బాలకృష్ణ, నయనతార కాంబినేషన్ లో బాపు రూపొందించిన శ్రీరామ రాజ్యం చిత్రం రీసెంట్ గా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అందరికన్నా సీతగా వేసిన నయనతారకే ఎక్కువ మార్కులు పడ్డాయి. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ బాలకృష్ణకే ఈ క్రెడిట్ మొత్తం దక్కుతుందన్నారు. ఆమె మాటల్లోనే... గతంలో మేమిద్దరం కలిసి సింహా సినిమాకి పనిచేసాం. శ్రీరామ రాజ్యం వంటి సినిమాలో చెయ్యటానకి ఆయనే కారణం. ఆయనే నేను సీత పాత్రకు న్యాయం చేయగలనని నమ్మి ఆ పాత్రను రికమెండ్ చేయటం జరిగింది
ప్రేమ జంట నయనతార,ప్రభుదేవాలు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అనే మ్యాటర్ పై మీడియాలో చాలా కాలంగా ఊహాగానాలు జరుగుతన్నాయి.ఈ నేపధ్యంలో ఈ ప్రేమికులు తమ పెళ్ళిని ప్రేమికుల రోజైన పిభ్రవరి 14 న చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.ఈ విషయాన్ని నయనతారకు సన్నిహితుడైన ఓ తమిళ దర్శకుడు చెప్పినట్లుగా తమిళ మీడియా ప్రచారం చేస్తోంది.అంతేగాక..నయనతార కేరళలోని కొచ్చికి సమీపంలో ఉన్న ఓ దీవిలో నయనతార మంచి ఇల్లు కట్టిస్తున్నారని చెప్తున్నారు.పెళ్లి సందర్భంగా ప్రభుదేవాకి ఆమె ఇవ్వబోతున్న కానుక ఇది అని అక్కడ మీడియా చెప్తోంది.ఇక వివాహానంతరం ఈ దంపతులు ముంబయిలో సెటిలవ్వాలనుకుంటున్నారని సమాచారం