
ఒకప్పుడు నటి శ్రియ దక్షిణాది భాషల్లో టాప్లో ఉండేది. రానురాను కొత్త నీరు
రావడంతో పాత నీరు వెనక్కువెళ్ళినట్లు ఈ ముద్దుగుమ్మకు సినిమాలు
తగ్గిపోయాయి. అదేసమయంలో బాలీవుడ్లో కాలుపెట్టి.. అడపాదడపా నటిస్తోంది.
టాలీవుడ్లో టాప్ హీరోలందరితోనూ నటించిన సెక్సీభామ శ్రియ. ఇప్పుడు
కెరీర్లో చాలా కష్టాలు ఎదుర్కొంటోంది.ఇటీవల శ్రియకు ఓ చేదు అనుభం
ఎదురయ్యింది. గోవా నుంచి ముంబాయ్ వెళ్లడానికి జెయిట్ ఎయిర్ వేస్ లో
ఫ్లైయిట్ టిక్కెట్ బుక్ చేసుకుందట. కానీ ఎయిర్ పోర్ట్ కి వెళ్లిన తర్వాత
ఆమెకు ఓ చేదు అనుభవం ఎదురయ్యిందట. మంచు పట్టెయ్యడంతో విమానం వెళ్లే వీలు
లేనందున క్యాన్సిల్ చేసారట. కానీ ఆ విషయాన్ని ఎనౌన్స్ చేయలేదని శ్రియ
మండిపడుతోంది. తనంతట తాను వెళ్లి అడిగితే కూల్ గా..వాతావరణం బాగా లేదు.
ఫ్లైయిట్ క్యాన్సిల్ చేసాం అన్నారట. ఇంత నిర్లక్ష్యం తగదని, ఓ ప్లయిట్
క్యాన్సిల్స్ అయినప్పుడు ఆ విషయాన్ని ప్రయాణీకులకు ప్రకటించాల్సిన బాధ్యత
ఎయిర్ పోర్ట్ వారిదేనని వాదిస్తోంది శ్రియ.