Showing posts with label వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు. Show all posts
Showing posts with label వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు. Show all posts

Monday, 28 November 2011

ఎడ్లబండి ఎక్కిన వైయస్ జగన్‌

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ గుంటూరు జిల్లా ఓదార్పు యాత్రలో ప్రజలను ఆకర్షించే పనికి పూనుకున్నారు. ఆయన పాలమర్రు గ్రామంలో ఎడ్ల బండిపై ఎక్కి సవారీ చేశారు. ఓదార్పు యాత్రలో భాగంగా ఆయన సోమవారం సాయంత్రం ఆ గ్రామానికి చేరుకున్నారు. అక్కడ ఎడ్లబండి ఎక్కిన వైయస్ జగన్‌ను చూడడానికి పెద్దయెత్తునే ప్రజలు వచ్చారు. గుంటూరు జిల్లాలో ఆయన రెండ విడత ఓదార్పు యాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
అంతకు ముందు తన ఓదార్పు యాత్రలో ఆయన ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పత్రి రైతులకు గిట్టుబాటు ధర దక్కడం లేదని ఆయన అన్నారు. పత్తి పంట దిగుబడి 15 క్వింటాళ్ల వరకు ఉండేదని, ఇప్పుడు విద్యుత్ లేకపోవడం వల్ల నాలుగు క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితి లేదని ఆయన అన్నారు. గత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం 6 వేల రూపాయల గిట్టుబాటు ధర కల్పిస్తే రాష్ట్ర ప్రభుత్వం 3 వేల 600 రూపాయలతో సరిపెడుతోందని ఆయన అన్నారు. ప్రస్తుత పరిస్థితిలో గ్రామీణ ఆర్థిక పరిస్థితి సరిగా లేదని, అయినా పట్టించుకునే వారే లేరని ఆయన అన్నారు