Tuesday, 22 November 2011

కడప జిల్లాలోని ఫ్యాక్షన్ మళ్ళీ పగడలెత్తింది.

జిల్లాలోని ఫ్యాక్షన్ పగలు మళ్ళీ పగడలెత్తింది.  ప్రొద్దుటూరు, ఆర్టీవో కార్యాలయం వద్ద తండ్రీ, కొడుకులను ప్రత్యర్ధులు వేటకొడవళ్ళతో నరికివేశారు. ఈ ఘటన ఈ ప్రాంతంలో తీవ్ర సంచలనం కలిగించింది. మృతి చెందిన తండ్రీకొడుకులిద్దరూ చెన్నమరాజుపల్లెకు చెందిన సుబ్బరాయుడు, లక్ష్మీనారాయణలుగా పోలీసులు గుర్తించారు.వీరు ఓ హత్యా కేసులో నిందితులు, ఇటీవలె జైలు నుంచి విడుదలైనట్లు సమాచారం. వీరిద్దరూ ఈరోజు ఉదయం మోటారు బైక్‌పై వెళుతుండగా మాటు వేసిన ప్రత్యర్ధులు సుమో వాహనంపై వచ్చి, బైక్‌ను ఢీకొట్టి హతమార్చారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు

No comments:

Post a Comment