Thursday, 8 March 2012

టీమిండియాకు టెస్టుల మీద ఆసక్తి లేదు....మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్

భారతీయుల్లో నాయకత్వ లక్షణాలు చాలా తక్కువ ఉంటాయని, దీనికి అక్కడి కట్టుబాట్లే కారణమన్నాడు. భారత్‌లో పిల్లలపై చిన్నప్పటి నుంచే ఒత్తిడి అధికంగా ఉంటుందని, పాఠశాలల్లో ఉపాధ్యాయులు, ఇంట్లో తల్లిదండ్రులు ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటారన్నాడు. దీంతో పెద్దవారైన తర్వాత చాలా మంది భారతీయులు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేక పోతారన్నారు. ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న భారత్‌ కావాలనే టెస్టులను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తుందన్నాడు. ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా సిరీస్‌లలో క్లీన్‌స్వీప్‌ కావడమే దీనికి నిదర్శనమన్నాడు.టీమిండియా మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ మరోసారి భారత్‌పై విరుచుకుపడ్డాడు. స్వతహాగా నోటి దురుసు ఎక్కువ కలిగి.. పదవి ఊడి ఐదేళ్లవుతున్నప్పటికీ అప్పడప్పుడు భారత్ గురించి ఏదో ఒక వ్యాఖ్యలు చేస్తూ వార్తుల్లో ఉంటున్నాడు. అడిలైడ్‌లో ఓప్రముఖ వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడుతూ ‘భారత్‌కు టెస్టుల మీద ఆసక్తి లేదు. ఎందుకంటే వాళ్లకు ఈ ఫార్మాట్ చాలా కష్టం. ఆస్ట్రేలియాలో వాళ్ల ఆట దారుణం. ఆ జట్టులోని అనేక మందితో నేను కలిసి పని చేశాను. వాళ్ల గురించి నాకు తెలుసు. టి20, వన్డేలు ఆడి డబ్బు సంపాదించుకోవాలని అనుకుంటారు. అందుకే వారికి టెస్టులు ఆడటం కష్టంగా ఉంది’ అని అన్నారు.ధోనిలో నాయకత్వ లక్షణాలను నేను మొదట్లోనే గమనించాను. మూడేళ్లుగా కెప్టెన్‌గా, కీపర్‌గా, భారీ లక్ష్యాలను సాధించే బ్యాట్స్‌మెన్‌గా చాలా బాధ్యతలు పోషిస్తున్నాడు. అతడు దొరకడం టీమిండియా అదృష్టం. ప్రస్తుతం డ్రెస్సింగ్‌రూమ్‌లో వాతావరణం వల్ల ధోని టెస్టులను వదులుకునే అవకాశం ఉందన్నాడు. సెహ్వాగ్‌కు కెప్టెన్ కావాలనే ఆశ ఎక్కువగా ఉందని, దీనివల్లే సమస్యలు వస్తున్నాయని గ్రెగ్‌చాపెల్ అన్నా రు. ‘కుంబ్లే రిటైర్ అయిన తర్వాత తానే కెప్టెన్ అవుతానని సెహ్వాగ్ అనుకున్నాడు. అలా జరగకపోవడంతో టీమిండియాలో విబేధాలు వచ్చాయని చాపెల్ తెలిపాడు.


 

No comments:

Post a Comment