Sunday, 11 March 2012

రాయలసీమకు ఈ బడ్జెట్‌లో రైల్వే అభివృద్ధి సాధిస్తాం

రైల్వే పరంగా మరింత అభివృద్ధి సాధించడానికి ప్రయత్నం చేయడంతో పాటు కరువు జిల్లా అయిన అనంతపురానికి రైల్వే పరిశ్రమను మంజూరు చేయాలని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ను అభ్యర్థించి నట్లు అనంతపురం ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి వెల్లడించారు. శనివారం సాయంత్రం గుంతకల్లు రైల్వే జంక్షన్‌లోని ప్లాట్‌ఫామ్-1, 2లో ఏర్పాటు చేసిన గుంతకల్లు-తిరుపతి ప్యాసింజర్ రైలు ప్రారంభోత్సవ సభలో ఎంపీ ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఉపాధి అవకాశాలు లేక కరువు ప్రాంత యువత కష్టనష్టాల పాలవుతున్నారని, ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని గుంతకల్లు, గుత్తి రైల్వే జంక్షన్ల మధ్య రైల్వే పరిశ్రమ ఏర్పాటు చేయాలని రైల్వే బోర్డుకు, ప్రధాన మంత్రికి విన్నవించామని చెప్పారు.గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని వచ్చే అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల ఎంపీలతో కలిసి రైల్వే రంగం లో మరింత అభివృద్ధి సాధించడానికి రానున్న రోజుల్లో కృషి చేస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాదు-డోన్‌ల మధ్య నడిచే తుంగభద్ర రైలు ను గుత్తి లేదా గుంతకల్లు వరకు పొడిగించాలని కోరుతున్నామన్నారు. అలాగే పగటి పూట పుట్టపర్తి, దర్మవరంల నుంచి అనంతపురం, గుంతకల్లు మీదుగా హైదరాబాదుకు ఒక రైలును నడపాలని, బెంగళూరు-షిరిడీ మధ్య ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించాలని, చెన్నై-హైదరాబాదు నడుమ కొత్త రైలును నడపాలని, గుంతకల్లు మీదుగా హుబ్లీ ప్రాంతానికి మరిన్ని రైళ్లను ప్రారంభించాలని ప్రతిపాదనలు పంపామన్నా రు. గుంతకల్లు స్టేషన్‌ను ఆధునికీకరించేందుకు రూ.6 కోట్లు, గుంతకల్లులో బైపాస్ లైన్ నిర్మా ణం కోసం రూ.19 కోట్లు, పెన్నా బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని రైల్వే అధికారులను కోరుతున్నట్లు ఆయన చెప్పారు. గుత్తి-బెంగళూరు రైల్వే మార్గం విద్యుదీకరణ సర్వే కు రైల్వే బోర్డు గత ఏడాది అనుమతించిందని, ఈ పర్యాయం నిధులు మంజూరు చేయాలని బోర్డుపై ఒత్తిడి తేనున్నామని అన్నారు. కేంద్రం లో యూడీఎఫ్, ఎన్‌డీఏ ప్రభుత్వాలు ఉన్న సమయంలో రైల్వేలో అనంతపురం జిల్లాతో పాటు రాయలసీమ ప్రాంతానికి తీవ్ర అన్యా యం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ నష్టాన్ని పూడ్చుకునే దిశగా ప్రస్తుతం గట్టి ప్రయత్నాలే చేస్తున్నామని అన్నారు. యూడీఎఫ్, ఎన్‌డీఏ ప్రభుత్వాల హయాంలో గుంతకల్లు డివిజ న్‌ను కుదించడానికి ప్రయత్నాలు జరిగాయని, స్పష్టంగా చెప్పాలంటే నష్టం కూడా జరిగిందని అప్పటి ప్రభుత్వ పెద్దల తీరును ఎంపీ విమర్శించారు. అనంతరం గుంతకల్లు ఎమ్మె ల్యే మధుసూదన్‌గుప్తా మాట్లాడుతూ మన ఆర్థి క ఎదుగుదలకు భారతదేశాన్ని ఒక్క తాటిపై తీసుకురావడానికి, సైన్యానికి సేవలు అందించే విషయంలో రైల్వే ఎనలేని సేవలు చేస్తోందన్నారు. అతి తక్కువ ఖర్చుతో ప్రయాణించడానికి రైల్వే అతి సులువైన రవాణా వ్యవస్థగా కొనియాడారు. గుత్తికి సమీపంలోనే ఇమామ్‌పురంలో రైళ్లను ఆపాలని, గుత్తి స్టేషన్‌ను మరింత అభివృద్ధి పరచాలని రైల్వే అధికారులకు విజ్ఞప్తి చేశారు.

No comments:

Post a Comment