Showing posts with label టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు. Show all posts
Showing posts with label టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు. Show all posts

Sunday, 8 January 2012

విభేదాలున్నా సర్దుకుంటా...టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు

ప్రోటోకాల్ వీఐపీ దర్శనంలో మూడు కేటగిరిల విధానం రద్దు చేయనున్నట్టు టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు తెలిపారు. వచ్చే పాలకమండలి సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్టు చెప్పారు. వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలలో ఎమ్మెల్యేలకు కలిగిన అసౌకర్యానికి ఆయన క్షమాపణ కోరారు. రెండో బ్రహ్మోత్సవాల గురించి ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ఈవో, జేవోలతో విభేదాలు లేవని, ఒకవేళ ఉన్నా తానే సర్దుకుంటానన్నారు. అన్నదానంలో కల్తీ బియ్యాన్ని పరిశీలిస్తున్నామని, త్వరలో టెండర్ మారుస్తామని బాపిరాజు తెలిపారు.