Showing posts with label అనంపుతరం. Show all posts
Showing posts with label అనంపుతరం. Show all posts

Friday, 28 October 2011

అనంపుతరం జిల్లాలో బంగారు నానో తన మెరుపులతో చూపరులను ఆకట్టుకుంటుంది

శ్రీ సత్యసాయి సన్నిధానానికి ప్రాచుర్యమైన అనంపుతరం జిల్లాలో బంగారు నానో తన మెరుపులతో చూపరులను ఆకట్టుకుంటుంది. దేశంలో స్వర్ణాభరణాల తయారీ మొదలై 5,000 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వర్ణకారుల జ్ఞాపకార్థం టాటా మోటార్స్ ఈ గోల్డ్ నానో కారును రూపొందించి. భారతదేశంలో ఒక్కోప్రాంతాని సంబంధించిన ఒక్కొక్క డిజైన్‌ను ఈ గోల్డ్ నానోపై చూడవచ్చు.

                           గత నెలలో టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటా ఈ బంగారు నానో (గోల్డెన్ నానో) ఆవిష్కరించారు. టాటా గ్రూపులోని స్వర్ణాభరణాల విభాగం అయిన 'టాటా గోల్డ్ ప్లస్' కంపెనీ ప్రచారంలో భాగంగా ఈ బంగారు నానో కారును దేశవ్యాప్తంగా ఉన్న అన్ని గోల్డ్ ప్లస్ అవుట్‌లెట్లలో ఈ కారును ప్రదర్శనకు ఉంచనున్నారు. ఇందులో భాగంగానే కంపెనీ తమ బంగారు నానో కారును అనంతపురం జిల్లాలో కూడా ప్రదర్శనకు ఉంచింది.

గోల్డ్ నానో తయారీ కోసం 80 కేజీల స్వచ్ఛమైన బంగారాన్ని, 15 కేజీల వెండిని మరియు 10,000 రత్నాలను ఉపయోగించారు. ఈ బంగారు నానో కారు తయారీకి కంపెనీ సుమారు రూ.22 కోట్లకు పైగా ఖర్చు చేసింది