Tuesday, 1 November 2011

బాలయ్య కొన్ని విమర్శలు

నందమూరి హీరో బాలయ్య నటించిన ‘శ్రీరామ రాజ్యం’ ఆడియో అభినందన సభ సోమవారం రాత్రి జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో బాలయ్య కొన్ని విమర్శలు సంధించారు. "చరిత్ర తెలియని వారు తెలుగు సినిమాల గురించి చాలా చిన్నతనంగా మాట్లాడారు. ఒకాయన మాట్లాడుతూ.. తెలుగులో ఏమున్నాయండి.. సరైన సినిమాలు.. సరైన డైరెక్టర్లే లేరు... అంటూ ఏదోదే వాగాడు. నేను వెంటనే... చరిత్ర తెలియకుండా మాట్లాడకు. మాట్లాడేముందు నోరు కంట్రోల్‌ చేసుకో! మీకు తెలుగు దర్శకుల గురించి మాట్లాడే హక్కులేదు. ఆదిత్య 369, భైరవద్వీపం వంటి సినిమాలు తీసింది తెలుగువారు కాదా?" అని అన్నారు
                            .

ఈ వాఖ్యలు మెగా వాసరుడు రామ్ చరణ్ ను ఉద్దేశించి అన్నవే అనే వాదన వినిపిస్తోంది ఫిల్మ్ నగర్లో..., సూర్య, మురుగదాస్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'సెవెన్త్‌ సెన్స్‌' సినిమా ప్రమోషన్‌లో మురుగదాస్‌ను, సూర్యను పొగడ్తల్తో ముంచెత్తాడు రామ్ చరణ్. రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌లు కూడా ఇటువంటి పాత్రలు చేయడం సూర్యకే సాధ్యం. మాకు సాధ్యం కాదంటూనే... మురుగదాస్‌ వంటి గొప్ప దర్శకుడు తెలుగులో లేరు అని వ్యాఖ్యానించారు. దీంతో అప్పుడు బాలయ్య రామ్ చరణ్, అల్లు అర్జున్ కు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. తాజాగా నిన్న రాత్రి బాలయ్య ఇదే విషయాన్ని లేవనెత్తడంతో.....సర్వత్రా 
చర్చనీయాంశమైంది

శ్రీరామరాజ్యం సినిమా కార్తీక పౌర్ణమి ఈనెల 15న ప్రేక్షకుల ముందుకు

వెండితెరపై రాముడంటే ఎన్టీవోడే. మరి, బాలయ్య ఎలా ఉంటాడు? ఇప్పటికే కృష్ణుడిగా మెప్పించిన బాలకృష్ణ శ్రీరాముడి గెటప్‌లో వెలిగిపోతున్నాడు. బాపు దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీరామరాజ్యం ఈనెల 15న ప్రేక్షకుల ముందుకు దూసుకొస్తోంది. వెండితెర అందగాడు బాలకృష్ణ రాముడి వేషమిది. శ్రీరామరాజ్యం స్టిల్స్‌ని చిత్ర యూనిట్‌ రిలీజ్‌ చేసింది. ఫస్ట్‌లుక్‌లో బాలయ్య కేక పెట్టిస్తున్నాడు. రామాయణ ఘట్టాల్ని తెరకెక్కించడంలో తనదైన స్టైల్‌ని కనబరిచే అగ్రశ్రేణి దర్శకుడు బాపు నిర్దేశకత్వంలో బాలయ్య అలరిస్తున్నాడు    
                                 
ఆహార్యంలో..., వేషధారణలో... నఖశిఖ పర్యంతం తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ స్పష్టంగా కనిపిస్తోంది. రొటీన్‌ సినిమాల నుంచి భిన్నంగా శ్రీరామరాజ్యం నిలుస్తుందని చిత్ర యూనిట్‌ ఆశాభావం వ్యక్తం చేసింది. నవ్యతకు కొదవలేని సృజనాత్మక సాంకేతిక నిపుణులు మన దగ్గరా ఉన్నారని, గతాన్ని ఓసారి పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుందని బాలయ్య అన్నారు. బాలయ్యతో పాటు లక్ష్మణుడిగా శ్రీకాంత్, సీతగా నయనతార పాత్రల్ని ఛాలెంజింగ్‌గా తీసుకుని నటించారని చిత్ర యూనిట్‌ చెప్తోంది. శ్రీరామరాజ్యం సినిమా కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈనెల 15న ప్రేక్షకుల ముందుకు వస్తోంది

పెట్రోవాత లీటరుకు రూ.1-80పైసలు పెరిగే అవకాశం

                                   
పెట్రోవడ్డన మరోసారి వినియగదారుల నడ్డి విరచనుంది. ఇటీవల లీటరుకు ఐదు రూపాయలు పెంచిన సర్కార్‌ నాలుగు నెలల వ్యవధిలోనే మళ్ళీ పెట్రోవాత పెట్టేందుకు రెడీ అవుతోంది. లీటరకు రూపాయి ఎనభై పైసల నుంచి రెండు రూపాయల వరకు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెట్రోలియం కంపెనీలు నష్టాలను మూటగట్టుకుంటున్నాయంటూ ఓసాకును చూపి ప్రజలపై మోయలేని భారం మోపుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి

నేటి నుంచి రూపాయికి కిలో బియ్యం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కిలో రూపాయి బియ్యం పధకం ఇవాల్టి నుండి ప్రారంభం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఖైరతాబాద్‌లో లాంఛనంగా ప్రారంభిస్తారు. రాష్ట్రంలోని దారిద్య్ర రేఖకు దిగువనున్న 2 కోట్ల 26 లక్షల కుటుంబాలకు మేలు జరుగుతుందని అంచనా. దీని వల్ల రాష్ర్టంలోని 7.5 కోట్ల మంది నిరుపేదలకు లబ్ది చేకూరనుంది. 

తెల్ల రేషన్ కార్డు దారులందరికీ రేషన్‌ దుకాణాల ద్వారా కిలో రూపాయికే బియ్యం పంపిణీ చేయడం వల్ల 6వందల కోట్ల భారం పెరుగుతుందని అంచనా.1983లో బహిరంగ మార్కెట్‌లో బియ్యం ధర రెండున్నర ఉండగా ప్రభుత్వం పేదల కోసం కిలోకు రెండు రూపాయలకే ఎన్టీఆర్ సర్కార్ పంపిణీ చేసింది. అప్పట్లో అదో సంచలనం. 1996లో చంద్రబాబు సబ్బిడీ బియ్యం ధరను మూడున్నర రూపాయలకు పెంచా

Monday, 31 October 2011

కర్నూలు జిల్లా లో 300 ఏళ్ల నాటి శివాలయ ముఖ మంటపం కూలిపోయింది

కర్నూలు జిల్లా ఆత్మకూరులో 300 ఏళ్ల నాటి శివాలయ ముఖ మంటపం సోమవారం కూలిపోయింది. కార్తీక మాసం మొదటి సోమవారం పురస్కరించుకుని ఆలయానికి విద్యుద్దీపాలంకరణ చేసేందుకు మౌలాలి అనే కార్మికుడు ఆలయం పైకి ఎక్కగా ఈ ఘటన చోటుచేసుకుంది. అతడికి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

పూర్వం శ్రీశైల మల్లిఖార్జునుని దర్శించుకునేందుకు మహర్షులు ఆత్మకూరు మీదుగా కాలినడకన వెళ్లే సమయంలో ఓ భారీ రాతిబండను పంచలింగాల ఆకృతిలో మలచి స్వయంభూ పరమేశ్వరుడిని రూపొందించి పూజలు చేశారన్నది చరిత్ర. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న ఈ ఆలయానికి 300 ఏళ్ల క్రితం భక్తులు ముఖమండపాన్ని నిర్మించారు. అప్పటి నుంచి నిత్యపూజలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కార్తీక మాసం మొదటి సోమవారం నాడు ముఖమంటపం కూలిపోవడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు

యువరాజ్ సింగ్ దేశ రాజధానిలో తొలి ఇండోర్ క్రికెట్ శిక్షణ కేంద్రం ప్రారంభించారు

                                            
తన చిరకాల స్వప్నమైన ‘యువరాజ్ సింగ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్’ను భారత క్రికెట్ క్రీడాకారుడు యువరాజ్ సింగ్ సోమవారం గుర్గావ్‌లో ప్రారంభించారు. ఈ క్రికెట్ అకాడమీలో యువ క్రికెట్ క్రీడాకారులకు అత్యాధునిక సౌకర్యాలతో శిక్షణను అందించనున్నాడు. నైపుణ్యం కలిగిన కోచ్‌ల సహాయంతో ఇండోర్, అవుట్ డోర్ శిక్షణ సౌకర్యాల్ని అందించనున్నాడు. దేశ రాజధానిలో తొలి ఇండోర్ క్రికెట్ శిక్షణ కేంద్రంగా ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ క్రికెట్ అకాడమీలో బౌలింగ్ యంత్రాలతోపాటు, జిమ్, స్విమ్మింగ్ పూల్ సౌకర్యాలను యువరాజ్ సింగ్ ఏర్పాటు చేశారు. స్కూల్ విద్యార్థులతోపాటు, ఇతర వర్గాలకు కూడా అకాడమీ అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు

తిరుపతి రైల్వే స్టేషన్‌లో పది చెల్లిస్తే ఏసీ గదుల్లో విశ్రాంతి తీసుకోవచ్చు

రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫాం నుంచి ఏసీ క్లాస్ టిక్కెట్లు కొన్నవారందరూ రూ. పది చెల్లిస్తే ఏసీ గదుల్లో విశ్రాంతి తీసుకోవచ్చు. దీన్ని ప్రయోగాత్మకంగా తిరుపతిలో ప్రారంభించారు. ఇది సఫలమైతే ఈ విశ్రాంతి గదుల నిర్వహణను ప్రైవేటుపరం చేసే అవకాశముంది. ప్రధాన రైల్వే స్టేషన్‌లో ఏసీ, స్లీపర్ సాధారణ క్లాస్‌లలో ప్రయాణించే వారే రైలు వచ్చే వరకు ఏసీ గదుల్లో ఉచితంగా విశ్రాంతి తీసుకోవచ్చు.

ఇక స్లీపర్ క్లాస్ ప్రయాణికులు స్లీపర్ క్లాస్ విశ్రాంతి గదుల్లో ఉండొచ్చు. వీరు తమ టిక్కెట్లను గదుల రికార్డులో నమోదు చేసి ఉచితంగా విశ్రాంతి తీసుకుంటారు. ఇకపై రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫారం టిక్కెట్ కొన్న ప్రతి ఒక్కరు రూ. పది చెల్లించి ఏసీ గదుల్లో మూడు గంటల పాటు విశ్రాంతి తీసుకోవచ్చు. ప్రస్తుతం దీనిపై ప్రచారం లేకపోవడంతో పెద్ద సమస్యగా లేదు. ఒకవేళ అందరూ రూ. పది చెల్లించి ఏసీ గదుల్లో విశ్రాంతి తీసుకోవాలంటే తిరుపతిలో సాధ్యమేనా అనే ప్రశ్న తలెత్తుతోంది.

ఎందుకంటే స్టేషన్‌లో ఉండేవి రెండు ఏసీ విశ్రాంతి గదులే. అందులో 80 సీట్లు ఉన్నాయి. తిరుపతి నుంచి వెళ్లే ఏసీ క్లాస్ ప్రయాణికులకే ఇవి చాలవు. అలాంటిది అందరూ విశ్రాంతి కోసం వస్తే ఎలా సాధ్యమని అధికారులు తలలు పట్టుకుంటున్నారు