలకంఠారెడ్డి తెలిపారు. ఈ మేళాకు ఇరవై కంపెనీలు
హాజరవుతున్నాయన్నారు. ఇందులో తొమ్మిది ప్రముఖ కంపెనీలు ఉన్నాయని
వెల్లడించారు. శనివారం ఆయన తన ఛాంబర్లో విలేకరులతో మాట్లాడారు. రాజీవ్
యువకిరణాలు పథకంలో భాగంగా అనంత నగర పాలక సంస్థ, జిల్లాలోని మున్సిపాలిటీలు,
అర్బన్ ఐకేపీ సంయుక్తంగా ఈ జాబ్మేళా నిర్వహిస్తున్నాయన్నారు. తొమ్మిది
ప్రముఖ కంపెనీలు 533 మందికి ఉద్యోగాలు కల్పిస్తాయన్నారు. మరో 11
సంస్థలు కూడా పలువురిని నియమించుకుంటాయని తెలిపారు. కేప్ కాఫీ డే సంస్థ
కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ పోస్టులు 115, ఫ్యూచర్ రిటైల్స్ సంస్థ టీమ్
మెంబర్ పోస్టులు 60, బాటా బిర్లా సంస్థ కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ పోస్టులు
18, జోయలుక్కాస్ సంస్థ కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ పోస్టులు 100, పీటీవీపీ
లిమిటెడ్ సంస్థ టోల్ ప్లాజా సపోర్ట్ టీమ్ పోస్టులు 50, పాన్టాలూన్ సంస్థ
కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ పోస్టులు 30, ఆదిత్యా బిర్లా సంస్థ టీమ్ మెంబర్
పోస్టులు 50, అపోలో ఫార్మసీ సంస్థ టీమ్మెంబర్ పోస్టులు 50, షాపర్ స్టాప్
సంస్థ టీమ్ మెంబర్ పోస్టులు 60 భర్తీ చేస్తాయన్నారు. 18 -35 ఏళ్ల లోపు వారు
విద్యార్హతకు సంబంధించిన ఒరిజినల్, జిరాక్స్ సర్టిఫికెట్లతో హాజరు
కావాలన్నారు. ఎంపికైన వారికి అపాయింట్మెంట్ ఆర్డర్ వెంటనే ఇస్తారన్నారు.
Saturday, 17 December 2011
వెంకటేష్ సినిమాలో.. మహేష్ బాబు తమ్ముడి పాత్రలో!
కుల, ఆదాయ, నివాస ధృవీకరణ పత్రాలు కావాలంటే రుసుం వసూలు!
కుల, ఆదాయ, నివాస ధృవీకరణ పత్రాలు కావాలంటే గ్రామ కార్యదర్శి, మండల
రెవెన్యూ ఇన్స్పెక్టర్ తదుపరి తహశీల్దార్ సంతకాలు కావాలి. వీరిలో ఎవరు
లేకున్నా వీటి కోసం ఆగాల్సిందే. దీంతో పాటు వారి స్థాయిని బట్టి అక్కడి
ప్రాంతాల పరిస్థితులను బట్టి ఆమ్యామ్యాలు ఇచ్చుకోవాల్సిందే. ఇక
రిజిస్ట్రేషన్ శాఖకు వెళితే ఇక్కడా ఇదే తంతు. రోజులకు రోజులు వేచి ఉండడంతో
పాటు దళారుల బెడద ఉండనే ఉంది. వీటన్నింటికీ త్వరలోనే చరమగీతం పాడనుంది.
దాదాపుగా 12 రకాల ధృవీకరణ పత్రాలు 15 నిమిషాల వ్యవధిలోనే నామమాత్రపు రుసం
చెల్లించి తీసుకునే వెసులుబాటు రానుంది. ఇందుకుగానూ యూజర్ ఛార్జీల పేరుతో
రూ. 30 వరకూ నామమాత్రపు రుసుము వసూలు చేస్తారు. ఇలా ఇప్పటి వరకూ పట్టణాలకే
పరిమితమైన కంప్యూటరీకరణ ఇక పల్లెలకూ విస్తరించనుంది. ముఖ్యంగా అన్ని
పంచాయతీలనూ కంప్యూటరీకరించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మొదటి విడత
కింద జిల్లాలోని 27 మండలాల పరిధిలో 34 గ్రామ పంచాయతీల కంప్యూటరీకరణ
ప్రాంరంభమైంది. రాబోయే రోజుల్లో అన్ని పంచాయతీలను కంప్యూటరీకరించున్నారు.
పంచాయతీకి సంబంధించిన ఆస్థి పన్ను, నిధుల వ్యయం తదితర అంశాలన్నింటినీ
కంప్యూటరీకరించి ఆన్లైన్లో ఉంచనున్నారు. మీ సేవ పేరుతో ఇప్పటికే రాష్ట్ర
ప్రభుత్వం రెవెన్యూ, రిజిస్ట్రేషన్ సేవలను కంప్యూటరీకరించనున్నారు.
ప్రభుత్వం ఇప్పటికే గ్రామ పంచాయతీల సేవలన్నింటినీ కంప్యూటరీకరించే
కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆస్థిపన్ను, నిధుల వ్యయం, జనన మరణ
ద్రువీకరణ పత్రాలు తదితర అంశాలన్నింటినీ కంప్యూటరీకరించి ఆన్లైన్
చేయనున్నారు.
సచిన్ టెండూల్కర్కు భారతరత్న!
Subscribe to:
Posts (Atom)