Showing posts with label పాటిల్ వేణుగోపాలరెడ్డి. Show all posts
Showing posts with label పాటిల్ వేణుగోపాలరెడ్డి. Show all posts

Saturday, 21 January 2012

జెసి బ్రదర్స్ రాజకీయడ్రామా

రాయదుర్గం నియోజకవర్గం టిడిపి ఇన్‌చార్జిగా గుణపాటి దీపక్‌రెడ్డిని ఆ పార్టీ అధిష్టానం నియమించడంతో జిల్లా లో జెసి బ్రదర్స్ ఆడుతున్న రాజకీయడ్రామా బహిర్గతమయ్యిందని డిసిసి అధ్యక్షులు పాటిల్ వేణుగోపాలరెడ్డి అన్నారు. పట్టణంలోని కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో  ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో పాటిల్ వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ జిల్లా లో గత సంవత్సరం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో తాను ఓడిపోడానికి ము ఖ్యంగా జెసిబ్రదర్స్ కీలకపాత్ర పోషించారని ఆరోపించారు. ఎన్నికలకు మూడురోజుల ముందు టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడుతో జెసి బ్రదర్స్ కుదుర్చుకున్న ఒప్పందం మేరకే జెసి ప్రభాకరరెడ్డి అల్లుడు దీపక్‌రెడ్డిని ఈరోజు నియోజకవర్గం ఇన్‌చార్జిగా నియమిస్తూ ప్రాధాన్యతను ఇచ్చారని వివరించారు. తనను ఓడించాలన్న ధ్యే యంతోనే ఇలాంటి రాజకీయకుట్రను నాటకీయంగా నడిపిన జెసి బ్రదర్స్‌పై ఎన్నికల సమయంలోనే వదంతులు వచ్చాయని ఆ వదంతులు నేడు నిజం అయ్యాయని తెలిపారు. ఈ నియోజకవర్గంలో దీపక్‌రెడ్డితో రాజకీయ అరంగేట్రమ్ చేయించాలన్న కుట్రపూరిత రాజకీయ పన్నాగమే నేడు బహిర్గతమయ్యిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీలోవుంటూ అనేక పదవులను అనుభవించిన జెసి దివాకరరెడ్డి పార్టీకి ద్రోహంచేస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగావున్న తనను ఓడించిన విషయాన్ని గుర్తుచేశారు. ఇలాంటి రాజకీయ డ్రామాలు ఆడుతున్న జెసి దివాకరరెడ్డి పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడంపై తాను తీవ్రంగా మనస్థాపం చెందానని ఇలాంటివి భవిష్యత్తులో కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థులకు జరుగరాదని అన్నారు. ఈ విషయంలో అప్పటికే పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందని కాని అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాల్సివుందని పాటిల్ వేణుగోపాలరెడ్డి ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.