Wednesday, 12 October 2011

రచ్చబండ కార్యక్రమాన్ని వచ్చేనెల 2వ తేదీకి వాయిదా వేశారు

                                                                                              నెల 15 నుంచి జరగాల్సిన రెండో విడత రచ్చబండ కార్యక్రమాన్ని ప్రభుత్వం వాయిదా వేసింది. నవంబరు 2 నుంచి ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. రచ్చబండపై సచివాలయంలో సమీక్ష నిర్వహించిన మంత్రుల బృందం అందజేసిన నివేదిక మేరకు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
                                                            
                                                                
   
పేద, బలహీన వర్గాలపై వరాల జల్లులు కురిపించేందుకు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సన్నాహాలు చేస్తున్నారు. రెండో విడత రచ్చబండ కార్యక్రమంలో దాదాపు 38 లక్షల మందికి లబ్ధి చేకూర్చే దిశలో భారీ ప్రణాళికను సిద్ధం చేశారు. వాస్తవానికి ఈ నెల 15 నుంచి జరగాల్సిన రచ్చబండ కార్యక్రమాన్ని సకల జనుల సమ్మె నేపథ్యంలో వాయిదా వేశారు. ఓ వైపు ఉద్యమంతో పాలన కుంటుపడుతున్న నేపథ్యంలో రచ్చబండకు వెళ్లడం వల్ల మరింత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయని, ఎప్పుడైనా ఢిల్లీ నుంచి పిలుపు వచ్చే అవకాశాలూ ఉండడంతో సీఎం రచ్చబండను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఈ నెల 15 నుంచి రైల్ రోకోకు పొలిటికల్ జేఏసీ సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో రచ్చబండ పేరుతో టూర్ వెళ్లకుండా, ఇక్కడే ఉండి పరిస్థితిని సమీక్షించడం, అవసరమైన ఆదేశాలివ్వడం ఉత్తమమని సీఎం నిర్ణయించినట్లు ఆయన ఆంతరంగికులు చెబుతున్నారు. దీంతో రచ్చబండ కార్యక్రమాన్ని వచ్చేనెల 2వ తేదీకి వాయిదా వేశారు

No comments:

Post a Comment